Showing posts with label జగదీష్ చంద్ర బోస్. Show all posts
Showing posts with label జగదీష్ చంద్ర బోస్. Show all posts

Wednesday, December 12, 2012

Jagadesh Chandra Bose-జగదీష్ చంద్ర బోస్



  •  
 మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -సర్ జగదీష్ చంద్ర బోస్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


సర్ జగదీష్ చంద్ర బోస్,-- బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

జననం-    నవంబర్ 30 1858--మైమెన్‌సింగ్, తూర్పు బెంగాల్ (ప్రస్తుతము బంగ్లాదేశ్), బ్రిటీష్ ఇండియా,
మరణం-    నవంబర్ 23 1937 --గిరిడీ, బెంగాల్ ప్రావిన్స్, అవిభాజ్య భారతదేశం,
నివాసం-    అవిభాజ్య భారతదేశం, జాతీయత: భారతీయుడు, మతం:హిందూ,
రంగము-    భౌతిక శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, బెంగాలీ సాహిత్యం, బంగ్లా సైన్సు ఫిక్షన్,
సంస్థ-    ప్రెసిడెన్సీ కళాశాల,
మాతృ సంస్థ-    కలకత్తా విశ్వవిద్యాలయం,కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం,లండన్ విశ్వవిద్యాలయం,
ప్రాముఖ్యత-    మిల్లీమీటర్ తరంగాలు,రేడియో,క్రెస్కోగ్రాఫ్,

More details : < Jagadesh Chandra Bode Telugu  >
  • =====================

Visit my website - > Dr.seshagirirao.com/