Wednesday, October 22, 2014

Robert Vadra-రాబర్ట్ వాద్రా

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Robert Vadra-రాబర్ట్ వాద్రా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


 Robert Vadra-రాబర్ట్ వాద్రా---

  • ===============================

Saturday, December 28, 2013

C.N.R.Rao,సి.ఎన్‌.ఆర్‌.రావు,చింతామణి నాగేశ రామచంద్రరావు

  •  
  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - సి.ఎన్‌.ఆర్‌.రావు,చింతామణి నాగేశ రామచంద్రరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

   

 ఏ అమెరికాలోనో పుట్టుంటే ఇప్పటికే నోబెల్‌ పురస్కారాన్ని అందుకునేవారేమో. కానీ భారతీయ విలువలూ ఆధ్యాత్మికత- ఆయనను గొప్ప శాస్త్రవేత్తగానే కాదు, గొప్ప మనిషిగానూ తీర్చిదిద్దాయి. సైన్సులోని మానవతాకోణం ...చింతామణి నాగేశ రామచంద్రరావు.

సైన్స్‌ - ఓ మహారణ్యమైతే , ప్రయోగశాల - ముని కుటీరం. సాయనాలూ గాజునాళికలూ...చెట్లూచేమలూ. డాక్టర్‌ సి.ఎన్‌.ఆర్‌.రావు - సైన్సు మహర్షి!

 శాస్త్రసాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహాలూ సూచనలూ అందించే అత్యున్నత స్థాయి నిపుణుల బృందానికి నాయకుడంటే ఓ పట్టాన నమ్మకం కలగదు. అంత నిగర్వి, అంత నిరాడంబర వ్యక్తి ...చింతామణి నాగేశ రామచంద్రరావు. ఆయన పరిశోధనలు రసాయనాలకో గాజు నాళికలకో పరిమితం కాలేదు ... ఏ భౌతిక రసాయన శాస్త్రం దగ్గరో, నానో పరిశోధనలతోనో ఆగిపోలేదు. సైన్సు జెండా భుజానికెత్తుకున్న ఉద్యమకారుడు రావుగారు. రేపటి తరాలకు సైన్సంటే మక్కువ కలిగించడానికి బడిబాట పట్టిన దార్శనికత్వం ఆయనది.

అచ్చమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు రామచంద్ర. బాల్యమంతా బెంగళూరులోనే. నాన్న నాగేశరావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ ఎలిమెంటరీ స్కూలు దాకానే చదువుకున్నా..లోకజ్ఞానం మాత్రం అపారం. రామచంద్ర తొలిగురువు అమ్మే. ఒళ్లో కూర్చోబెట్టుకుని చెప్పిన రామాయణ భారత కథలూ, గోరుముద్దలు తినిపిస్తూ పాడిన పురందరదాసు కీర్తనలూ...తొలిపాఠాలు. నాన్నగారికేమో ఆంగ్లమంటే మక్కువ. ఏకాస్త సమయం దొరికినా... ఇంగ్లీషు నేర్పించేవారు. రామచంద్ర హైస్కూలులో ఉన్న సమయంలో... భారత స్వాతంత్య్ర పోరాటం ఊపందుకుంది. సుభాష్‌ చంద్రబోస్‌ ఆ కుర్రాడి ఆరాధ్య నాయకుడు. నేతాజీ వీరోచిత పోరాటాన్ని మిత్రులకు కథలుగా చెప్పేవాడు. పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే లోయర్‌ సెకెండరీ పరీక్షల్లో ఫస్టున పాసైనందుకు ... రామచంద్ర జేజమ్మ తన ముద్దుల మనవడికి రూపాయి కాసు కానుకగా ఇచ్చింది. డెబ్భై ఏళ్ల క్రితం రూపాయంటే... ఇప్పటి వేయి రూపాయలతో నమానం! దాన్ని జాగ్రత్తగా దాచుకుని, ఆతర్వాతెప్పుడో పుస్తకాలు కొనుక్కున్నాడు. పెరిగి పెద్దవుతున్నకొద్దీ స్వాతంత్య్ర ఉద్యమ తీవ్రతా పెరిగింది. ఎవరూ చెప్పకపోయినా...గాంధీటోపీ పెట్టుకున్నాడు, ఖద్దరు ధరించాడు. హైస్కూలు పెద్ద పరీక్ష పాసయ్యేనాటికి... దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎటు చూసినా సంబరాలే. కానీ మైసూరు సంస్థానం మాత్రం ఇంకా మహారాజు పాలనలోనే ఉండేది. ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ ప్రజాపోరాటం మొదలైంది. కౌమారంలోని ఆవేశం రామచంద్రనూ ఉద్యమంలోకి దింపింది. వీధుల్లో హర్తాళ్లు చేశాడు. వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చాడు. అలా అని, చదువుని నిర్లక్ష్యం చేయలేదు. పదిహేడేళ్లకే బీఎస్సీ పట్టా అందుకుని మైసూరు విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ లెక్చరరు సలహా మేరకు, తనకు ఎమ్మెస్సీలో సీటివ్వమంటూ బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి ఓ లేఖ రాశాడు. అక్కడ మాస్టర్స్‌ డిగ్రీ చదువుతూనే పరిశోధన చేసే వెసులుబాటు ఉండేది. ఆ ప్రత్యేకతే రామచంద్రను ఆకర్షించింది. వెంటనే బయల్దేరి రమ్మంటూ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తంతి పంపారు. రామచంద్ర బెనారస్‌ బండి ఎక్కాడు. ఎటూ సైన్స్‌ విద్యార్థే కాబట్టి, హేతుబద్ధంగా ఆలోచించడం అతనికెవరూ నేర్పాల్సిన అవసరం రాలేదు. కానీ సైన్సు కంటే ఇంకాస్త ముందుకెళ్లి...ఆధ్యాత్మికత గురించి బోధించింది మాత్రం వారణాసి వాతావరణమే. గంగాస్నానం, విశ్వేశ్వరుడి దర్శనం, సాధుసంతుల సాంగత్యం - రామచంద్ర ఆలోచనలపై చాలా ప్రభావం చూపాయి. ఎమ్మెస్సీ పట్టాతో బెంగళూరుకు తిరిగొచ్చినా...ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో తన విభాగానికి సంబంధించి పెద్దగా పరిశోధన అవకాశాలు లేకపోవడంతో...పీహెచ్‌డీ కోసం ఖరగ్‌పూర్‌ ఐఐటీకి వెళ్లాడు.

