Saturday, December 28, 2013

C.N.R.Rao,సి.ఎన్‌.ఆర్‌.రావు,చింతామణి నాగేశ రామచంద్రరావు

  •  
  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - సి.ఎన్‌.ఆర్‌.రావు,చింతామణి నాగేశ రామచంద్రరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

   

 ఏ అమెరికాలోనో పుట్టుంటే ఇప్పటికే నోబెల్‌ పురస్కారాన్ని అందుకునేవారేమో. కానీ భారతీయ విలువలూ ఆధ్యాత్మికత- ఆయనను గొప్ప శాస్త్రవేత్తగానే కాదు, గొప్ప మనిషిగానూ తీర్చిదిద్దాయి. సైన్సులోని మానవతాకోణం ...చింతామణి నాగేశ రామచంద్రరావు.

సైన్స్‌ - ఓ మహారణ్యమైతే , ప్రయోగశాల - ముని కుటీరం. సాయనాలూ గాజునాళికలూ...చెట్లూచేమలూ. డాక్టర్‌ సి.ఎన్‌.ఆర్‌.రావు - సైన్సు మహర్షి!

 శాస్త్రసాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహాలూ సూచనలూ అందించే అత్యున్నత స్థాయి నిపుణుల బృందానికి నాయకుడంటే ఓ పట్టాన నమ్మకం కలగదు. అంత నిగర్వి, అంత నిరాడంబర వ్యక్తి ...చింతామణి నాగేశ రామచంద్రరావు. ఆయన పరిశోధనలు రసాయనాలకో గాజు నాళికలకో పరిమితం కాలేదు ... ఏ భౌతిక రసాయన శాస్త్రం దగ్గరో, నానో పరిశోధనలతోనో ఆగిపోలేదు. సైన్సు జెండా భుజానికెత్తుకున్న ఉద్యమకారుడు రావుగారు. రేపటి తరాలకు సైన్సంటే మక్కువ కలిగించడానికి బడిబాట పట్టిన దార్శనికత్వం ఆయనది.

అచ్చమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు రామచంద్ర. బాల్యమంతా బెంగళూరులోనే. నాన్న నాగేశరావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ ఎలిమెంటరీ స్కూలు దాకానే చదువుకున్నా..లోకజ్ఞానం మాత్రం అపారం. రామచంద్ర తొలిగురువు అమ్మే. ఒళ్లో కూర్చోబెట్టుకుని చెప్పిన రామాయణ భారత కథలూ, గోరుముద్దలు తినిపిస్తూ పాడిన పురందరదాసు కీర్తనలూ...తొలిపాఠాలు. నాన్నగారికేమో ఆంగ్లమంటే మక్కువ. ఏకాస్త సమయం దొరికినా... ఇంగ్లీషు నేర్పించేవారు. రామచంద్ర హైస్కూలులో ఉన్న సమయంలో... భారత స్వాతంత్య్ర పోరాటం ఊపందుకుంది. సుభాష్‌ చంద్రబోస్‌ ఆ కుర్రాడి ఆరాధ్య నాయకుడు. నేతాజీ వీరోచిత పోరాటాన్ని మిత్రులకు కథలుగా చెప్పేవాడు. పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే లోయర్‌ సెకెండరీ పరీక్షల్లో ఫస్టున పాసైనందుకు ... రామచంద్ర జేజమ్మ తన ముద్దుల మనవడికి రూపాయి కాసు కానుకగా ఇచ్చింది. డెబ్భై ఏళ్ల క్రితం రూపాయంటే... ఇప్పటి వేయి రూపాయలతో నమానం! దాన్ని జాగ్రత్తగా దాచుకుని, ఆతర్వాతెప్పుడో పుస్తకాలు కొనుక్కున్నాడు. పెరిగి పెద్దవుతున్నకొద్దీ స్వాతంత్య్ర ఉద్యమ తీవ్రతా పెరిగింది. ఎవరూ చెప్పకపోయినా...గాంధీటోపీ పెట్టుకున్నాడు, ఖద్దరు ధరించాడు. హైస్కూలు పెద్ద పరీక్ష పాసయ్యేనాటికి... దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎటు చూసినా సంబరాలే. కానీ మైసూరు సంస్థానం మాత్రం ఇంకా మహారాజు పాలనలోనే ఉండేది. ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ ప్రజాపోరాటం మొదలైంది. కౌమారంలోని ఆవేశం రామచంద్రనూ ఉద్యమంలోకి దింపింది. వీధుల్లో హర్తాళ్లు చేశాడు. వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చాడు. అలా అని, చదువుని నిర్లక్ష్యం చేయలేదు. పదిహేడేళ్లకే బీఎస్సీ పట్టా అందుకుని మైసూరు విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ లెక్చరరు సలహా మేరకు, తనకు ఎమ్మెస్సీలో సీటివ్వమంటూ బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి ఓ లేఖ రాశాడు. అక్కడ మాస్టర్స్‌ డిగ్రీ చదువుతూనే పరిశోధన చేసే వెసులుబాటు ఉండేది. ఆ ప్రత్యేకతే రామచంద్రను ఆకర్షించింది. వెంటనే బయల్దేరి రమ్మంటూ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తంతి పంపారు. రామచంద్ర బెనారస్‌ బండి ఎక్కాడు. ఎటూ సైన్స్‌ విద్యార్థే కాబట్టి, హేతుబద్ధంగా ఆలోచించడం అతనికెవరూ నేర్పాల్సిన అవసరం రాలేదు. కానీ సైన్సు కంటే ఇంకాస్త ముందుకెళ్లి...ఆధ్యాత్మికత గురించి బోధించింది మాత్రం వారణాసి వాతావరణమే. గంగాస్నానం, విశ్వేశ్వరుడి దర్శనం, సాధుసంతుల సాంగత్యం - రామచంద్ర ఆలోచనలపై చాలా ప్రభావం చూపాయి. ఎమ్మెస్సీ పట్టాతో బెంగళూరుకు తిరిగొచ్చినా...ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో తన విభాగానికి సంబంధించి పెద్దగా పరిశోధన అవకాశాలు లేకపోవడంతో...పీహెచ్‌డీ కోసం ఖరగ్‌పూర్‌ ఐఐటీకి వెళ్లాడు.

ఖరగ్‌పూర్‌లో కఠోరశ్రమ చేస్తున్నా...అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తన పరిశోధన సాగడం లేదన్న అసంతృప్తి వెంటాడేది. అప్పుడే, ఓ ప్రొఫెసరుగారు 'నువ్వు అమెరికా ఎందుకు వెళ్లకూడదు?' అని సలహా ఇచ్చారు. అప్పటిదాకా రామచంద్రకు ఆ ఆలోచనే రాలేదు. పేరున్న విశ్వవిద్యాలయాలన్నిటికీ దరఖాస్తు చేశాడు. అన్నిచోట్లా సీటొచ్చింది. తను మాత్రం పర్‌డ్యూ విశ్వవిద్యాలయంలోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. దిగ్గజాల్లాంటి ప్రొఫెసర్లు ఉన్నారక్కడ. తీరా బయల్దేరేముందు, కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఆరోజుల్లో సంప్రదాయ కుటుంబాలవారు సముద్రయానం చేసేవారు కాదు. ఎలాగోలా కన్నవారిని ఒప్పించి...ఓడ ఎక్కాడు. ప్రయాణికులంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే, తను మాత్రం పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. లేదంటే, ఆ అనంత జలనిధిని చూస్తూ...సృష్టిలోతుల్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఇరవై రోజుల ప్రయాణం తర్వాత న్యూయార్క్‌ నగరాన్ని చేరుకున్నాడు. కొత్త వాతావరణం, కొత్త భాష, కొత్త సంస్కృతి. అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. తన దృష్టంతా చదువుల మీదే ఉండటంతో... మరో ఆలోచన వచ్చేది కాదు. ఆరేడేళ్లకైనా కొలిక్కిరాని పరిశోధనల్ని రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేశాడు. అక్కడే తన అభిమాన గురువు లినస్‌ పాలింగ్‌ను కలుసుకునే అవకాశమూ వచ్చింది. రసాయనశాస్త్రంలో మరిన్ని పరిశోధనల దిశగా ప్రోత్సహించిందీ ఆయనే. ఆతర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీలో పైచదువులు చదివాడు. పోస్ట్‌ డాక్టొరల్‌ తర్వాత ... అమెరికాలో స్థిరపడాలా, మాతృదేశానికి తిరిగిరావాలా? అన్న ప్రశ్న. మరొకరైతే... ఇంకో ఆలోచన లేకుండా, ఏ అమెరికన్‌ యూనివర్సిటీలోనో చేరిపోయేవారు. నిజానికి, భారత్‌లో రసాయనశాస్త్ర పరిశోధకులకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ రామచంద్ర వెనక్కి వచ్చేయాలనే నిర్ణయించుకున్నాడు. అప్పటికే అమెరికా రసాయనశాస్త్రంలో చాలాముందుంది. భారత్‌ అప్పుడే తొలి అడుగులు వేస్తోంది. మాతృదేశానికే తన అవసరం ఎక్కువని గ్రహించాడు. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి... అమ్మానాన్నలూ కొడుకు తిరిగిరావాలనే కోరుకున్నారు.

