Friday, September 23, 2011

చంద్రశేఖర్ ఆజాద్,చంద్రశేఖర్ సీతారాం తివారీ ,ChandraSekhar Azad



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -చంద్రశేఖర్ ఆజాద్(చంద్రశేఖర్ సీతారాం తివారీ ,ChandraSekhar Azad)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు,స్వాతంత్య్ర సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, త్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుదాం .

సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. ఆయనే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్.

కోర్టులో

తనను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్‌కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది-
‘‘నీ పేరేమిటి?’’ ‘‘ నా పేరు అజాద్,’’ ‘‘ తండ్రి పేరు’’ ‘‘స్వాధీన్,’’ ‘‘నీ ఇల్లెక్కడ’’ - ‘‘కారాగృహం.’’
ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకులనుంచి ‘్భరత్ మాతాకీ జై’ నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖవర్చస్సుకల ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో ‘16 కొరడాల దెబ్బలు’ అంటూ శిక్ష ప్రకటించాడు.నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే.. ఆ బాలుని శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినపుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుని ‘అజాద్’ అని పిలిచారు. అదే అతడి సార్ధక నామధేయం అయింది. శిక్షానంతరం , సేద తీర్చుకోమని (ఇది మరో అవమానం!) మూడు అణాలు ఇవ్వడం రివాజు. ఆ మూడు అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు అజాద్. బ్రిటిష్ పాఠశాల చదువు ఇష్టంలేని అజాద్ కాశీలో సంస్కృత విద్యాలయంలో చేరాడు.

ఆరోజుల్లోనే విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. అజాద్ జీవితంలో అదో పెద్ద మలుపు. బిస్మిల్ అడుగుజాడల్లో విప్లవ శంఖం పూరించాడు. ఉద్యమానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి తిరుగుబాటే మార్గం అవుతుందని సంకేతాలు ప్రజలకు అందించడం- ఆశయంగా పెట్టుకుని 1925లో జరిగిన కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్‌తో సహా యస్ఫతుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్‌సింగ్‌లను, బూటకపు విచారణ జరిపి ఉరితీసింది. మన్మధ దాస్‌గుప్తా, జోగీంద్ర చటర్జీ, ముకుందలాల్, రామకృష్ణ ఖత్రలకు పది పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అజాద్ మాత్రం తప్పించుకున్నాడు. ఆ తర్వాత అజాద్ మారువేషాలలో అనేక ఊళ్లు తిరిగాడు. వివిధ విప్లవ సంస్థలతో సంపర్కం పెట్టుకున్నాడు. తదుపరి ఫిరోజ్‌షా కోట్లలో భగత్‌సింగ్, భగవతీచరణ్, శివశర్మ, మరికొందరు విప్లవ వీరులతో కలిసి 1928 సెప్టెంబర్ 8న ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మి’ స్థాపించడం జరిగింది. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి జరిపాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంజాబ్ కేసరి నేలకొరిగాడు. విప్లవ వీరులు చూస్తూ ఊరుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆగ్రహంతో రగిలిపోతూ సాండర్స్‌ను హతమార్చారు. 1929 జూలై 10న సాండర్స్ హత్యకేసు విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం 32మందిపై నేరం మోపింది. ఆ బూటకపు విచారణానంతరం అజాద్‌తోసహా తొమ్మిదిమందిని పరారీలో వున్నారని ప్రకటించింది. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశే్వశ్వర సిన్నాహలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా, బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు. విశే్వశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు. ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వనె్న తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్జ్వల ఉదాహరణ.

  • జన్మస్థలం: బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం,
  • నిర్యాణ స్థలం: అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశం,
  • ఉద్యమము: భారత జాతీయ ఉద్యమం,
  • ప్రధాన సంస్థలు: నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్,
  • మరణము – ఫిబ్రవరి 27, 1931, అలహాబాదు, ఉత్తరప్రదేశ్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

బాలగంగాధర తిలక్ ,Bal Gangadhar Tilak



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -బాలగంగాధర తిలక్ ,Bal Gangadhar Tilak- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, మంచి ఉపాధ్యాయుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజంగా అబ్బాయి. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.