ఖరగ్‌పూర్‌లో కఠోరశ్రమ చేస్తున్నా...అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తన పరిశోధన సాగడం లేదన్న అసంతృప్తి వెంటాడేది. అప్పుడే, ఓ ప్రొఫెసరుగారు 'నువ్వు అమెరికా ఎందుకు వెళ్లకూడదు?' అని సలహా ఇచ్చారు. అప్పటిదాకా రామచంద్రకు ఆ ఆలోచనే రాలేదు. పేరున్న విశ్వవిద్యాలయాలన్నిటికీ దరఖాస్తు చేశాడు. అన్నిచోట్లా సీటొచ్చింది. తను మాత్రం పర్‌డ్యూ విశ్వవిద్యాలయంలోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. దిగ్గజాల్లాంటి ప్రొఫెసర్లు ఉన్నారక్కడ. తీరా బయల్దేరేముందు, కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఆరోజుల్లో సంప్రదాయ కుటుంబాలవారు సముద్రయానం చేసేవారు కాదు. ఎలాగోలా కన్నవారిని ఒప్పించి...ఓడ ఎక్కాడు. ప్రయాణికులంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే, తను మాత్రం పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. లేదంటే, ఆ అనంత జలనిధిని చూస్తూ...సృష్టిలోతుల్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఇరవై రోజుల ప్రయాణం తర్వాత న్యూయార్క్‌ నగరాన్ని చేరుకున్నాడు. కొత్త వాతావరణం, కొత్త భాష, కొత్త సంస్కృతి. అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. తన దృష్టంతా చదువుల మీదే ఉండటంతో... మరో ఆలోచన వచ్చేది కాదు. ఆరేడేళ్లకైనా కొలిక్కిరాని పరిశోధనల్ని రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేశాడు. అక్కడే తన అభిమాన గురువు లినస్‌ పాలింగ్‌ను కలుసుకునే అవకాశమూ వచ్చింది. రసాయనశాస్త్రంలో మరిన్ని పరిశోధనల దిశగా ప్రోత్సహించిందీ ఆయనే. ఆతర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీలో పైచదువులు చదివాడు. పోస్ట్‌ డాక్టొరల్‌ తర్వాత ... అమెరికాలో స్థిరపడాలా, మాతృదేశానికి తిరిగిరావాలా? అన్న ప్రశ్న. మరొకరైతే... ఇంకో ఆలోచన లేకుండా, ఏ అమెరికన్‌ యూనివర్సిటీలోనో చేరిపోయేవారు. నిజానికి, భారత్‌లో రసాయనశాస్త్ర పరిశోధకులకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ రామచంద్ర వెనక్కి వచ్చేయాలనే నిర్ణయించుకున్నాడు. అప్పటికే అమెరికా రసాయనశాస్త్రంలో చాలాముందుంది. భారత్‌ అప్పుడే తొలి అడుగులు వేస్తోంది. మాతృదేశానికే తన అవసరం ఎక్కువని గ్రహించాడు. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి... అమ్మానాన్నలూ కొడుకు తిరిగిరావాలనే కోరుకున్నారు.

విదేశాల నుంచి రాగానే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో లెక్చరర్‌గా చేరారు రామచంద్ర. జీతం నెలకు ఐదు వందలు. అంత చదువు చదివీ అన్ని అర్హతలుండీ ... అంత చిన్న కొలువేమిటని బంధుమిత్రులు అడ్డుచెప్పినా పట్టించుకోలేదు. అప్పటికి భారత్‌లో ఎంతోకొంత ప్రతిష్ఠ కలిగిన సంస్థగా ఐఐఎస్‌సీ పేరు తెచ్చుకుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా భౌతిక రసాయనశాస్త్ర పరిశోధనశాల లేదు. దానికితోడు ... అంతర్గత రాజకీయాలు, నిధుల కొరత. భౌతికశాస్త్రానికి ఓ పరిశోధనశాల ఉన్నా... అందులోకి రామచంద్రను అనుమతించలేదు. అదో రంపపు కోత! ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. 'చీకట్లో ఉన్నానని బాధపడుతూ కూర్చుంటే, ఫలితం లేదు. దీపం వెలిగించాలి. వెలుతురును ఆహ్వానించాలి' అని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అందుబాటులో ఉన్న నిధులతోనే చిన్న పరిశోధనశాల ఏర్పాటు చేశారు. టైటానియం డయాక్సైడ్‌పై పరిశోధనలు చేశారు. తన దగ్గరున్న ఆరుగురు పీహెచ్‌డీ విద్యార్థులతోనూ ప్రయోగాలు చేయించారు. ఆ అనుభవాలతో ఓ పుస్తకం రాశారు. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ముద్రణ సంస్థ దాన్ని విడుదల చేసింది. అప్పుడే, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్‌ పరిచయం అయ్యారు. హైస్కూలు రోజుల్లో తొలిసారిగా రామన్‌ను చూశారు రామచంద్ర. ఆయనలోని వినయం, విజ్ఞానం రామచంద్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ముడిసరుకుగా ఉపయోగపడ్డాయి. ఓసారి, తనే స్వయంగా వచ్చి.. రామచంద్రకు ఓ సైన్స్‌ జర్నల్‌ ఇచ్చి వెళ్లారు. 'నువ్వు రాసిన కెమికల్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ ఇన్ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపీ పుస్తకం చాలా బావుంది' అని ఉత్తరం రాశారు. మరో సందర్భంలో ... రామచంద్ర ఉపన్యాసాన్ని విని 'నువ్వో నిప్పు కణిక. మంచి భవిష్యత్తు ఉంది' అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఐఐఎస్‌సీలో మేధోపరమైన స్వేచ్ఛ ఉన్నా...పరిశోధనలకు అవకాశాలు తక్కువ. దీనివల్ల తన ఆలోచనలకు ఓ రూపం ఇవ్వలేకపోతున్నాననే బాధ వెంటాడేది. అప్పుడే, ఐఐటీ కాన్పూర్‌ నుంచి పిలుపు వచ్చింది. పరిశోధనల కోసం తగినన్ని వనరులు సమకూరుస్తామని యాజమాన్యం మాటిచ్చింది. ఓ శాస్త్రవేత్తగా, రసాయనశాస్త్ర అభిమానిగా ...రామచంద్ర తనను తాను నిరూపించుకోడానికి ఐఐటీ ప్రాంగణం ఓ వేదికైంది. మూడుపదులు నిండకుండానే ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకున్నారు. 'వింటర్‌ స్కూల్‌' పేరుతో...దేశంలోని రసాయనశాస్త్ర బోధకులకు అంతర్జాతీయ నిపుణులతో పాఠాలు చెప్పించారు. రసాయనశాస్త్రం మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఓ న్యూస్‌లెటర్‌ ప్రారంభించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయుల కోసం, బాలల కోసం 'కెమిస్ట్రీ టుడే', 'అండర్‌స్టాండింగ్‌ ఇన్‌ కెమిస్ట్రీ' వంటి పుస్తకాలు రాశారు. 'నానో వరల్డ్‌'ను స్వీడిష్‌ భాషలోకీ తర్జుమా చేసుకున్నారు. కొంతకాలం విదేశాలకెళ్లి ...ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రసాయనశాస్త్ర విజ్ఞానానికి మెరుగులు పెట్టుకుని వచ్చారు. అప్పుడే, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ సతీష్‌ధావన్‌ నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. 'మీరు బెంగళూరు రావాలంటే, ఏం చేయాలో చెప్పండి చాలు' అంటూ. రామచంద్ర పదవులు కోరుకోలేదు, పెద్ద జీతాలూ కోరుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీలో పరిశోధన సౌకర్యాలు కల్పిస్తే చాలన్నారు. ధావన్‌ సంతోషంగా అంగీకరించారు. ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయించారు. కాస్త ఆలస్యంగా అయినా...అనుకున్నవన్నీ సమకూరాయి. ఆతర్వాత కొంతకాలానికి రామచంద్ర డైరెక్టరు స్థాయికి ఎదిగారు. ఐఐఎస్‌సీకి మహర్దశ మొదలైంది. నిధులొచ్చాయి, భవనాలొచ్చాయి, పరిశోధనశాలలొచ్చాయి. దేశంలోని మెరికల్లాంటి శాస్త్రవేత్తల్ని ఏరికోరి తెచ్చుకున్నారు రామచంద్ర. 'చాలా సందర్భాల్లో మనం వెనకబడిపోవడానికి కారణం నిధుల కొరతో, సౌకర్యాల లేమో కాదు - మనలోని నిర్లిప్తత, నిరాశావాదం. ముందు దాన్ని తరిమికొట్టాలి' అంటారాయన. అరవై ఏళ్లు నిండగానే... రామచంద్ర ఐఐఎస్‌సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరో ఐదేళ్లు కొనసాగాలంటూ అభ్యర్థనలు వచ్చినా కాదన్నారు. పరిశోధనలకే పూర్తి సమయం కేటాయించాలని ఉందని స్పష్టం చేశారు. ఆ పదవికి మరో సమర్ధుడి పేరు సూచించారు. తన విజ్ఞానాన్నీ అనుభవాన్నీ రంగరించి, బెంగళూరు శివార్లలో జవహర్‌లాల్‌నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. నిర్మాణశైలి నుంచి సైన్సు పరికరాల దాకా...అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నారు. శాస్త్ర పరిశోధనలో, శిక్షణలో అంతర్జాతీయ శ్రేణి సంస్థగా తీర్చిదిద్దారు.