విదేశాల నుంచి రాగానే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో లెక్చరర్‌గా చేరారు రామచంద్ర. జీతం నెలకు ఐదు వందలు. అంత చదువు చదివీ అన్ని అర్హతలుండీ ... అంత చిన్న కొలువేమిటని బంధుమిత్రులు అడ్డుచెప్పినా పట్టించుకోలేదు. అప్పటికి భారత్‌లో ఎంతోకొంత ప్రతిష్ఠ కలిగిన సంస్థగా ఐఐఎస్‌సీ పేరు తెచ్చుకుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా భౌతిక రసాయనశాస్త్ర పరిశోధనశాల లేదు. దానికితోడు ... అంతర్గత రాజకీయాలు, నిధుల కొరత. భౌతికశాస్త్రానికి ఓ పరిశోధనశాల ఉన్నా... అందులోకి రామచంద్రను అనుమతించలేదు. అదో రంపపు కోత! ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. 'చీకట్లో ఉన్నానని బాధపడుతూ కూర్చుంటే, ఫలితం లేదు. దీపం వెలిగించాలి. వెలుతురును ఆహ్వానించాలి' అని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అందుబాటులో ఉన్న నిధులతోనే చిన్న పరిశోధనశాల ఏర్పాటు చేశారు. టైటానియం డయాక్సైడ్‌పై పరిశోధనలు చేశారు. తన దగ్గరున్న ఆరుగురు పీహెచ్‌డీ విద్యార్థులతోనూ ప్రయోగాలు చేయించారు. ఆ అనుభవాలతో ఓ పుస్తకం రాశారు. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ముద్రణ సంస్థ దాన్ని విడుదల చేసింది. అప్పుడే, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్‌ పరిచయం అయ్యారు. హైస్కూలు రోజుల్లో తొలిసారిగా రామన్‌ను చూశారు రామచంద్ర. ఆయనలోని వినయం, విజ్ఞానం రామచంద్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ముడిసరుకుగా ఉపయోగపడ్డాయి. ఓసారి, తనే స్వయంగా వచ్చి.. రామచంద్రకు ఓ సైన్స్‌ జర్నల్‌ ఇచ్చి వెళ్లారు. 'నువ్వు రాసిన కెమికల్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ ఇన్ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపీ పుస్తకం చాలా బావుంది' అని ఉత్తరం రాశారు. మరో సందర్భంలో ... రామచంద్ర ఉపన్యాసాన్ని విని 'నువ్వో నిప్పు కణిక. మంచి భవిష్యత్తు ఉంది' అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఐఐఎస్‌సీలో మేధోపరమైన స్వేచ్ఛ ఉన్నా...పరిశోధనలకు అవకాశాలు తక్కువ. దీనివల్ల తన ఆలోచనలకు ఓ రూపం ఇవ్వలేకపోతున్నాననే బాధ వెంటాడేది. అప్పుడే, ఐఐటీ కాన్పూర్‌ నుంచి పిలుపు వచ్చింది. పరిశోధనల కోసం తగినన్ని వనరులు సమకూరుస్తామని యాజమాన్యం మాటిచ్చింది. ఓ శాస్త్రవేత్తగా, రసాయనశాస్త్ర అభిమానిగా ...రామచంద్ర తనను తాను నిరూపించుకోడానికి ఐఐటీ ప్రాంగణం ఓ వేదికైంది. మూడుపదులు నిండకుండానే ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకున్నారు. 'వింటర్‌ స్కూల్‌' పేరుతో...దేశంలోని రసాయనశాస్త్ర బోధకులకు అంతర్జాతీయ నిపుణులతో పాఠాలు చెప్పించారు. రసాయనశాస్త్రం మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఓ న్యూస్‌లెటర్‌ ప్రారంభించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయుల కోసం, బాలల కోసం 'కెమిస్ట్రీ టుడే', 'అండర్‌స్టాండింగ్‌ ఇన్‌ కెమిస్ట్రీ' వంటి పుస్తకాలు రాశారు. 'నానో వరల్డ్‌'ను స్వీడిష్‌ భాషలోకీ తర్జుమా చేసుకున్నారు. కొంతకాలం విదేశాలకెళ్లి ...ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రసాయనశాస్త్ర విజ్ఞానానికి మెరుగులు పెట్టుకుని వచ్చారు. అప్పుడే, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ సతీష్‌ధావన్‌ నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. 'మీరు బెంగళూరు రావాలంటే, ఏం చేయాలో చెప్పండి చాలు' అంటూ. రామచంద్ర పదవులు కోరుకోలేదు, పెద్ద జీతాలూ కోరుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీలో పరిశోధన సౌకర్యాలు కల్పిస్తే చాలన్నారు. ధావన్‌ సంతోషంగా అంగీకరించారు. ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయించారు. కాస్త ఆలస్యంగా అయినా...అనుకున్నవన్నీ సమకూరాయి. ఆతర్వాత కొంతకాలానికి రామచంద్ర డైరెక్టరు స్థాయికి ఎదిగారు. ఐఐఎస్‌సీకి మహర్దశ మొదలైంది. నిధులొచ్చాయి, భవనాలొచ్చాయి, పరిశోధనశాలలొచ్చాయి. దేశంలోని మెరికల్లాంటి శాస్త్రవేత్తల్ని ఏరికోరి తెచ్చుకున్నారు రామచంద్ర. 'చాలా సందర్భాల్లో మనం వెనకబడిపోవడానికి కారణం నిధుల కొరతో, సౌకర్యాల లేమో కాదు - మనలోని నిర్లిప్తత, నిరాశావాదం. ముందు దాన్ని తరిమికొట్టాలి' అంటారాయన. అరవై ఏళ్లు నిండగానే... రామచంద్ర ఐఐఎస్‌సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరో ఐదేళ్లు కొనసాగాలంటూ అభ్యర్థనలు వచ్చినా కాదన్నారు. పరిశోధనలకే పూర్తి సమయం కేటాయించాలని ఉందని స్పష్టం చేశారు. ఆ పదవికి మరో సమర్ధుడి పేరు సూచించారు. తన విజ్ఞానాన్నీ అనుభవాన్నీ రంగరించి, బెంగళూరు శివార్లలో జవహర్‌లాల్‌నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. నిర్మాణశైలి నుంచి సైన్సు పరికరాల దాకా...అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నారు. శాస్త్ర పరిశోధనలో, శిక్షణలో అంతర్జాతీయ శ్రేణి సంస్థగా తీర్చిదిద్దారు.

రామచంద్ర పరిశోధనలు రసాయనశాస్త్రంలో మైలురాళ్లు. సాలిడ్‌స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో ఆయన వెలుగులోకి తెచ్చిన వివిధ అంశాలు అనేక ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో కొత్త మార్పులకు దారిచూపాయి. నానో పదార్థాల రంగంలోనూ అపారమైన కృషి చేశారు. ప్రస్తుతం కృతక ఫొటో సింథసిస్‌ రసాయన విజ్ఞానంపై దృష్టి సారించారు. ఆరు దశాబ్దాల పరిశోధనా జీవితం తర్వాత కూడా...ఆయనలో కాస్తంతైనా అలసట లేదు. ఇప్పటికీ ఏవో పరిశోధనలు చేస్తుంటారు. 'ఓసారి నేను కేంబ్రిడ్జి ప్రొఫెసర్‌ నెవిల్‌మోట్‌ను కలవడానికి వెళ్లాను. ఆ సమయానికి ఆయన, పరిశోధన పత్రాల్లో అచ్చుతప్పులు సరిచేస్తూ కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు తొంభై ఒకటి. వయసును గెలవడం ఎలాగో ఆయన్ని చూసే నేర్చుకున్నాను' అంటారు. ఎనిమిదిపదులు దగ్గరపడుతున్నా...రామచంద్ర జ్ఞానకాంక్ష తీరలేదు. యువ విద్యార్థుల్ని చూడగానే యువకుడైపోతారు. కొత్త పుస్తకం కనిపించగానే విద్యార్థిగా మారిపోతారు.