బాలగంగాధర తిలక్ ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు.

  • జణనము :జూలై 23 1856.
  • ఇతర పేర్లు: లోకమాన్య తిలక్,
  • జన్మస్థలం: రత్నగిరి, మహారాష్ట్ర,
  • ఉద్యమము: భారత స్వాతంత్ర్యోద్యమం,
  • ప్రధాన సంస్థలు:భారత జాతీయ కాంగ్రేసు,
  • నిర్యాణ స్థలం: బొంబాయి,ఇండియా,
  • మరణము : ఆగష్టు 1 1920.

పూర్తి వివరాలకోసం --> బాలగంగాధర తిలక్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Wednesday, September 21, 2011

గోపాలక్రిష్ణ గోఖలే ,Gopal Krishna Gokhale



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గోపాలక్రిష్ణ గోఖలే - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ (ప్రస్తుత మహారాష్ట్ర) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.

For more details see Wikipedia - Gopalakrishna Gokhale
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Monday, September 19, 2011

Jwala Gutta , జ్వాలా గుత్తా



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jwala Gutta , జ్వాలా గుత్తా
- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ ఛాంపియన్. కేంద్ర ప్రభుత్వము ఆగస్ట్ 18, 2011 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది. క్రాంతి, ఎలెన్ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్ చేతబట్టిందీ అప్పటినుంచే. చదువు, బ్యాడ్మింటన్ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగారు. సింగిల్స్‌తోపాటు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆడడం జ్వాల ప్రత్యేకత!. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విన్నర్‌గా నిలిచారు.

జ్వాల సెప్టెంబర్ 7, 1983న మహారాష్ట్ర లోని వార్ధాలో తెలుగు తండ్రి గుత్తా క్రాంతి, చైనా తల్లి ఎలెన్‌ కి జన్మించింది. తాత చెంగ్ వార్ధాలోని సేవాగ్రాం ఆశ్రమములో మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ ఆత్మకథ, రచనలను ఛైనా భాషలోనికి అనువదించాడు. భట్టిప్రోలు మండలం గుత్తావారిపాలెం జ్వాల పెద్దల స్వస్థలం. జ్వాల తాతయ్య గుత్తా సుబ్రహ్మణ్యం అభ్యుదయవాది, స్వాతంత్య్రయోధుడు. ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు సుబ్రహ్మణ్యం. చిన్నతనంలోనే సోదరులతో కలిసి వందేమాతరం నినాదాన్ని అందుకున్నారు. ఆగ్రహించిన నాటి బ్రిటిష్ పాలకులు ఈ కుటుంబాన్నీ, వీరి బంధుగణాన్నీ అరెస్టుచేసి జైలుకు పంపారు. ఉద్యమబాటలో వీరి ఆస్తులు కరిగిపోయాయి. సుబ్రహ్మణ్యం పెదనాన్న, పెద్దమ్మ జైల్లోనే ప్రాణాలు విడిచారు. బయటపడ్డాక అప్పులతో కాలం గడుపుతుండగానే వారు కోరుకున్న స్వేచ్ఛాభారతం సిద్ధించింది. మిగిలిన కొద్దిపాటి ఆస్తులు అమ్ముకుని ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు వలసబాట పట్టాయి. తమిళనాడుకు వెళ్లి పుష్పగిరి గ్రామంలో వ్యవసాయం ఆరంభించి పూలతోటలు సాగుచేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు అరుగురు సంతానం. అందులో క్రాంతి ఒకరు. ఈ కుటుంబానికి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌తో అనుబంధం ఏర్పడింది. మకాం అటు మార్చారు. గాంధీజీ బేసిక్ స్కూలును ఆరంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. ఆ క్రమంలో వాకాడు, హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య, ఇంటర్మీడియెట్ చదివిన క్రాంతి మహారాష్ట్ర వెళ్లి డిగ్రీ, కెమిస్ట్రీలో పీజీ చేశారు. అప్పుడే సేవాగ్రామ్ వచ్చిన చైనా యువతి ఎలెన్‌తో పరిచయం ప్రేమగా మారింది. వివాహబంధం ముడిపడ్డాక ఆమెకు భారత పౌరసత్వం వచ్చింది. ఆర్‌బీఐ ఉద్యోగిగా మహారాష్ట్రలో అయిదేళ్లు పనిచేసిన క్రాంతి, 1988లో బదిలీపై హైదరాబాద్ చేరుకున్నారు.
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, September 1, 2011