రామచంద్ర పరిశోధనలు రసాయనశాస్త్రంలో మైలురాళ్లు. సాలిడ్‌స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో ఆయన వెలుగులోకి తెచ్చిన వివిధ అంశాలు అనేక ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో కొత్త మార్పులకు దారిచూపాయి. నానో పదార్థాల రంగంలోనూ అపారమైన కృషి చేశారు. ప్రస్తుతం కృతక ఫొటో సింథసిస్‌ రసాయన విజ్ఞానంపై దృష్టి సారించారు. ఆరు దశాబ్దాల పరిశోధనా జీవితం తర్వాత కూడా...ఆయనలో కాస్తంతైనా అలసట లేదు. ఇప్పటికీ ఏవో పరిశోధనలు చేస్తుంటారు. 'ఓసారి నేను కేంబ్రిడ్జి ప్రొఫెసర్‌ నెవిల్‌మోట్‌ను కలవడానికి వెళ్లాను. ఆ సమయానికి ఆయన, పరిశోధన పత్రాల్లో అచ్చుతప్పులు సరిచేస్తూ కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు తొంభై ఒకటి. వయసును గెలవడం ఎలాగో ఆయన్ని చూసే నేర్చుకున్నాను' అంటారు. ఎనిమిదిపదులు దగ్గరపడుతున్నా...రామచంద్ర జ్ఞానకాంక్ష తీరలేదు. యువ విద్యార్థుల్ని చూడగానే యువకుడైపోతారు. కొత్త పుస్తకం కనిపించగానే విద్యార్థిగా మారిపోతారు.