రసాయనశాస్త్ర పాఠం చెప్పాలంటే, రామచంద్ర మాస్టారే చెప్పాలన్నంత పేరు తెచ్చుకున్నారు. ఆ శైలి చాలా వైవిధ్యం. సైన్స్‌ను కూడా సాహిత్యమంత ఆసక్తికరంగా బోధించడం ఆయనకే తెలుసు. 'విద్యార్థుల్ని రసాయనశాస్త్రం వైపు ఆకట్టుకోవాలంటే...మనం ఏం సాధించామన్నది కాదు, ఏం సాధించాల్సి ఉందో చెప్పాలి. వాళ్ల బుర్రలకు సవాలు విసరాలి' అంటారాయన. ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లి... పిల్లలతో ముచ్చటిస్తుంటారు, సైన్స్‌ సంగతులు ఆసక్తికరంగా చెబుతుంటారు. విద్యార్థుల కోసం, పరిశోధకుల కోసం రామచంద్ర ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కొన్నిసార్లు విద్యార్థుల భోజనమూ అక్కడే. 'సగటు విద్యార్థితోనూ అద్భుతాలు చేయించగల గురువు ఆయన. రామచంద్రగారితో పదినిమిషాలు మాట్లాడినా చాలు.. పదేళ్లకు సరిపడా స్ఫూర్తిని పొందుతాం' అంటాడు పరిశోధక విద్యార్థి జాన్‌ థామస్‌. బిమన్‌ బాగ్చీ అనే సహచరుడిని రామచంద్ర యువ సైంటిస్టు అవార్డుకు ప్రతిపాదించారు. కానీ బాగ్చీ గడువులోపు అవసరమైన పత్రాల్ని సిద్ధంచేయలేకపోయాడు. దీంతో రావుగారే వాటిని ఢిల్లీకి తీసుకెళ్లి ఇచ్చారు. ఆయన ఓ పట్టాన విద్యార్థుల్ని మెచ్చుకోరు. ఇంకా ఇంకా పరిశోధించాలంటారు, ఇంకా ఇంకా సాధించాలంటారు. 'నాట్‌ బ్యాడ్‌' అన్నారంటే, 'వెరీగుడ్‌' అన్నంత సంబరం వాళ్లకు. ఆయన శిష్యుల్లో చాలామంది పద్మశ్రీలు అయ్యారు, భట్నాగర్‌ అవార్డు గెలుచుకున్నారు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు తనే ఫీజులు కట్టారు, హాస్టలు బిల్లులు చెల్లించారు. 'ఉదయం పూట ఆయనతో నడకకి వెళ్లడానికి మేం పోటీపడేవాళ్లం. ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. ప్రతి మాటా ఓ అమూల్యమైన పాఠమే' అని గుర్తుచేసుకుంటాడు ప్రదీప్‌ అనే పూర్వ విద్యార్థి. 'గురువులను గౌరవించే దేశాలే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. సైన్స్‌ ఉపాధ్యాయుల జీతాలు పెరగాలి. అప్పుడే తెలివైన యువతీయువకులు ఇటువైపు వస్తారు. ఆ విషయంలో ఫిన్‌లాండ్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉంది. భారత్‌ ఏ అడుగునో కనబడుతుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు రామచంద్ర.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే...ఢిల్లీ పెద్దల దృష్టి రామచంద్ర మీద పడింది. దార్శనిక పత్రాలూ నివేదికలూ అవసరమైన ప్రతిసారీ ఆయన్ని పిలిపించేవారు. 'భారత ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ సైంటిస్టుల ప్రతినిధి రామచంద్రగారే' అన్న కస్తూరి రంగన్‌ వ్యాఖ్య నూటికి నూరుపాళ్లూ నిజం. ఓసారి ఇందిరాజీ ఏదో పెద్ద పదవి ఇవ్వాలనే పిలిపించారు. రామచంద్ర అంగీకరించలేదు. 'నాకు సైంటిస్టుగా ఉండటమే ఇష్టం' అంటూ సున్నితంగా తిరస్కరించారు. 'పిలిచి పదవి ఇస్తానంటే వద్దని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే' అన్నారట ఇందిరాగాంధీ. ఆ తరవాత, ఇందిర వారసుడిగా రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రాన్ని జపించే యువ రాజీవ్‌కు రామచంద్ర ఆలోచనలు బాగా నచ్చాయి. రాజీవ్‌ హయాంలో రామచంద్ర నేతృత్వంలోని నిపుణుల బృందం దేశ శాస్త్రసాంకేతిక ప్రగతికి దిశానిర్దేశం చేసింది. విజన్‌-2020, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌, దేశీయ సూపర్‌ కంప్యూటర్‌ - ఆ మేధోమధన ఫలితాలే. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్స్‌ (సి-డాక్‌) కూడా రామచంద్ర నేతృత్వంలోని సలహామండలి ఆలోచనే. యూపీయే ప్రభుత్వ కీలక శాస్త్ర నిర్ణయాల వెనుకా .. ఆయన ఉన్నారు. రామచంద్ర దృష్టిలో సైన్స్‌ అంటే... రసాయనాలూ పరిశోధనలే కాదు. సువిశాల సమాజం కూడా. మన చుట్టూ ఉన్న అనేక సమస్యలకు సైన్స్‌లోనే పరిష్కారం ఉందని బలంగా విశ్వసిస్తారు. 'సైన్స్‌ తగ్గిపోయినకొద్దీ ఛాందసవాదం ప్రబలుతుంది. హేతువాదం కనుమరుగవుతుంది. మానవత్వం మట్టిపాలు అవుతుంది. ఛాందసవాదులు గాల్లో ఎగరాల్సిన విమానాల్ని మనుషుల మీదికి తోలేస్తారు' అని హెచ్చరిస్తారు. ఆమధ్య 'ఇజ్రాయెల్‌ నోబెల్‌'గా ప్రాచుర్యం పొందిన డాన్‌డేవిడ్‌ పురస్కారంతో పాటూ పది లక్షల డాలర్ల నగదు బహుమతినీ ఇచ్చారు. మరో ఆలోచన లేకుండా, రావుగారు ఆ భారీ మొత్తాన్ని జవహర్‌లాల్‌నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధనా కేంద్రానికి విరాళంగా ఇచ్చారు.
రామచంద్ర బహుముఖ ప్రజ్ఞావంతులు. కళలు, సాహిత్యం, వర్తమాన అంశాలు - దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలరు. నెలకో కొత్త పుస్తకమైనా చదువుతారు. ఆయనలో లోతైన ఆధ్యాత్మిక భావాలున్నాయి. ద్వైతగురువు మధ్వాచార్యుల ప్రభావం అపారం. 'నేను దేవుణ్ని నమ్ముతానని చెప్పడానికి సంకోచించను. అలా అని, మూఢనమ్మకాల్లేవు. నేను విశ్వసించే దేవుడు సర్వవ్యాపకుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు. చాలా సందర్భాల్లో సమస్యల్ని ఎదుర్కోడానికి అవసరమైన నైతికశక్తి ఆధ్యాత్మికత ద్వారానే అందుతుంది' అంటారు. ధ్యానం, ప్రార్థన - హృదయ నేత్రాలని అభివర్ణిస్తారు.


పూర్తిపేరు : చింతామణి నాగేశ రామచంద్రరావు,
పుట్టిన తేదీ : జూన్‌ 30, 1934,
హోదా : భారత ప్రధాని శాస్త్ర సలహా మండలి అధ్యక్షుడు,,
చదువు : ఎమ్మెస్సీ (బెనారస్‌ హిందూ యూనివర్సిటీ), పీహెచ్‌డీ (పర్‌డ్యూ యూనివర్సిటీ), డీఎస్సీ (మైసూర్‌ యూనివర్సిటీ)
పరిశోధన : సాలిడ్‌స్టేట్‌, మెటీరియల్స్‌ కెమిస్ట్రీ, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ
గౌరవ డాక్టరేట్లు : 51 విశ్వవిద్యాలయాల నుంచి.
పరిశోధన పత్రాలు : పదిహేను వందలకు పైగా.
రచనలు : దాదాపు యాభై పుస్తకాలు.
పీహెచ్‌డీ శిష్యులు : 150 మందికి పైగా,
ఆత్మకథ : క్త్లెంబింగ్‌ ద లిమిట్‌లెస్‌ ల్యాడర్‌ - ఎ లైఫ్‌ ఇన్‌ ద కెమిస్ట్రీ ,,
అవార్డులు : భారతరత్న సాధించిన మూడో శాస్త్రవేత్త. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌,ఇండియన్‌ సైన్స్‌ ప్రైజ్‌, ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ (రష్యా), రాయల్‌ సొసైటీ క్వీన్స్‌ మెడల్‌ (లండన్‌), ఇంటర్నేషనల్‌ సైన్స్‌ కోఆపరేషన్‌ అవార్డు (చైనా), లేజియన్‌ ఆఫ్‌ ఆనర్‌ (ఫ్రాన్స్‌).
నినాదం : అందరికీ సైన్స్‌ - అందరి కోసం సైన్స్‌.

రావుగారింట్లో సరస్వతీ కళ తాండవిస్తుంది. అర్ధాంగి ఇందుమతి పెళ్లినాటికే ఆంగ్లసాహిత్యంలో ఆనర్స్‌ చేశారు. ఆతర్వాత, పరిశోధన చేసి డాక్టరేట్‌ సాధించారు. బోధన వృత్తిలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఇద్దరికీ సంగీత సాహిత్యాలంటే ప్రాణం. హిందుస్థానీ క్లాసిక్స్‌ను హాయిగా ఆస్వాదిస్తారు. కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృథా చేయడం ఇద్దరికీ ఇష్టం ఉండదు. 'మౌనం ద్వారానే ఒకర్నొకరు బాగా అర్థంచేసుకున్నాం' అంటారా దంపతులు. పిల్లలు సుచిత్ర, సంజయ్‌ల పెంపకం బాధ్యత ఇందుమతిదే. పెళ్లిళ్లకూ శుభకార్యాలకూ తనొక్కరే వెళ్లేవారు. 'మా పెళ్లికీ పిల్లల పెళ్లికీ తప్పించి ఏ పెళ్లికీ ఆయన రాలేదు' అని నవ్వుతూ ఫిర్యాదు చేస్తారామె. 'నా జీవితానికి రెండే లక్ష్యాలు- ఒకటి, పరిశోధన పత్రాలు ప్రచురించడం. రెండు, నా భార్యను సంతోషపెట్టడం' అంటూ ఎదురుబాణం వేస్తారు రావుగారు. 