గుల్జారీలాల్ నందా ,Gulzarilal Nanda



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గుల్జారీలాల్ నందా - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


గుల్జారీలాల్ నందా ..జూలై 4, 1898 పుట్టి - జనవరి 15, 1998 న మరణిచారు . భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణము తరువాత. రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.

for more details - > Gulzarilal Nanda in Telugu
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Kalpana chavla , కల్పనా చావ్లా


  • https://6772741428248755133-a-1802744773732722657-s-sites.googlegroups.com/site/seshagirirao2006/home/kalpana-chavla/Kalpana%20chavla-img.jpg?attachauth=ANoY7coT4BZ_gk53JR5AYUv4SIejdwCKwCpu3GuUcokcmqBRaGGCTzgNJRVcCFJLmNkX14XZbx83h3PD0CkPEUjQk8GqPBiAM2PZW7soeLkpsfFKWhQfXWXkTA9mdoR2yl8_hOsjUgVgUlBe3V-2eBDgDUAVqG9g7qvkkfX6eW-wHTXdtpw3w-_Z6fHliFXlh45iXMasrN_iYlqOxmtZbAWFWiEfW5sAiqQ2F8vb0v2M1GpYTqcSVJztS9SG847q8VazUM2QeZ7t&attredirects=0


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalpana chavla , కల్పనా చావ్లా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

బనారసి చావ్లా, సనాజ్యోతి దంపతులకు 1961లో కర్నల్ జిల్లాలోని హర్యానాలో కల్పన జన్మించారు. చిన్నతనం నుంచి తనకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. టాటా. ఆయనలా గాలిలో ఎగరాలని కలలు కనడం ప్రారంభింది. ఆమె ఆత్మవిశ్వాసమే ఆమె ఆశయ సాధనకు తోడ్పడింది. యువతకు మార్గదర్శిగా మిగిలింది.
కల్పన సంప్రదాయాలను గౌరవించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా పాతతరం ఆలోచనలకు స్వస్తి పలికింది. మొదటితరం వారసురాలుగా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో తనకు ఇష్టమైన తన చిన్ననాటి కలకు రెక్కలు తొడగాలని ‘ఏరోనాటికల్ ఇంజినీరింగ్’లో చేరిన తొలి మహిళ. కల్పన కట్టుబాట్లు తెంచుకొని ముందడుగు వేయడం తల్లిదండ్రులకు ఏ మాత్రం రుచించలేదు. పిల్లలచేత మనస్సులో నాటుకున్న ఆలోచనలకు అనుగుణంగా పెద్దలు చేయూత అందించాలని కల్పన భావించేది. తల్లిదండ్రులు ఆగ్రహించినప్పటికి తన కోసం ఎదురుచూస్తున్న ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఉన్నత చదువుల కోసం అమెరికా ప్రయాణమైంది. టెక్సాస్, బౌల్డర్, కొలరాడో విశ్వవిద్యాలయాలలో అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకుంది.
ఆమె తన విద్యాభ్యాసం అనంతరం ‘నాసా ఎమ్స్ పరిశోధన కేంద్రం’లో పని చేయడం ప్రారంభించింది. తనకు అమెరికా పౌరసత్వం లభించడంతో తనతోటి సహచరుడు, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ జీన్ పైరీ హరిసన్‌ను వివాహం చేసుకున్నారు. విమానాలు నడపటంలో శిక్షణ పొంది, వ్యోమగామిగా మారడానికి మార్గం సుగమం చేసుకొన్నారు.

For more details -> Kalpana Chavla
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/