రసాయనశాస్త్ర పాఠం చెప్పాలంటే, రామచంద్ర మాస్టారే చెప్పాలన్నంత పేరు తెచ్చుకున్నారు. ఆ శైలి చాలా వైవిధ్యం. సైన్స్‌ను కూడా సాహిత్యమంత ఆసక్తికరంగా బోధించడం ఆయనకే తెలుసు. 'విద్యార్థుల్ని రసాయనశాస్త్రం వైపు ఆకట్టుకోవాలంటే...మనం ఏం సాధించామన్నది కాదు, ఏం సాధించాల్సి ఉందో చెప్పాలి. వాళ్ల బుర్రలకు సవాలు విసరాలి' అంటారాయన. ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లి... పిల్లలతో ముచ్చటిస్తుంటారు, సైన్స్‌ సంగతులు ఆసక్తికరంగా చెబుతుంటారు. విద్యార్థుల కోసం, పరిశోధకుల కోసం రామచంద్ర ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కొన్నిసార్లు విద్యార్థుల భోజనమూ అక్కడే. 'సగటు విద్యార్థితోనూ అద్భుతాలు చేయించగల గురువు ఆయన. రామచంద్రగారితో పదినిమిషాలు మాట్లాడినా చాలు.. పదేళ్లకు సరిపడా స్ఫూర్తిని పొందుతాం' అంటాడు పరిశోధక విద్యార్థి జాన్‌ థామస్‌. బిమన్‌ బాగ్చీ అనే సహచరుడిని రామచంద్ర యువ సైంటిస్టు అవార్డుకు ప్రతిపాదించారు. కానీ బాగ్చీ గడువులోపు అవసరమైన పత్రాల్ని సిద్ధంచేయలేకపోయాడు. దీంతో రావుగారే వాటిని ఢిల్లీకి తీసుకెళ్లి ఇచ్చారు. ఆయన ఓ పట్టాన విద్యార్థుల్ని మెచ్చుకోరు. ఇంకా ఇంకా పరిశోధించాలంటారు, ఇంకా ఇంకా సాధించాలంటారు. 'నాట్‌ బ్యాడ్‌' అన్నారంటే, 'వెరీగుడ్‌' అన్నంత సంబరం వాళ్లకు. ఆయన శిష్యుల్లో చాలామంది పద్మశ్రీలు అయ్యారు, భట్నాగర్‌ అవార్డు గెలుచుకున్నారు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు తనే ఫీజులు కట్టారు, హాస్టలు బిల్లులు చెల్లించారు. 'ఉదయం పూట ఆయనతో నడకకి వెళ్లడానికి మేం పోటీపడేవాళ్లం. ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. ప్రతి మాటా ఓ అమూల్యమైన పాఠమే' అని గుర్తుచేసుకుంటాడు ప్రదీప్‌ అనే పూర్వ విద్యార్థి. 'గురువులను గౌరవించే దేశాలే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. సైన్స్‌ ఉపాధ్యాయుల జీతాలు పెరగాలి. అప్పుడే తెలివైన యువతీయువకులు ఇటువైపు వస్తారు. ఆ విషయంలో ఫిన్‌లాండ్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉంది. భారత్‌ ఏ అడుగునో కనబడుతుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు రామచంద్ర.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే...ఢిల్లీ పెద్దల దృష్టి రామచంద్ర మీద పడింది. దార్శనిక పత్రాలూ నివేదికలూ అవసరమైన ప్రతిసారీ ఆయన్ని పిలిపించేవారు. 'భారత ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ సైంటిస్టుల ప్రతినిధి రామచంద్రగారే' అన్న కస్తూరి రంగన్‌ వ్యాఖ్య నూటికి నూరుపాళ్లూ నిజం. ఓసారి ఇందిరాజీ ఏదో పెద్ద పదవి ఇవ్వాలనే పిలిపించారు. రామచంద్ర అంగీకరించలేదు. 'నాకు సైంటిస్టుగా ఉండటమే ఇష్టం' అంటూ సున్నితంగా తిరస్కరించారు. 'పిలిచి పదవి ఇస్తానంటే వద్దని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే' అన్నారట ఇందిరాగాంధీ. ఆ తరవాత, ఇందిర వారసుడిగా రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రాన్ని జపించే యువ రాజీవ్‌కు రామచంద్ర ఆలోచనలు బాగా నచ్చాయి. రాజీవ్‌ హయాంలో రామచంద్ర నేతృత్వంలోని నిపుణుల బృందం దేశ శాస్త్రసాంకేతిక ప్రగతికి దిశానిర్దేశం చేసింది. విజన్‌-2020, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌, దేశీయ సూపర్‌ కంప్యూటర్‌ - ఆ మేధోమధన ఫలితాలే. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్స్‌ (సి-డాక్‌) కూడా రామచంద్ర నేతృత్వంలోని సలహామండలి ఆలోచనే. యూపీయే ప్రభుత్వ కీలక శాస్త్ర నిర్ణయాల వెనుకా .. ఆయన ఉన్నారు. రామచంద్ర దృష్టిలో సైన్స్‌ అంటే... రసాయనాలూ పరిశోధనలే కాదు. సువిశాల సమాజం కూడా. మన చుట్టూ ఉన్న అనేక సమస్యలకు సైన్స్‌లోనే పరిష్కారం ఉందని బలంగా విశ్వసిస్తారు. 'సైన్స్‌ తగ్గిపోయినకొద్దీ ఛాందసవాదం ప్రబలుతుంది. హేతువాదం కనుమరుగవుతుంది. మానవత్వం మట్టిపాలు అవుతుంది. ఛాందసవాదులు గాల్లో ఎగరాల్సిన విమానాల్ని మనుషుల మీదికి తోలేస్తారు' అని హెచ్చరిస్తారు. ఆమధ్య 'ఇజ్రాయెల్‌ నోబెల్‌'గా ప్రాచుర్యం పొందిన డాన్‌డేవిడ్‌ పురస్కారంతో పాటూ పది లక్షల డాలర్ల నగదు బహుమతినీ ఇచ్చారు. మరో ఆలోచన లేకుండా, రావుగారు ఆ భారీ మొత్తాన్ని జవహర్‌లాల్‌నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధనా కేంద్రానికి విరాళంగా ఇచ్చారు.
రామచంద్ర బహుముఖ ప్రజ్ఞావంతులు. కళలు, సాహిత్యం, వర్తమాన అంశాలు - దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలరు. నెలకో కొత్త పుస్తకమైనా చదువుతారు. ఆయనలో లోతైన ఆధ్యాత్మిక భావాలున్నాయి. ద్వైతగురువు మధ్వాచార్యుల ప్రభావం అపారం. 'నేను దేవుణ్ని నమ్ముతానని చెప్పడానికి సంకోచించను. అలా అని, మూఢనమ్మకాల్లేవు. నేను విశ్వసించే దేవుడు సర్వవ్యాపకుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు. చాలా సందర్భాల్లో సమస్యల్ని ఎదుర్కోడానికి అవసరమైన నైతికశక్తి ఆధ్యాత్మికత ద్వారానే అందుతుంది' అంటారు. ధ్యానం, ప్రార్థన - హృదయ నేత్రాలని అభివర్ణిస్తారు.


పూర్తిపేరు : చింతామణి నాగేశ రామచంద్రరావు,
పుట్టిన తేదీ : జూన్‌ 30, 1934,
హోదా : భారత ప్రధాని శాస్త్ర సలహా మండలి అధ్యక్షుడు,,
చదువు : ఎమ్మెస్సీ (బెనారస్‌ హిందూ యూనివర్సిటీ), పీహెచ్‌డీ (పర్‌డ్యూ యూనివర్సిటీ), డీఎస్సీ (మైసూర్‌ యూనివర్సిటీ)
పరిశోధన : సాలిడ్‌స్టేట్‌, మెటీరియల్స్‌ కెమిస్ట్రీ, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ
గౌరవ డాక్టరేట్లు : 51 విశ్వవిద్యాలయాల నుంచి.
పరిశోధన పత్రాలు : పదిహేను వందలకు పైగా.
రచనలు : దాదాపు యాభై పుస్తకాలు.
పీహెచ్‌డీ శిష్యులు : 150 మందికి పైగా,
ఆత్మకథ : క్త్లెంబింగ్‌ ద లిమిట్‌లెస్‌ ల్యాడర్‌ - ఎ లైఫ్‌ ఇన్‌ ద కెమిస్ట్రీ ,,
అవార్డులు : భారతరత్న సాధించిన మూడో శాస్త్రవేత్త. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌,ఇండియన్‌ సైన్స్‌ ప్రైజ్‌, ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ (రష్యా), రాయల్‌ సొసైటీ క్వీన్స్‌ మెడల్‌ (లండన్‌), ఇంటర్నేషనల్‌ సైన్స్‌ కోఆపరేషన్‌ అవార్డు (చైనా), లేజియన్‌ ఆఫ్‌ ఆనర్‌ (ఫ్రాన్స్‌).
నినాదం : అందరికీ సైన్స్‌ - అందరి కోసం సైన్స్‌.