Courtesy with : sunday magazine@eenadu news pepar
  • ======================================== 
Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, July 27, 2013

Jayadevudu , జయదేవుడు




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jayadevudu , జయదేవుడు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



జయదేవుని తల్లిదండ్రులు భోజదేవ, రమాదేవీ. వీరు కనౌజ్‌ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ దంపతులు. ఉద్యోగాన్ని వెదుక్కుంటూ జయదేవుడి తండ్రి భోజదేవుడు తన భార్యతో సహా కెండులిని చేరాడు. అక్కడే వారికి జయదేవుడు జన్మించాడు. ఐతే జయదేవుడు పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాధ అయ్యారు. కానీ ధైర్యాన్ని వదులుకోకుండా ఎంతో పట్టుదలతో సంస్కృతం నేర్చుకుని నైపుణ్యత గల కవిగా తయారయారు జయదేవుడు. స్వతహాగా శ్రీకృష్ణ భక్తుడైన జయదేవుడు ఇహ లోక జీవితంపై అంతగా ఆసక్తిని కనబరచలేదు. కృష్ణ్ణలీలను గానం చేస్తూ చాలా సంవత్సరాలు అనేక స్థలాలను తిరుగుతూ బెంగాలుకు దక్షిణం వైపున ఉన్న ఒరిస్సాలోని జగన్నాధపురిని చేరాడు. పూరి జగన్నాధుడిని సేవించాడు. చేతిలో పిల్లనగ్రోవిని ధరించిన శ్రీకృష్ణుణ్ణి జయదేవుడు దర్శించాడు. ఆ తరువాత ఇతడు విష్ణువు ఇతర అవతారాలైన దశావతారాలను దర్శించాడు.

పూరిలోని సుదేవశర్మ అనే పురోహితుడు జయదేవుడి జీవితానికి ఒక మలుపును ఇచ్చాడు. దాంతో అతడి జీవితమే మారిపోయింది. భగవత్‌ సన్నిధిలో నృత్యం చేసే తన అందాల రాశి కూతురు పద్మావతితో జయదేవుడి పెళ్లిని సుదేవశర్మ జరిపించాడు. మొదట్లో తాను వ్రతం చెడని సన్యాసినని... పెళ్లి వద్దని జయదేవుడు మొరాయించాడు. జగన్నాధుడే తనకు కలలో కనిపించి తన కూతురు పెళ్లిని నీతో చెయ్యమని ఆదేశించాడు అని సుదేవశర్మ చెప్పడంతో జయదేవుడు తమ మనసును మార్చుకున్నాడు. తన కవితకు కావలసిన స్ఫూర్తిని జయదేవుడు తన అందాల రాశి భార్య పద్మావతిలో చూసాడు. కెండులి గ్రామానికి భార్యతో తిరిగివచ్చి భార్యాభర్తలు తమ కాలాన్ని అక్కడే గడిపారు. అక్కడే...ఆ ప్రాంతంలో జయదేవుడు విశ్వవిఖ్యాతమైన గీతగోవిందం రచనకు పూనుకున్నాడు. గోపాల కృష్ణుడికి బృందావనంలోని రాధ పట్ల ఉన్న ప్రేమను ఈ కావ్యం వ్యక్తపరుస్తుంది. ఇందులో మొత్తం 24 అష్టపదులున్నాయి. ప్రతి అష్టపదినీ ఒక ప్రత్యేక రాగంతో, ప్రత్యేక తాళాన్ని అనుసరించి శాస్ర్తీయ బాణీలో జయదేవుడు రచించారు.

జయదేవుడు భక్తిపారవశ్యంతో రాస్తున్నప్పుడు పద్మావతి నృత్యాభినయం చేస్తూ తన భర్తకు స్ఫూర్తినిచ్చేదట. ఐతే ఆఖరి దశలో అతని ఘంటం ముందుకు సాగలేకపోయింది. అష్టపదిలోని ఆఖరి రెండు చరణాలను జయదేవుడు విశ్వ ప్రయత్నం చేసినా రాయలేకపోయారు. నిరుత్సాహంతో ఆయన నదీ స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆ రెండు చరణాలను పూర్తిచేశారన్న కథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ చరణాలను పూర్తి చేసిన తరువాత పద్మావతి తన భర్త కోసం చేసిన అన్నం తిని కృష్ణుడు బయటకి వెళ్ళారట. స్నానం చేసి తిరిగివచ్చిన జయదేవుడు జరిగిన విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయారు.... ఈ రోజు గీతగోవిందం దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ఒరిస్సా, బెంగాలు, దక్షిణ భారత దేశపు భక్తి సంగీతంలో గీతగోవిందం చోటుచేసుకుంది. కేరళలోని అనేక దేవాలయాల్లో అష్టపదుల గానం ఈ రోజుకూ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచ సాహిత్య కళాఖండంగా గీతగోవిందం పరిగణించబడుతోంది.

  •  ==============================
 Visit my website - > Dr.seshagirirao.com/

Teejan bhai,తీజన్‌ బాయి




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Teejan bhai,తీజన్‌ బాయి-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


Born --    April 24, 1956 (age 57),
Place of birth --Ganiyari village, Chhattisgarh,
Occupation ---    Pandavani Folk Singer,
Spouse(s) ---    Tukka Ram,
Awards --    Padma Bhushan 2003,Padma Shri 1988,Sangeet Natak Akademi Award 1995,

ఏకబిగిన ఆదిపర్వం మొదలుకొని మొత్తం పద్దెనిమి ది పర్వాలు పాడగలిగిన అద్భుత అధ్యయ నం అది. ఎలా సాధ్యం అనడిగితే ఆ కథ మీది అపా రమైన ప్రేమ అని సమాధానం. ఈ కళ ఆ పాండవ కథ ఎలా ఇన్నేళ్లుగా సాగుతూ వస్తున్నా యని అడిగితే ఆమె వివరించే ప్రవా హం ఏ కథ ఫ్లాట్‌, స్ట్రక్చర్‌కై నా ధీటుగా ఉంటుం ది. పాండవుల కథని పుక్కిట పట్టాక, తన జీవితాన్ని వినిపించడం ఒక పనా అంటుంది ఆమె. అక్షర విద్వత్తుకి ఆవలివైపు, చేతిమీద పచ్చబొట్టుగా పొడిపించుకున్న తన అయిదు అక్షరాల పేరును రాయడానికి పది నిమిషాలు తీసుకుంటానని కించిత్తు అభిమా నంగా చెప్పే తీజన్‌బా యి- పద్మశ్రీ, పద్మభూషణ్‌, డి.లిట్‌, మూడు డాక్టరేట్‌లు పోటీపడి వరించాయి. ఆమె పారిస్‌ ఫెస్టివల్‌- సంగీత నాటక అకా డమీ అవార్డు- వీటితోపాటుగా మరిన్ని రివార్డులు అందుకున్నారు.

-ఆమె జీవితపు ప్రతి కోణం ఒక పాఠం నేర్పే రీతిలో ఉంటుంది. ఒక ఆదివాసీ సమాజపు నేపథ్యం నుండి దేశ అత్యున్నత పురస్కారాలకు ఎదగడం మధ్య జరిగిన జీవిత అనుభవాలు ఎలాంటివో అవి తెలిస్తే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పురుషులు చెప్పే పండ్వానీ కథని పోట్లాడి మరీ పాడిన మొదటి మహిళ ఘనత తీజన్‌బాయిది. ఇది సాహిత్యంలో గుర్తింపు పొందగలగాలి. ఆ కథ, దాని ఔన్నత్యం, ఆ కథనరీతి, శైలి... అది భారతీయ కథనరీతులను ప్రభావం చేసిన తీరు సవిస్తార పాఠ్యాంశంగా ఉండగలగాలి. పాడేవాళ్ళు పాడుకుని సంతోషిస్తే, చదువరులు దాన్ని చదువుకుని తమ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.ఎరుపు, నలుపు రంగులు కలిసిన తన ప్రాంతపు కట్టుబొట్టతోకఢా, కాక్‌నీ, బిందీ లాంటి నగలతో తన (ఆహార్యాన్ని) దుస్తులని తానే ఎంచుకున్నానని చెబుతారామె. అన్నీకలిసి ఎనిమిది కిలోల బరువుంటాయట. మోస్తూ కథ చెప్పడం కష్టం కదా అంటే చెప్పేది భీముడు, సుయోధనుడు, ద్రౌపదిల గురించి కదా అని చమత్కరించింది. భీముడు ఆవిడకి ఇష్టుడు. కల్లాకపటం లేనివాడు కాబట్టి. ఒక్క భారతమే ఎందుకు రామాయణం కూడా చెప్పవచ్చు కదా అంటే భారతంతో మనసు అంటారు.

