Thursday, February 21, 2013

I.K.Gujral ,భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --I.K.Gujral ,భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

 భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌(93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా భాద్యతలు నిర్వహించారు.గుజ్రాల్‌ సతీమణి షీలా గుజ్రాల్‌ పంజాబీ, హిందీ, ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీశ్‌ గుజ్రాల్‌ ప్రముఖ చిత్రకారుడు.

1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్‌కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా వున్నారు. అనంతరం కొంతకాలం సోవియట్‌యూనియన్‌లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు.వీపీసింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 1989లో వీపీ సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవెగౌడ సారధ్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్‌ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.

for more details : I.K.Gujral
  • ===============================
 Visit my website - > Dr.seshagirirao.com/

Monday, February 18, 2013

P.T.usha,పి.టి.ఉష

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -P.T.usha,పి.టి.ఉష- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ఈమె పూర్తిపేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్‌ ఉష. ఈమె 1964 మే 20న పుట్టింది. మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించి, పరుగుల రాణిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఈమెను అందరూ ముద్దుగా పయోలి ఎక్స్‌ప్రెస్‌ అని పిలుస్తుంటారు. ఇక ఈమె విజయ పరంపరలో 1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజితం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెప్పింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా 2 రజిత పతకాలు సొంతం చేసుకుంది. అదేవిధంగా 1990 ఆసియాడ్‌లో 3, 1994లో ఒకటి రజితాలు గెలుచుకుంది. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతటి ఖ్యాతిని భారతదేశానికి అందించినందుకు ఈమెను 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది.

ఇటువంటి మహాన్నత విలువలున్న మన మహిళలు తాజాగా ట్రస్‌ రీసెర్చ్‌ అడ్వయిజరీ వారి పరిశోధనల్లో కూడా భారత దేశపు అత్యంత నమ్మకమైన మహిళా మణులుగా ఎంపికై రికార్డ్‌ని మరొకమారు తిరగ రాసారని చెప్పవచ్చు.

For more details : see wikipedia.org - P.T.Usha
  • =========================
 Visit my website - > Dr.seshagirirao.com/