రావుగారింట్లో సరస్వతీ కళ తాండవిస్తుంది. అర్ధాంగి ఇందుమతి పెళ్లినాటికే ఆంగ్లసాహిత్యంలో ఆనర్స్‌ చేశారు. ఆతర్వాత, పరిశోధన చేసి డాక్టరేట్‌ సాధించారు. బోధన వృత్తిలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఇద్దరికీ సంగీత సాహిత్యాలంటే ప్రాణం. హిందుస్థానీ క్లాసిక్స్‌ను హాయిగా ఆస్వాదిస్తారు. కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృథా చేయడం ఇద్దరికీ ఇష్టం ఉండదు. 'మౌనం ద్వారానే ఒకర్నొకరు బాగా అర్థంచేసుకున్నాం' అంటారా దంపతులు. పిల్లలు సుచిత్ర, సంజయ్‌ల పెంపకం బాధ్యత ఇందుమతిదే. పెళ్లిళ్లకూ శుభకార్యాలకూ తనొక్కరే వెళ్లేవారు. 'మా పెళ్లికీ పిల్లల పెళ్లికీ తప్పించి ఏ పెళ్లికీ ఆయన రాలేదు' అని నవ్వుతూ ఫిర్యాదు చేస్తారామె. 'నా జీవితానికి రెండే లక్ష్యాలు- ఒకటి, పరిశోధన పత్రాలు ప్రచురించడం. రెండు, నా భార్యను సంతోషపెట్టడం' అంటూ ఎదురుబాణం వేస్తారు రావుగారు. 

Courtesy with : sunday magazine@eenadu news pepar
  • ======================================== 
Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, July 27, 2013

Jayadevudu , జయదేవుడు




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jayadevudu , జయదేవుడు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



జయదేవుని తల్లిదండ్రులు భోజదేవ, రమాదేవీ. వీరు కనౌజ్‌ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ దంపతులు. ఉద్యోగాన్ని వెదుక్కుంటూ జయదేవుడి తండ్రి భోజదేవుడు తన భార్యతో సహా కెండులిని చేరాడు. అక్కడే వారికి జయదేవుడు జన్మించాడు. ఐతే జయదేవుడు పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాధ అయ్యారు. కానీ ధైర్యాన్ని వదులుకోకుండా ఎంతో పట్టుదలతో సంస్కృతం నేర్చుకుని నైపుణ్యత గల కవిగా తయారయారు జయదేవుడు. స్వతహాగా శ్రీకృష్ణ భక్తుడైన జయదేవుడు ఇహ లోక జీవితంపై అంతగా ఆసక్తిని కనబరచలేదు. కృష్ణ్ణలీలను గానం చేస్తూ చాలా సంవత్సరాలు అనేక స్థలాలను తిరుగుతూ బెంగాలుకు దక్షిణం వైపున ఉన్న ఒరిస్సాలోని జగన్నాధపురిని చేరాడు. పూరి జగన్నాధుడిని సేవించాడు. చేతిలో పిల్లనగ్రోవిని ధరించిన శ్రీకృష్ణుణ్ణి జయదేవుడు దర్శించాడు. ఆ తరువాత ఇతడు విష్ణువు ఇతర అవతారాలైన దశావతారాలను దర్శించాడు.

పూరిలోని సుదేవశర్మ అనే పురోహితుడు జయదేవుడి జీవితానికి ఒక మలుపును ఇచ్చాడు. దాంతో అతడి జీవితమే మారిపోయింది. భగవత్‌ సన్నిధిలో నృత్యం చేసే తన అందాల రాశి కూతురు పద్మావతితో జయదేవుడి పెళ్లిని సుదేవశర్మ జరిపించాడు. మొదట్లో తాను వ్రతం చెడని సన్యాసినని... పెళ్లి వద్దని జయదేవుడు మొరాయించాడు. జగన్నాధుడే తనకు కలలో కనిపించి తన కూతురు పెళ్లిని నీతో చెయ్యమని ఆదేశించాడు అని సుదేవశర్మ చెప్పడంతో జయదేవుడు తమ మనసును మార్చుకున్నాడు. తన కవితకు కావలసిన స్ఫూర్తిని జయదేవుడు తన అందాల రాశి భార్య పద్మావతిలో చూసాడు. కెండులి గ్రామానికి భార్యతో తిరిగివచ్చి భార్యాభర్తలు తమ కాలాన్ని అక్కడే గడిపారు. అక్కడే...ఆ ప్రాంతంలో జయదేవుడు విశ్వవిఖ్యాతమైన గీతగోవిందం రచనకు పూనుకున్నాడు. గోపాల కృష్ణుడికి బృందావనంలోని రాధ పట్ల ఉన్న ప్రేమను ఈ కావ్యం వ్యక్తపరుస్తుంది. ఇందులో మొత్తం 24 అష్టపదులున్నాయి. ప్రతి అష్టపదినీ ఒక ప్రత్యేక రాగంతో, ప్రత్యేక తాళాన్ని అనుసరించి శాస్ర్తీయ బాణీలో జయదేవుడు రచించారు.

జయదేవుడు భక్తిపారవశ్యంతో రాస్తున్నప్పుడు పద్మావతి నృత్యాభినయం చేస్తూ తన భర్తకు స్ఫూర్తినిచ్చేదట. ఐతే ఆఖరి దశలో అతని ఘంటం ముందుకు సాగలేకపోయింది. అష్టపదిలోని ఆఖరి రెండు చరణాలను జయదేవుడు విశ్వ ప్రయత్నం చేసినా రాయలేకపోయారు. నిరుత్సాహంతో ఆయన నదీ స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆ రెండు చరణాలను పూర్తిచేశారన్న కథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ చరణాలను పూర్తి చేసిన తరువాత పద్మావతి తన భర్త కోసం చేసిన అన్నం తిని కృష్ణుడు బయటకి వెళ్ళారట. స్నానం చేసి తిరిగివచ్చిన జయదేవుడు జరిగిన విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయారు.... ఈ రోజు గీతగోవిందం దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ఒరిస్సా, బెంగాలు, దక్షిణ భారత దేశపు భక్తి సంగీతంలో గీతగోవిందం చోటుచేసుకుంది. కేరళలోని అనేక దేవాలయాల్లో అష్టపదుల గానం ఈ రోజుకూ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచ సాహిత్య కళాఖండంగా గీతగోవిందం పరిగణించబడుతోంది.

  •  ==============================
 Visit my website - > Dr.seshagirirao.com/

Teejan bhai,తీజన్‌ బాయి




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Teejan bhai,తీజన్‌ బాయి-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


Born --    April 24, 1956 (age 57),
Place of birth --Ganiyari village, Chhattisgarh,
Occupation ---    Pandavani Folk Singer,
Spouse(s) ---    Tukka Ram,
Awards --    Padma Bhushan 2003,Padma Shri 1988,Sangeet Natak Akademi Award 1995,

ఏకబిగిన ఆదిపర్వం మొదలుకొని మొత్తం పద్దెనిమి ది పర్వాలు పాడగలిగిన అద్భుత అధ్యయ నం అది. ఎలా సాధ్యం అనడిగితే ఆ కథ మీది అపా రమైన ప్రేమ అని సమాధానం. ఈ కళ ఆ పాండవ కథ ఎలా ఇన్నేళ్లుగా సాగుతూ వస్తున్నా యని అడిగితే ఆమె వివరించే ప్రవా హం ఏ కథ ఫ్లాట్‌, స్ట్రక్చర్‌కై నా ధీటుగా ఉంటుం ది. పాండవుల కథని పుక్కిట పట్టాక, తన జీవితాన్ని వినిపించడం ఒక పనా అంటుంది ఆమె. అక్షర విద్వత్తుకి ఆవలివైపు, చేతిమీద పచ్చబొట్టుగా పొడిపించుకున్న తన అయిదు అక్షరాల పేరును రాయడానికి పది నిమిషాలు తీసుకుంటానని కించిత్తు అభిమా నంగా చెప్పే తీజన్‌బా యి- పద్మశ్రీ, పద్మభూషణ్‌, డి.లిట్‌, మూడు డాక్టరేట్‌లు పోటీపడి వరించాయి. ఆమె పారిస్‌ ఫెస్టివల్‌- సంగీత నాటక అకా డమీ అవార్డు- వీటితోపాటుగా మరిన్ని రివార్డులు అందుకున్నారు.