-అలా హృదయపు లోతుల్లో నుండి రాలేని కళ జనంలోనికెళ్ళలేదు, వాళ్ళ మనసులని తాకలేదు అని ఆమె భావన.అలా జనాల్లోకి వెళ్ళిన తన కళని ఇప్పటికి రెండు వందలపైగా ఔత్సాహికులకి ఆమె నేర్పారు. వాళ్ళలో ఉపాబాలా, మీనా సాహు, రీతూ వర్మ, సీమాఘోష్‌ లాంటి విద్యార్థులని గుర్తుచేసుకుంటారు తీజన్‌బాయి. తన దగ్గరకొచ్చి తర్ఫీదయే విద్యార్థులు కాకుండా తన గాన రీతిని సొంతం చేసుకొని పాడేవాళ్ళని ఆమె ఆక్షేపించరు. మీ సలహాలేకుండా మీ శైలిలో పాడుతున్నారు కదా అంటే విశ్వవ్యాప్త కళ ఇది. పరిధులు, సీమలు ఎందుకంటారు. రామ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఈ కళని పాఠ్యాంశంగా ఇంకా గుర్తించనప్పటికీ, ఈ కళారూపం గానరీతి పద్ధతులపై వర్క్‌షాపులవీ నిర్వహిస్తుంటారని తీజన్‌బాయి సెక్రటరీ చెప్తారు. ఆ పరంగా తన కళని ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్నారామె. వయసెంతని అడిగితే మనమల పిల్లల్ని ఆడించుకుంటానని జవాబు. ఇన్నేళ్ళ ఎగుడు దిగుడు జీవితం ఒకవైపు, ఎలాంటి ఎగుడుదిగుడుల్లోనైనా మొక్కవోని తన పండ్వాని కథ మరోవైపు. కథని జీవితం చేసుకున్నాక జీవితం తనని బాధించలేదు.

ఆ కళలో ఏకలీనం అవుతుందామె. ఇక తీజన్‌బాయిలో గుర్తించాల్సిన మరో కోణం ఏమిటంటే ఈ సాద్‌గీని భద్రంగా పెట్టుకోవడం కూడా తన కళలో భాగమైంది. దేశ విదేశాలు అఖండ ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలు, కొద్దిపాటి డబ్బు, ఆ పరంగా వచ్చే మార్పులు ఇవేవీ కళని తాకనివ్వకుండా తనని తాను సంభాళించుకోవడం కూడా ఒక కళనే. ఒక సెక్రటరీ, అపాయింట్‌మెంట్స్‌ ఆ హంగుల్లో ఉంటూ కూడా అతి సాదాసీదాగా తనని తాను ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు తీజన్‌బాయి.

courtesy with Surya daily news paper - February 1, 2013


  • ================================
 Visit my website - > Dr.seshagirirao.com/

Tuesday, May 21, 2013

Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు

  •  

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Hagiography statues in Parliament, పార్లమెంట్‌లో మహాత్ముల విగ్రహాలు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


1963లో మోతీలాల్‌ నెహ్రూతో ప్రారంభం
1993లో జాతిపిత విగ్రహావిష్కరణ
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు ఎన్‌టిఆర్‌
వ్యవసాయ అభివృద్ధికి ఎన్‌.జి.రంగా కృషి
బ్రిటీష్‌వారికి గుండె చూపిన టంగుటూరి
తెలుగు వారిలో ముగ్గురికి చోటు

దేశ స్వాతంత్య్రం కోసం కొందరు, బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం మరిందరు. జాతి ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వారు ఇంకొందరు. ఇలా అందరూ ఎంతో ఉన్నతమైన వారే. మన దేశచరిత్రలో ఎందరో మహానుభావులు. వారందరినీ స్మరించుకోవడానికిి, మున్ముందు తరాల కోసం పార్లమెంట్‌లో విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మోతీలాల్‌ నెహ్రూతో 1963లో ప్రారంభమైన ఈ ఏర్పాటులో ఇప్పటికీ 49 విగ్రహాలు ఏర్పాటయ్యారుు. నూతనంగా ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచస్థారుులో చాటిచెప్పి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని విగ్రహాల విశేషాలు...

పార్లమెంట్‌ను ఇద్దరు అర్కిటెక్‌ నిపుణులు రూపకల్పన చేశారు. సర్‌ ఎడ్విన్‌ లుట్యన్స్‌, సర్‌ హెర్బర్ట్‌ బాకెర్‌లే ప్లానింగ్‌ చేసి నిర్మాణం చేయించారు. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా నిర్మించారు. 18 జనవరి 1927న భవన ప్రారంభం జరిగింది. అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల 83లక్షల రూపాయలు. దీనికి 12 గేట్లు ఏర్పాటు చేశారు. గేట్‌ నెం.1 సన్‌సాద్‌ మార్గ్‌ ప్రధాన ద్వారం. దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పార్లమెంట్‌ ఏర్పాటు చేశారు. జాతి గర్వించదగిన మహానుభావుల విగ్రహాలను పార్లమెంట్‌లో ఏర్పాటు చేశారు. హాల్‌లో, గ్రంథాలయంలో, కోర్డుయార్డులో, బయట కలిపిమొత్తం 49 విగ్రహాలు ఉన్నాయి. కొందరి విగ్రహాలు రెండు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఎన్‌.జి.రంగా, టంగుటూరి ప్రకాశం, ఎన్‌.టి.రామారావుల విగ్రహాలు తెలుగు వారి ఔన్నత్యాన్ని నిదర్శనంగా ఠీవిగా కనిపిస్తాయి

మహాత్మా గాందీ

16 అడుగుల ఎత్తు కాంస్యంతో తయారైంది మహాత్మా గాంధీ విగ్రహం. ఇది సరిగ్గా గేట్‌ నెం.1కి ఎదురుగా ఉంటుంది. ధ్యానంలో ఉన్న జాతి పితగా ఇది కనిపిస్తుంది. రామ్‌ సుతార్‌ అనే శిల్పి అత్యంత నైపుణ్యంతో దీన్ని తయారు చేశారు. 2 అక్టోబర్‌ 1993న నాటి రాష్టప్రతి శంకర్‌ దయాల్‌ శర్మ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విగ్రహాన్ని దానం చేసింది. 1869న జన్మించిన బాపూజీ 1948లో నాధురామ్‌ గాడ్సే చేతితో హత్య చేయబడ్డారు.

బాబూజగ్జీవన్‌రామ్‌

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాను భావుడు. ప్రస్తుత స్పీకర్‌ మీరాకుమార్‌కు తండ్రి. లోక్‌ సభ చాంబర్‌ అవుట్‌ లాబీ వద్ద ఈయన విగ్రహం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తులో రామ్‌ సుతార్‌ అనే శిల్పి దీన్ని తయారు చేశారు. 25 ఆగస్టు 1995న శంకర్‌ దయాల్‌ శర్మ విగ్రహావిష్కరణ చేశారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశ్రమ ట్రస్టు విగ్రహాన్ని పార్లమెంట్‌కు అందజేసింది. 1908లో జన్మించిన జగ్జివన్‌ రామ్‌ 1986లో మృతిచెందారు.

బి.ఆర్‌. అంబేద్కర్‌

పార్లమెంట్‌ బయట ఉన్న ఉద్యానవనంలో 3.66 మీటర్ల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం నిలువెత్తుగా దర్శనమిస్తుంది. దీన్ని కాంస్యంతో తయారు చేశారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ కమిటీ విగ్రహాన్ని దానం చేయగా బి.వి.వాగ్‌ నైపుణ్యంతో తయారు చేశారు. 2 ఏప్రిల్‌ 1967న నాటి రాష్టప్రతి డా.సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్టీ, ఎస్సీ, బిసీల అభివృద్ధికి బాటలు వేసిన జనోద్ధరణ నాయకుడు. 1891లో జన్మించిన అంబేద్కర్‌ 1956లో మృతిచెందారు

ఎన్‌.జి. రంగా

రైతుల ఎన్నో సేవలు చేసిన ప్రొఫెసర్‌ ఎన్‌.జి.రంగా. అందుకే మన రాష్ట్రంలో వ్యవసాయ విశ్వ విద్యాల యానికి ఎన్‌.జి.రంగా పేరు పెట్టుకున్నాం. డి.శంకర్‌ అతని సోదరులు ఈయన విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేసింది. నాటి ఉపరాష్టప్రతి కృష్ణకాంత్‌ 27 జులై 1998న విగ్రహావిష్కరణ చేశారు. 1900 సంవత్సరంలో పుట్టిన ఎన్‌.జి.రంగా 1995లో మృతిచెందారు.

టంగుటూరి ప్రకాశం

డి.శంకర్‌ అతని సోదరులు ఎంతో అద్భుతంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని తయారు చేశారు. ఆంధ్రకేసరిగా గుర్తింపు పొందారు టంగుటూరి. 5 మే 2000న నాటి రాష్టప్రతి కె.ఆర్‌.నారాయణన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని దానం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ‘‘రండి రా.. దమ్ముంటే కాల్చుకోండి అంటూ బ్రిటీష్‌ వారికి గుండెను చూపిన ఆంధ్రుడు’’. 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం 1957లో మరణించారు.

జయప్రకాశ్‌ నారాయన్‌

జె.పి.విచార్‌ మంచ్‌ విగ్రహాన్ని దానం చేయగా కె.ఆర్‌.నారాయణన్‌ 3 జులై 2002 ఆవిష్కరణ చేశారు. భారత స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్‌ నారాయణ్‌ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్‌నాయక్‌ అని సగౌరవంగా పిలుచుకుంటారు. జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్‌ నారాయణ్‌ 1902 జన్మించి 1979లో మృతిచెందారు.

జ్యోతిరావు ఫూలే

గేట్‌ నెం.3 వద్ద గల ఉద్యానవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని దానం చేయగా 3 డిసెంబర్‌ 2003న నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆవిష్కరణ చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన నాయకుడు. 12 అడుగుల ఎత్తులో కాంస్యంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

  • ఎన్‌.టి. రామారావు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసిన ధీరుడిగా ఎన్‌.టి.రామారావు ప్రసిద్ధి గాంచారు. పదేళ్లుగా ఈయన విగ్రహం పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని కుటుంబీకులు పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఎన్‌టిఆర్‌ కూతురు, కేంద్ర మంత్రి పురందేశ్వరీ విగ్రహాన్ని దానం చేయడంతో మార్గం సుగమమం అయింది. 7 మే 2013న అంగరంగ వైభవంగా కుటుంబీకులంతా తరలిరాగా స్పీకర్‌ మీరాకుమర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • ================================= 
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, May 19, 2013

Anoushka shankar ,అనౌష్క శంకర్‌





మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Anoushka shankar ,అనౌష్క శంకర్‌ -- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ప్రపంచ ప్రఖ్యాత సితార్‌ కళాకారుడు పండిత్‌ రవి శంకర్‌ కుమార్తె అనౌష్క శంకర్‌. అనౌష్క శంకర్‌ సైతం సితార్‌ ప్లేయర్‌గా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.

గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్‌ 1981 జూన్‌ 9న జన్మించారు. ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జన్మించారు. ఆమె లండన్‌లో జన్మిం చగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడి చింది. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ వాయించడాన్ని నేర్చుకు న్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్‌ షోలను నిర్వహిం చడం విశేషం.

ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. 1998లో విడుదలైన తన మొదటి మ్యూ జిక్‌ ఆల్బమ్‌ అనౌష్కతో ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించారు. అనంతరం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో కోల్‌కతాలోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు. నేడు సంగీత ప్రపంచంలో సితార్‌ వాయిద్యకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనౌష్క. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చు కొని సంగీతకారిణిగా పేరుతెచ్చుకున్నారు.

పాప్‌ మ్యూజిక్‌తో ఒకప్పుడు యూత్‌ను ఉర్రూతలూగించారు సై్పస్‌ గర్ల్‌‌స. అనంతరం కొంతకాలానికి విడిపోయిన ఈ గర్ల్‌‌స బ్యాండ్‌ తన సాంగ్స్‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేసిన కొందరు ప్రముఖులతో కలిసి ప్రఖ్యాత సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేస్తుండడం విశేషం. ఆసియా ఖండంలోని ఇండియాతో పాటు చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను వారు ఎంపికచేయనున్నారు. ఇక ఇండియా నుంచి టాలెంట్‌ ఉన్న పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేసే బాధ్యతను అనౌష్క శంకర్‌కు చెందిన సంస్థ ఆల్‌కెమిస్ట్‌ టాలెంట్‌ సొల్యూషన్‌ తీసుకుంది.

16 సంవత్స రాల నుంచి తాను సితార్‌ ఆర్టిస్ట్‌గా దేశ, విదేశాల్లో సంగీత ప్రదర్శనలిస్తున్నాననీ కానీ తనకు ఎక్కడా పాప్‌ మ్యూజిక్‌ రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న ఇండియన్‌ గర్ల్‌ కనిపించలేంచలేదని అనౌష్క అన్నారు. దీంతో తాను కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటు చేస్తున్న పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ ఏర్పాటులో భాగంగా ఇండియా నుంచి పాపులర్‌ సింగర్‌ను తాను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. ఈ బ్యాండ్‌లో సింగర్‌గా ఇండియన్‌ గర్ల్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇండియన్‌ ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు.

దేశం గర్వించదగ్గ సితార్‌ విద్వాంసుడు మా నాన్న. అయినా నాకూ వేధింపులు తప్పలేదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యాను. ఎవరికి చెప్పాలో, ఎలా వాటిని ఎదుర్కోవాలో తెలియక మౌనంగా భరించాను. మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దమనిషే అలా చేసేవాడు' అని పండిట్‌ రవిశంకర్‌ కూతురు, సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ చెప్పింది. ప్రేమికుల రోజున మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'వన్‌ బిలియన్‌ రైసింగ్‌' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 'ఒకటి, రెండుసార్లు కాదు, ఏళ్ల తరబడి ఆ వేధింపులు కొనసాగాయి. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయం కలిగేది. బాగా తెలిసిన వాళ్లను కూడా నమ్మలేకపోయేదాన్ని. ఎన్నో ఏళ్లు గడిచినా చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా నన్ను వదల్లేదు' అని చెప్పుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటోన్న అనౌష్క ఢిల్లీలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్య పరుస్తోంది. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది.



  •  ================================

Visit my website - > Dr.seshagirirao.com/ 

Thursday, April 4, 2013

Sister Niveditha,సిస్టర్ నివేదిత



  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Sister Niveditha,సిస్టర్ నివేదిత-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....





మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందుమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఐస్‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌.నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్పూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు(1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 113 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరిం చారు. ఇతరులపై దయ గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతం లోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జగదీష్‌చంద్రబోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు.1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారతస్వాతంత్య్రపోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికధైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్‌లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలు స్థాపించబడ్డాయి.

చివరి రోజుల్లో :
ఆమెను కడుపులో మోస్తుండా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం , తృప్తి తో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని ,తన తండ్రి ,తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయం లో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్ కి  పెద్ద షాక్ తగిలింది .
టీచర్ గా పనిచేస్తూ  తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరం గా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యిం హరించని , ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయం లో మార్గరెట్ కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబందించిన పుస్తకం ఇచ్చారు . అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.

అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారత దేశము వెళుతూ లండన్‌ లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామక్రిష్ణామిషన్‌ లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ''సిస్టర్ నివేదిత'' గా  వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది . కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది.ఆ రోజుల్లో వైద్యవిధానాలు , చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణము గా తన అనారొగ్యానికి కారణం తెలియ పర్చలేదు.  నా జీవితం మరో రెండేళ్ళు మించి లేదేమో అంటూ 1908 లొ ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది. ఏ స్నేహితురాలకైతే ఉత్తతం రాసిందో ఆమె మరణానికి దగ్గరగా ఉందని , తనను చూడాలనుకుంటుందని తెలిసి ఆరోగ్యము అంత బాగులేదని తెలిసికూడా బోస్టన్‌ వెళ్ళింది. దురదుస్టవశాత్తూ ఆ స్నేహితురాలి కూతురు నివేదిత మీద ఫిర్యాదుచేసింది. తమ తల్లిని మభ్యపెట్టి ఆస్తిని భారతదేశము తీసుకువెళ్తుందని ఫిర్యాదు. అలాంటి అవమారము తనకు జరుగుతుందని భావించని సిస్టర్ నివేదిత స్నేహితురాలి మరణం తర్వాత ఏప్రిల్ 11 , 1911 న తిరిగి భారతదేశము వచ్చింది. జీవితము లో నిరాశచెందిన ఆమె మనశ్శాంతి కోసము శాంతిదేశమైన భారత్ లోనే మనగలిగింది. దసరా సెలవులలో ఆమె మనసుకు విశ్రాంతి అవసరమని ప్రశాంతవాతావరణం కోసము మిత్రుది కుటుంబం తో కలిసి డార్జిలింగ్ వెళ్ళి రక్తవిరేచనాలు పట్టున్నందున వైద్యము ఇప్పించినా ఆమె శరీరము స్పందించలేదు . చివరిదశలో అనేకరకాల ఆద్యాత్మిక వాక్యాలు సిస్టర్ నివేదిత తన పుస్తకాలలో రాసుకున్నారు. ఆరోగ్యము మరింత క్షీణించడం తో 13 అక్టోబర్ 1911 న 2.30 గంటలకు తెల్లవారు జామున భగవంతునిలో లీనమైనది.

Source : Courtesy with Swathi Telugu weekly magazine and others.
  • ========================
Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, March 14, 2013

Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

             
సామ్యవాద స్వాప్నికుడు!నిర్భీతికి, నిజాయితీకి చిరునామా గామారి సమాజ శ్రేయస్సుకై తుది శ్వాస దాకా పరితపించిన విలక్షణ రాజకీయవేత్త రామ్‌మనోహర్ లోహియా. స్వాతంత్య్ర సంగ్రామం లో అతి కీలకఘట్టమైన క్విట్ ఇండి యా ఉద్యమంలో ఉద్ధండులైన నేతలందరూ నిర్భంధానికి గురైన సందర్భంలో, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వంటి నాయకులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేయడంలో లోహియా నిర్వహించిన పాత్ర అనన్యం. 1910 మార్చి 23న ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్‌లో సంపన్నుల ఇంట జన్మించిన లోహియా ఆడంబరాలకు దూరంగా జీవించారు. కష్టపడటంలోనే తృప్తి ఉందన్నది లోహియా సిద్ధాం తం. బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినప్పుడు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ అనుచరుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నప్పటికీ భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి విప్లవవాదుల ప్రభావం లోహియాపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వస్తేచాలన్న పరిమిత లక్ష్యానికి లోహియా ఎన్నడూ లోనుకాలేదు.