-ఆమె జీవితపు ప్రతి కోణం ఒక పాఠం నేర్పే రీతిలో ఉంటుంది. ఒక ఆదివాసీ సమాజపు నేపథ్యం నుండి దేశ అత్యున్నత పురస్కారాలకు ఎదగడం మధ్య జరిగిన జీవిత అనుభవాలు ఎలాంటివో అవి తెలిస్తే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పురుషులు చెప్పే పండ్వానీ కథని పోట్లాడి మరీ పాడిన మొదటి మహిళ ఘనత తీజన్‌బాయిది. ఇది సాహిత్యంలో గుర్తింపు పొందగలగాలి. ఆ కథ, దాని ఔన్నత్యం, ఆ కథనరీతి, శైలి... అది భారతీయ కథనరీతులను ప్రభావం చేసిన తీరు సవిస్తార పాఠ్యాంశంగా ఉండగలగాలి. పాడేవాళ్ళు పాడుకుని సంతోషిస్తే, చదువరులు దాన్ని చదువుకుని తమ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.ఎరుపు, నలుపు రంగులు కలిసిన తన ప్రాంతపు కట్టుబొట్టతోకఢా, కాక్‌నీ, బిందీ లాంటి నగలతో తన (ఆహార్యాన్ని) దుస్తులని తానే ఎంచుకున్నానని చెబుతారామె. అన్నీకలిసి ఎనిమిది కిలోల బరువుంటాయట. మోస్తూ కథ చెప్పడం కష్టం కదా అంటే చెప్పేది భీముడు, సుయోధనుడు, ద్రౌపదిల గురించి కదా అని చమత్కరించింది. భీముడు ఆవిడకి ఇష్టుడు. కల్లాకపటం లేనివాడు కాబట్టి. ఒక్క భారతమే ఎందుకు రామాయణం కూడా చెప్పవచ్చు కదా అంటే భారతంతో మనసు అంటారు.

-అలా హృదయపు లోతుల్లో నుండి రాలేని కళ జనంలోనికెళ్ళలేదు, వాళ్ళ మనసులని తాకలేదు అని ఆమె భావన.అలా జనాల్లోకి వెళ్ళిన తన కళని ఇప్పటికి రెండు వందలపైగా ఔత్సాహికులకి ఆమె నేర్పారు. వాళ్ళలో ఉపాబాలా, మీనా సాహు, రీతూ వర్మ, సీమాఘోష్‌ లాంటి విద్యార్థులని గుర్తుచేసుకుంటారు తీజన్‌బాయి. తన దగ్గరకొచ్చి తర్ఫీదయే విద్యార్థులు కాకుండా తన గాన రీతిని సొంతం చేసుకొని పాడేవాళ్ళని ఆమె ఆక్షేపించరు. మీ సలహాలేకుండా మీ శైలిలో పాడుతున్నారు కదా అంటే విశ్వవ్యాప్త కళ ఇది. పరిధులు, సీమలు ఎందుకంటారు. రామ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఈ కళని పాఠ్యాంశంగా ఇంకా గుర్తించనప్పటికీ, ఈ కళారూపం గానరీతి పద్ధతులపై వర్క్‌షాపులవీ నిర్వహిస్తుంటారని తీజన్‌బాయి సెక్రటరీ చెప్తారు. ఆ పరంగా తన కళని ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్నారామె. వయసెంతని అడిగితే మనమల పిల్లల్ని ఆడించుకుంటానని జవాబు. ఇన్నేళ్ళ ఎగుడు దిగుడు జీవితం ఒకవైపు, ఎలాంటి ఎగుడుదిగుడుల్లోనైనా మొక్కవోని తన పండ్వాని కథ మరోవైపు. కథని జీవితం చేసుకున్నాక జీవితం తనని బాధించలేదు.

ఆ కళలో ఏకలీనం అవుతుందామె. ఇక తీజన్‌బాయిలో గుర్తించాల్సిన మరో కోణం ఏమిటంటే ఈ సాద్‌గీని భద్రంగా పెట్టుకోవడం కూడా తన కళలో భాగమైంది. దేశ విదేశాలు అఖండ ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలు, కొద్దిపాటి డబ్బు, ఆ పరంగా వచ్చే మార్పులు ఇవేవీ కళని తాకనివ్వకుండా తనని తాను సంభాళించుకోవడం కూడా ఒక కళనే. ఒక సెక్రటరీ, అపాయింట్‌మెంట్స్‌ ఆ హంగుల్లో ఉంటూ కూడా అతి సాదాసీదాగా తనని తాను ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు తీజన్‌బాయి.

courtesy with Surya daily news paper - February 1, 2013


  • ================================
 Visit my website - > Dr.seshagirirao.com/

Tuesday, May 21, 2013

Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు

  •  

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


1963లో మోతీలాల్‌ నెహ్రూతో ప్రారంభం
1993లో జాతిపిత విగ్రహావిష్కరణ
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు ఎన్‌టిఆర్‌
వ్యవసాయ అభివృద్ధికి ఎన్‌.జి.రంగా కృషి
బ్రిటీష్‌వారికి గుండె చూపిన టంగుటూరి
తెలుగు వారిలో ముగ్గురికి చోటు

దేశ స్వాతంత్య్రం కోసం కొందరు, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం మరిందరు. జాతి ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వారు ఇంకొందరు. ఇలా అందరూ ఎంతో ఉన్నతమైన వారే. మన దేశచరిత్రలో ఎందరో మహానుభావులు. వారందరినీ స్మరించుకోవడానికిి, మున్ముందు తరాల కోసం పార్లమెంట్‌లో విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మోతీలాల్‌ నెహ్రూతో 1963లో ప్రారంభమైన ఈ ఏర్పాటులో ఇప్పటికీ 49 విగ్రహాలు ఏర్పాటయ్యారుు. నూతనంగా ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచస్థారుులో చాటిచెప్పి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని విగ్రహాల విశేషాలు...

పార్లమెంట్‌ను ఇద్దరు అర్కిటెక్‌ నిపుణులు రూపకల్పన చేశారు. సర్‌ ఎడ్విన్‌ లుట్యన్స్‌, సర్‌ హెర్బర్ట్‌ బాకెర్‌లే ప్లానింగ్‌ చేసి నిర్మాణం చేయించారు. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా నిర్మించారు. 18 జనవరి 1927న భవన ప్రారంభం జరిగింది. అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల 83లక్షల రూపాయలు. దీనికి 12 గేట్లు ఏర్పాటు చేశారు. గేట్‌ నెం.1 సన్‌సాద్‌ మార్గ్‌ ప్రధాన ద్వారం. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పార్లమెంట్‌ ఏర్పాటు చేశారు. జాతి గర్వించదగిన మహానుభావుల విగ్రహాలను పార్లమెంట్‌లో ఏర్పాటు చేశారు. హాల్‌లో, గ్రంథాలయంలో, కోర్డుయార్డులో, బయట కలిపిమొత్తం 49 విగ్రహాలు ఉన్నాయి. కొందరి విగ్రహాలు రెండు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఎన్‌.జి.రంగా, టంగుటూరి ప్రకాశం, ఎన్‌.టి.రామారావుల విగ్రహాలు తెలుగు వారి ఔన్నత్యాన్ని నిదర్శనంగా ఠీవిగా కనిపిస్తాయి

మహాత్మా గాందీ

16 అడుగుల ఎత్తు కాంస్యంతో తయారైంది మహాత్మా గాంధీ విగ్రహం. ఇది సరిగ్గా గేట్‌ నెం.1కి ఎదురుగా ఉంటుంది. ధ్యానంలో ఉన్న జాతి పితగా ఇది కనిపిస్తుంది. రామ్‌ సుతార్‌ అనే శిల్పి అత్యంత నైపుణ్యంతో దీన్ని తయారు చేశారు. 2 అక్టోబర్‌ 1993న నాటి రాష్టప్రతి శంకర్‌ దయాల్‌ శర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విగ్రహాన్ని దానం చేసింది. 1869న జన్మించిన బాపూజీ 1948లో నాధురామ్‌ గాడ్సే చేతితో హత్య చేయబడ్డారు.

బాబూజగ్జీవన్‌రామ్‌

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాను భావుడు. ప్రస్తుత స్పీకర్‌ మీరాకుమార్‌కు తండ్రి. లోక్‌ సభ చాంబర్‌ అవుట్‌ లాబీ వద్ద ఈయన విగ్రహం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తులో రామ్‌ సుతార్‌ అనే శిల్పి దీన్ని తయారు చేశారు. 25 ఆగస్టు 1995న శంకర్‌ దయాల్‌ శర్మ విగ్రహావిష్కరణ చేశారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశ్రమ ట్రస్టు విగ్రహాన్ని పార్లమెంట్‌కు అందజేసింది. 1908లో జన్మించిన జగ్జివన్‌ రామ్‌ 1986లో మృతిచెందారు.

బి.ఆర్‌. అంబేద్కర్‌

పార్లమెంట్‌ బయట ఉన్న ఉద్యానవనంలో 3.66 మీటర్ల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం నిలువెత్తుగా దర్శనమిస్తుంది. దీన్ని కాంస్యంతో తయారు చేశారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ కమిటీ విగ్రహాన్ని దానం చేయగా బి.వి.వాగ్‌ నైపుణ్యంతో తయారు చేశారు. 2 ఏప్రిల్‌ 1967న నాటి రాష్టప్రతి డా.సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ, ఎస్సీ, బిసీల అభివృద్ధికి బాటలు వేసిన జనోద్ధరణ నాయకుడు. 1891లో జన్మించిన అంబేద్కర్‌ 1956లో మృతిచెందారు

ఎన్‌.జి. రంగా

రైతుల ఎన్నో సేవలు చేసిన ప్రొఫెసర్‌ ఎన్‌.జి.రంగా. అందుకే మన రాష్ట్రంలో వ్యవసాయ విశ్వ విద్యాల యానికి ఎన్‌.జి.రంగా పేరు పెట్టుకున్నాం. డి.శంకర్‌ అతని సోదరులు ఈయన విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేసింది. నాటి ఉపరాష్టప్రతి కృష్ణకాంత్‌ 27 జులై 1998న విగ్రహావిష్కరణ చేశారు. 1900 సంవత్సరంలో పుట్టిన ఎన్‌.జి.రంగా 1995లో మృతిచెందారు.

టంగుటూరి ప్రకాశం

డి.శంకర్‌ అతని సోదరులు ఎంతో అద్భుతంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్రకేసరిగా గుర్తింపు పొందారు టంగుటూరి. 5 మే 2000న నాటి రాష్టప్రతి కె.ఆర్‌.నారాయణన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని దానం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ‘‘రండి రా.. దమ్ముంటే కాల్చుకోండి అంటూ బ్రిటీష్‌ వారికి గుండెను చూపిన ఆంధ్రుడు’’. 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం 1957లో మరణించారు.

జయప్రకాశ్‌ నారాయన్‌

జె.పి.విచార్‌ మంచ్‌ విగ్రహాన్ని దానం చేయగా కె.ఆర్‌.నారాయణన్‌ 3 జులై 2002 ఆవిష్కరణ చేశారు. భారత స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్‌ నారాయణ్‌ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్‌నాయక్‌ అని సగౌరవంగా పిలుచుకుంటారు. జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్‌ నారాయణ్‌ 1902 జన్మించి 1979లో మృతిచెందారు.

జ్యోతిరావు ఫూలే

గేట్‌ నెం.3 వద్ద గల ఉద్యానవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేయగా 3 డిసెంబర్‌ 2003న నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆవిష్కరణ చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన నాయకుడు. 12 అడుగుల ఎత్తులో కాంస్యంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

  • ఎన్‌.టి. రామారావు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసిన ధీరుడిగా ఎన్‌.టి.రామారావు ప్రసిద్ధి గాంచారు. పదేళ్లుగా ఈయన విగ్రహం పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని కుటుంబీకులు పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఎన్‌టిఆర్‌ కూతురు, కేంద్ర మంత్రి పురందేశ్వరీ విగ్రహాన్ని దానం చేయడంతో మార్గం సుగమమం అయింది. 7 మే 2013న అంగరంగ వైభవంగా కుటుంబీకులంతా తరలిరాగా స్పీకర్‌ మీరాకుమర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • ================================= 
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, May 19, 2013

Anoushka shankar ,అనౌష్క శంకర్‌





మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Anoushka shankar ,అనౌష్క శంకర్‌ -- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ప్రపంచ ప్రఖ్యాత సితార్‌ కళాకారుడు పండిత్‌ రవి శంకర్‌ కుమార్తె అనౌష్క శంకర్‌. అనౌష్క శంకర్‌ సైతం సితార్‌ ప్లేయర్‌గా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.

గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్‌ 1981 జూన్‌ 9న జన్మించారు. ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జన్మించారు. ఆమె లండన్‌లో జన్మిం చగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడి చింది. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ వాయించడాన్ని నేర్చుకు న్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్‌ షోలను నిర్వహిం చడం విశేషం.

ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. 1998లో విడుదలైన తన మొదటి మ్యూ జిక్‌ ఆల్బమ్‌ అనౌష్కతో ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించారు. అనంతరం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో కోల్‌కతాలోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు. నేడు సంగీత ప్రపంచంలో సితార్‌ వాయిద్యకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనౌష్క. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చు కొని సంగీతకారిణిగా పేరుతెచ్చుకున్నారు.

పాప్‌ మ్యూజిక్‌తో ఒకప్పుడు యూత్‌ను ఉర్రూతలూగించారు సై్పస్‌ గర్ల్‌‌స. అనంతరం కొంతకాలానికి విడిపోయిన ఈ గర్ల్‌‌స బ్యాండ్‌ తన సాంగ్స్‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేసిన కొందరు ప్రముఖులతో కలిసి ప్రఖ్యాత సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేస్తుండడం విశేషం. ఆసియా ఖండంలోని ఇండియాతో పాటు చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను వారు ఎంపికచేయనున్నారు. ఇక ఇండియా నుంచి టాలెంట్‌ ఉన్న పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేసే బాధ్యతను అనౌష్క శంకర్‌కు చెందిన సంస్థ ఆల్‌కెమిస్ట్‌ టాలెంట్‌ సొల్యూషన్‌ తీసుకుంది.

16 సంవత్స రాల నుంచి తాను సితార్‌ ఆర్టిస్ట్‌గా దేశ, విదేశాల్లో సంగీత ప్రదర్శనలిస్తున్నాననీ కానీ తనకు ఎక్కడా పాప్‌ మ్యూజిక్‌ రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న ఇండియన్‌ గర్ల్‌ కనిపించలేంచలేదని అనౌష్క అన్నారు. దీంతో తాను కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటు చేస్తున్న పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ ఏర్పాటులో భాగంగా ఇండియా నుంచి పాపులర్‌ సింగర్‌ను తాను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. ఈ బ్యాండ్‌లో సింగర్‌గా ఇండియన్‌ గర్ల్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇండియన్‌ ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు.

దేశం గర్వించదగ్గ సితార్‌ విద్వాంసుడు మా నాన్న. అయినా నాకూ వేధింపులు తప్పలేదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యాను. ఎవరికి చెప్పాలో, ఎలా వాటిని ఎదుర్కోవాలో తెలియక మౌనంగా భరించాను. మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దమనిషే అలా చేసేవాడు' అని పండిట్‌ రవిశంకర్‌ కూతురు, సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ చెప్పింది. ప్రేమికుల రోజున మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'వన్‌ బిలియన్‌ రైసింగ్‌' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 'ఒకటి, రెండుసార్లు కాదు, ఏళ్ల తరబడి ఆ వేధింపులు కొనసాగాయి. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయం కలిగేది. బాగా తెలిసిన వాళ్లను కూడా నమ్మలేకపోయేదాన్ని. ఎన్నో ఏళ్లు గడిచినా చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా నన్ను వదల్లేదు' అని చెప్పుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటోన్న అనౌష్క ఢిల్లీలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్య పరుస్తోంది. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది.



  •  ================================

Visit my website - > Dr.seshagirirao.com/ 

Thursday, April 4, 2013

Sister Niveditha,సిస్టర్ నివేదిత



  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Sister Niveditha,సిస్టర్ నివేదిత-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....





మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందుమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఐస్‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌.నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్పూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు(1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 113 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరిం చారు. ఇతరులపై దయ గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతం లోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జగదీష్‌చంద్రబోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు.1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారతస్వాతంత్య్రపోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికధైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్‌లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలు స్థాపించబడ్డాయి.

చివరి రోజుల్లో :
ఆమెను కడుపులో మోస్తుండా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం , తృప్తి తో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని ,తన తండ్రి ,తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయం లో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్ కి  పెద్ద షాక్ తగిలింది .
టీచర్ గా పనిచేస్తూ  తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరం గా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యిం హరించని , ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయం లో మార్గరెట్ కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబందించిన పుస్తకం ఇచ్చారు . అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.

అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారత దేశము వెళుతూ లండన్‌ లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామక్రిష్ణామిషన్‌ లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ''సిస్టర్ నివేదిత'' గా  వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది . కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది.ఆ రోజుల్లో వైద్యవిధానాలు , చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణము గా తన అనారొగ్యానికి కారణం తెలియ పర్చలేదు.  నా జీవితం మరో రెండేళ్ళు మించి లేదేమో అంటూ 1908 లొ ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది. ఏ స్నేహితురాలకైతే ఉత్తతం రాసిందో ఆమె మరణానికి దగ్గరగా ఉందని , తనను చూడాలనుకుంటుందని తెలిసి ఆరోగ్యము అంత బాగులేదని తెలిసికూడా బోస్టన్‌ వెళ్ళింది. దురదుస్టవశాత్తూ ఆ స్నేహితురాలి కూతురు నివేదిత మీద ఫిర్యాదుచేసింది. తమ తల్లిని మభ్యపెట్టి ఆస్తిని భారతదేశము తీసుకువెళ్తుందని ఫిర్యాదు. అలాంటి అవమారము తనకు జరుగుతుందని భావించని సిస్టర్ నివేదిత స్నేహితురాలి మరణం తర్వాత ఏప్రిల్ 11 , 1911 న తిరిగి భారతదేశము వచ్చింది. జీవితము లో నిరాశచెందిన ఆమె మనశ్శాంతి కోసము శాంతిదేశమైన భారత్ లోనే మనగలిగింది. దసరా సెలవులలో ఆమె మనసుకు విశ్రాంతి అవసరమని ప్రశాంతవాతావరణం కోసము మిత్రుది కుటుంబం తో కలిసి డార్జిలింగ్ వెళ్ళి రక్తవిరేచనాలు పట్టున్నందున వైద్యము ఇప్పించినా ఆమె శరీరము స్పందించలేదు . చివరిదశలో అనేకరకాల ఆద్యాత్మిక వాక్యాలు సిస్టర్ నివేదిత తన పుస్తకాలలో రాసుకున్నారు. ఆరోగ్యము మరింత క్షీణించడం తో 13 అక్టోబర్ 1911 న 2.30 గంటలకు తెల్లవారు జామున భగవంతునిలో లీనమైనది.

Source : Courtesy with Swathi Telugu weekly magazine and others.
  • ========================
Visit my website - > Dr.seshagirirao.com/