ప్రపంచ దేశాల్లోని అన్ని జాతుల విముక్తితోపాటు వర్ణ వివక్ష పూర్తిగా రూపుమాసినప్పుడే, మానవాళి సంపూర్ణంగా వికసించడం సాధ్యమని నమ్మిన క్రాంతదర్శి. స్వాతంత్య్రానంతర భారతదేశాన్ని గురించి లోహియా ఎన్నో కలలుకన్నాడు. దేశ భవి ష్యత్తుకూ, దారిద్య్ర నిర్మూలనకూ ‘ప్రజాస్వామిక సామ్యవాద’ సాధనే మార్గమని భావించిన నేత లోహియా. గాంధీ, మార్క్స్‌లను ఎంతగా అభిమానించినప్పటికీ, వారి సిద్ధాంతాలను మాత్రం లోహియా యథాతథంగా అంగీకరించకపోవడం గమనార్హం. ‘గాంధీ-మార్క్స్ అండ్ సోషలిజం’ అన్న తన ప్రసిద్ధ గ్రంథంలో, తన భావాన్ని మరింత లోతుగా వివరిం చారు. భారత రాజకీయాల్లో ‘తృతీయశక్తి’ అన్న భావనకు, ఆచరణ రూపాన్ని కల్పిం చిన ఘనత లోహియాకే సొంతం.

దేశంలో సోషలిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించడమే కాక, అంటరానితనానికి, కులవివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారు. స్వదేశీ సంస్థానాల విలీనం, గోవా విమోచనోద్యమంలో లోహియా నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది. ఆంగ్ల భాషా వ్యతిరేకోద్యమం సహా నేపాల్ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంలో లోహియా గణనీయమైన కృషిని సాగించారు. రాజకీయ జీవితాచరణలో విలువలకు పట్టంగట్టిన రామ్‌మనోహర్ లోహియా 1967 అక్టోబర్ 12న ఢిల్లీలోని విల్లింగ్టన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం, ఆ ఆసుపత్రి పేరును ‘డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రి’గా నామకరణం చేశారు. మరణానికి ముందు తన చుట్టూ గుమిగూడిన వైద్యులను ఉద్దేశించి లోహియా అన్న మాటలు మరువలేనివి-‘‘ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు డాక్టర్ల రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటిది, నా కోసం ఇంత మంది డాక్టర్లా!’’ అంటూ కన్నీరు కార్చడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టడమే కకా, నేటికీ మన పాలకులకు అదొక హెచ్చరికగా మిగిలిపోయింది.

లెక్కల వెంకటరెడ్డి లెక్కలవారి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా-(నేడు రామ్‌మనోహర్ లోహియా 45వ వర్థంతి)@ http://www.sakshi.com/
  • ========================= 
Visit my website - > Dr.seshagirirao.com/

Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు


  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
             
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణాజిల్లా ఒక్కనూరు గ్రామం లో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్రమహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహిం చిన భూమిక ఎన్నదగినది.

పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాల యం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.
వంకాయలపాటి రవి కూకట్‌పల్లి, హైదరాబాద్

(నేడు ‘ఆంధ్రపితామహ’ మాడపాటి 42వ వర్ధంతి)- @ http://www.sakshi.com/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

Jhulkaribhai,ఝల్కారిబాయి

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jhulkaribhai,ఝల్కారిబాయి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


నిష్పాక్షిక దృష్టితో చరిత్రను తరచి చూస్తే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నిష్టుర సత్యాలు వెలుగు చూస్తాయన్నది అక్షరసత్యం. చరిత్రకారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రాక అలా మరుగునపడ్డ ఝల్కారిబాయి జీవిత చరిత్ర ఎంత విలక్షణమైనదో అంత అపురూపమైనది. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారిబాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మిం చిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

--బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(నేడు ఝల్కారిబాయి 182వ జయంతి)@http://www.sakshi.com/main/
  • =====================
Visit my website - > Dr.seshagirirao.com/

Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.

-దొమ్మాట వెంకటేశ్ హైదరాబాద్-(నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పదవ వర్థంతి) @http://www.sakshi.com/

=========================
Visit my website - > Dr.seshagirirao.com/

Periyar,పెరియార్

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Periyar,పెరియార్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

             
దేశంలో అంటరానితనం, కులవివక్ష లకు వ్యతిరేకంగా బహుజనులను ఉద్య మబాట పట్టించిన నిత్య చైతన్యమూర్తి పెరియార్. దేశంలో మనువాదుల వికృ తాలకు వ్యతిరేకంగా పెరియార్ సాంఘి క విప్లవోద్యమానికి నాంది పలికారు. గృహహింసను అరికట్టేందుకు మహిళలతో కలిసి మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి వారితోపాటు జైలుకు వెళ్లారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ సమసమాజం స్థాపన లక్ష్యంగా అహరహం పోరాడిన సంఘ సంస్కర్త పెరియార్. హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా నవదంపతులతో బహిరంగ ప్రమాణాల ద్వారా వివాహాలు చేయించిన స్త్రీ విముక్తి ప్రదాత.

పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించాడు. ఆయన పేరు ఈ.వి.రామస్వామి నాయకర్. ‘పెరియార్’ బిరుదును 1938 సంవత్సరంలో మహిళలు ఆయనకు ప్రదానం చేశారు. పెరియార్ అనగా ‘మహానుభావుడు’. సమాజంలో చోటుచేసుకున్న దుష్ట సంప్రదాయాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 1925లో ‘స్వయం గౌరవం’ పేరుతో సాంస్కృతిక, సామాజిక విప్లవాన్ని ప్రారంభించి పెరియార్ నవసమాజా నికి దారులు వేశారు. పురుషుని స్వాధీనంలో ఉన్న వస్తుసంపద, వనరులు, ఆస్తులు స్త్రీలను కట్టు బానిసలుగా మార్చిన తీరును చారిత్రక దృష్టి కోణం నుంచి అవగాహన చేసుకున్న తొలి స్త్రీవాది పెరియార్. బలహీన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేత కమ్యూనల్ జీవో 1926ను జారీ చేయించి, అమలు చేయించిన సామాజిక న్యాయ కోవిదుడు. అడుగంటిపోతున్న ‘ద్రవిడ సంస్కృతి’ని పరిరక్షించేందుకు దక్షిణ భారతాన్ని ‘ద్రవిడనాడు’గా ప్రకటించాలని ఎలుగెత్తి చాటిన ఆత్మగౌరవ పతాక!

రాజకీయ రంగంలో అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం ఫలప్రదమవుతుందని నాడే చాటి చెప్పిన పెరియార్ మార్గం విలక్షణమైనది. 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెరియార్ బహుజనుల పట్ల ఆ పార్టీ ప్రదర్శిస్తున్న వివక్షను ప్రశ్నిస్తూ, అందుకు నిరసనగా 1925లో రాజీనామా చేశారు. బహుజ నుల సమస్యలపై గాంధీ వంటి నాయకులు ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా వారితో చర్చలకు, సంవాదాలకూ ఆయన ఏ మాత్రం వెనుకాడలేదు. పెరియార్ 1939లో ‘జస్టిస్ పార్టీ’లో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ‘ద్రవిడ కజగమ్’ నెలకొల్పి అన్నా దురైతో కలిసి పనిచేశారు. ‘నవయుగ ప్రవక్తగా’, ‘ఆసియా సోక్రటిస్’గా యునెస్కో 1970లో పెరియార్‌ను గౌరవించింది. దాక్షిణాత్యుల ఆభిజాత్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శ నంగా నిలిచిన పోరాటయోధుడు పెరియార్. 1973, డిసెంబర్ 24న పెరియార్ తుదిశ్వాస విడిచారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు జనాభా దామాషా ప్రాతిపదిక కావాలని పెరియార్ ప్రవచించిన ప్రజాస్వామ్య సూత్రం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేయాల్సిన కర్తవ్యం నేటి బహుజనులపై ఉంది.

బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(రేపు పెరియార్ 39వ వర్ధంతి)-@http://www.sakshi.com/main/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

Monday, March 11, 2013

Savitri Jindal,సావిత్రీ జిందాల్

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Savitri Jindal,సావిత్రీ జిందాల్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



 ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె. అంతేకాదు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆ మహిళ పద్మశ్రీ సావిత్రీ జిందాల్‌. తన గురించి తాను ఏం చెబుతున్నారంటే...

హర్యానాలోని హిసార్‌ మా స్వస్థలం. 1970లో ఒ.పి.జిందాల్‌తో నా పెళ్లి జరిగింది. అప్పటి నుంచీ కుటుంబమే నా ప్రపంచంగా మారిపోయింది. భార్యగా, తల్లిగా ఎంతో సంతోషంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. నలుగురు అబ్బాయిలూ, అయిదుగురు అమ్మాయిలను పెంచి పెద్దచేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బయటి విషయాలూ, వ్యాపార లావాదేవీలన్నీ ఆయనే చూసుకునేవారు. పిల్లలూ, ఇంటికి వచ్చిపోయే బంధువులూ... ఇదే నా లోకం. 2005లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన మరణించేంతవరకూ మాకున్న ఆస్తిపాస్తులు ఏమిటో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన తదనంతరం ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో వ్యాపార లావాదేవీలకు నేను పూర్తిగా కొత్త కావడంతో మా నలుగురు అబ్బాయిలు పృథ్విరాజ్‌, సజ్జన్‌, రతన్‌, నవీన్‌లే అన్ని విషయాలూ చూసుకునేవారు. నేను బోర్డు మీటింగులకూ, వాటిలో తీసుకునే నిర్ణయాలకూ చాలా దూరంగా ఉండేదాన్ని. వూపిరి సలపని వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండటానికి రాజకీయాల నెపంతో మూడు రోజులు
హిసార్‌ నియోజకవర్గంలో గడిపేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఒకప్పుడు అంత టెన్షన్‌ పడ్డానా అని నాకే నవ్వొస్తుంటుంది. ఇప్పుడు నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. బోర్డు మీటింగుల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాను.

* ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. వివిధ వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలనూ నియంత్రించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు వ్యాపార రంగానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మనదేశంలో ప్రముఖ వ్యాపారాలన్నీ కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యాయి.

అలాకాకుండా వ్యాపారం చేయాలనుకునే ఉత్సాహవంతులకు ప్రోత్సాహకర పరిస్థితులు కల్పించాలి. అప్పుడు స్వయం ఉపాధికి అవకాశాలూ పెరుగుతాయి.

* విద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో మా సంస్థలు ఎంతోకాలంగా సేవలందిస్తున్నాయి. 2007లో ఒ.పి.జిందాల్‌ కమ్యూనిటీ కాలేజీని స్థాపించాం. దీంట్లో వృత్తి

విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తాం. ఒకవ్యక్తి సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించడానికి కావాల్సిన శిక్షణంతా ఇక్కడ లభిస్తుంది. ప్రతిభ కనబరిచినవారికి స్కాలర్‌షిప్‌ సౌకర్యమూ ఉంది.

* సుమారు యాభైమూడు వేలకోట్ల రూపాయల సంపదతో దేశంలోని సంపన్నుల్లో ఏడో స్థానం పొందాను. ప్రపంచ సంపన్నుల్లో యాభైఆరో స్థానం సాధించడం, ఇంకా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా ఎంపిక కావడమూ సంతోషంగానే ఉంది. అయితే, ఇవేమీ నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నిరాడంబరంగా జీవించడానికే ఇష్టపడతాను. నేను పగ్గాలు
చేపట్టిన తర్వాత సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగిందని మాత్రం కాస్త గర్వంగానే చెప్పగలను.

* ఒ.పి. జిందాల్‌ గ్రూప్‌ సంస్థ 1952లో ప్రారంభమైంది. అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో ప్రపంచంలోనే ఇది మూడోది. దీంట్లో స్టీల్‌, పవర్‌, మైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌కు సంబంధించిన నాలుగు విభాగాలున్నాయి. నలుగురు అబ్బాయిలూ ఒక్కొక్కరూ ఒక్కో విభాగ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఎవరికి ఏ సమస్య వచ్చినా నలుగురూ ఒకచోట కూర్చుని జాగ్రత్తగా చర్చించిమరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా  తామంతా అన్నదమ్ములమేనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఇదంతా తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణే. నా పిల్లలకు కుటుంబ వారసత్వంగా ఆస్తిపాస్తులే కాదు, నీతి నిజాయతీలూ, కష్టపడేతత్వం, చక్కటి వ్యక్తిత్వం కూడా వచ్చాయి.

* బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. మా ఉద్యోగులను కేవలం ఉద్యోగుల్లా చూడను, కుటుంబ సభ్యుల్లానే చూస్తాను. వారి సమస్యలను శ్రద్ధగా వింటాను. 'కుటుంబం అంటే నువ్వూ, నేనూ, పిల్లలు మాత్రమేకాదు, మన ఉద్యోగులు కూడా' అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను.

* నేటి మహిళా వ్యాపారవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి పనిచేయండి. శ్రమజీవికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో గట్టి పోటీ ఎదురైనా, అవరోధాలు కలిగినా బెదిరిపోకండి. వ్యాపార ప్రపంచంలో అవన్నీ సహజం. ధైర్యంగా ముందడుగు వేస్తే ఫలితం ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటుంది.

*అభిరుచుల విషయానికి వస్తే... సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొంటాను. ఏకాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతాను, పిల్లలకు కమ్మగా వండిపెడతాను.
  •  =========================
Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, February 21, 2013

I.K.Gujral ,భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --I.K.Gujral ,భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

 భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌(93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా భాద్యతలు నిర్వహించారు.గుజ్రాల్‌ సతీమణి షీలా గుజ్రాల్‌ పంజాబీ, హిందీ, ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీశ్‌ గుజ్రాల్‌ ప్రముఖ చిత్రకారుడు.

1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్‌కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా వున్నారు. అనంతరం కొంతకాలం సోవియట్‌యూనియన్‌లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు.వీపీసింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 1989లో వీపీ సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవెగౌడ సారధ్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్‌ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.

for more details : I.K.Gujral
  • ===============================
 Visit my website - > Dr.seshagirirao.com/

Monday, February 18, 2013

P.T.usha,పి.టి.ఉష

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -P.T.usha,పి.టి.ఉష- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ఈమె పూర్తిపేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్‌ ఉష. ఈమె 1964 మే 20న పుట్టింది. మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించి, పరుగుల రాణిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఈమెను అందరూ ముద్దుగా పయోలి ఎక్స్‌ప్రెస్‌ అని పిలుస్తుంటారు. ఇక ఈమె విజయ పరంపరలో 1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజితం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెప్పింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా 2 రజిత పతకాలు సొంతం చేసుకుంది. అదేవిధంగా 1990 ఆసియాడ్‌లో 3, 1994లో ఒకటి రజితాలు గెలుచుకుంది. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతటి ఖ్యాతిని భారతదేశానికి అందించినందుకు ఈమెను 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది.

ఇటువంటి మహాన్నత విలువలున్న మన మహిళలు తాజాగా ట్రస్‌ రీసెర్చ్‌ అడ్వయిజరీ వారి పరిశోధనల్లో కూడా భారత దేశపు అత్యంత నమ్మకమైన మహిళా మణులుగా ఎంపికై రికార్డ్‌ని మరొకమారు తిరగ రాసారని చెప్పవచ్చు.

For more details : see wikipedia.org - P.T.Usha
  • =========================
 Visit my website - > Dr.seshagirirao.com/

Tuesday, January 22, 2013

మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

1980 జూలై 31 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో జన్మించిన మున్షి ప్రేమ్ చంద్  భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.

మున్షీ ప్రేంచంద్‌ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాంఘీక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహరచయిత ఉర్దూలో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీ యుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. ఈ మధ్య అలాంటి కథ చాలా రోజుల తరువాత మళ్లీ చదివాను. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్‌ కథ ‘ఈద్‌ పండుగ’. ఈ కథ చదివిన వ్యక్తుల కళ్లు కూడా ఆ కథలోని హమీద్‌ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి.  అలాంటి కథే ‘ఈద్‌ పండుగ’ మన మనస్సులని కదిలించే కథ. మన భావోద్వేగాలకి చలనం ఇచ్చే కథ. ప్రేంచంద్‌ రాసిన కథ ల్లో చాలా గొప్ప కథ ‘ఈద్‌ పండుగ’ ఈ కథ ఈద్గా (మసీదు) పేరు తో అనువాదం అయ్యింది.



ప్రేమ్‌చంద్ 1880, జూలై 31న వారణాసి దగ్గర కాశికి నాలుగు మైళ్ళ దూరములో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్ మరియు ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ''ధన్‌పత్ రాయ్'' అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, ఇతనిని 'నవాబ్' అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు. ప్రేమ్‌చంద్ తల్లితండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో  సవతి తల్లి మరియు ఆమె పిల్లల బాధ్యత  ప్రేమ్ చంద్  పై పడింది. వారి కుటుంబము లో ఆరోగ్యము అంతంతమాత్రమే . అనారోగ్యము వారసత్వమూగా అందుకున్నాడు ప్రేమంచంద్ . ఆరోగ్యము సహకరించక , ఉద్యోగములో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగము మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డాడు .

ప్రేంచంద్ కి బాల్యములోనే వివాహమైంది. కాని అది బలవంతపు వివాహము , అయిష్ట వివాహము  అనేవారు. పెద్దలు చేసిన పెళ్ళిని ఆయన అంగీకరించలేదు. ఆమె తో సంసారము చెయ్యలేదు.  ఈ లోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు . బాల్యములోనే వివాహవైధవ్యము సంభవించిన 11 యేళ్ళ బాలికను వివాహమాడేందుకు అభ్యుదయభావావు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన . అది చూసి ప్రేంచంద్ స్పందించాడు . తాను చేసుకుంటానని ముందుకు వెళ్ళాడు .. ఆ విధము గా " శివరాణీదేవి " ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు . తనకు ఇంతకుముందు పెళ్ళి అయిన విషయము చెప్పలేదు. సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నము చేశాడు . విద్యాశాఖలో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది . 1920 లో వచ్చిన సహాయనిరాకరణ ఉద్యమం లో గోరఖ్ పూర్ లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై  ప్రభుత్వ ఉద్యోగము వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకొని , పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. 250 కధలు , 12 నవలలు రచించాడు .

సమాజములోని లోటుపాట్లను , స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను , మూఢనమ్మకాలను  నిరసిస్తూ రచనలు చేశాడు . మంచి పేరు ప్రతిస్టలు సంపాదించాడు . రెండవ భార్యకు తన మొదటి వివాహము  గురించి తెలిసింది. ఆ విషయము మీద ఇద్దరూ వాదులాడుకున్నారు . వారి సంసారములో వాదులాటలు సామాన్యము అయినా వారిద్దరి మధ్యా ప్రేమ , అనురాగము అధికము .  ప్రేంచందను వదిలి శివరాణీదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణము ఇష్టపడేదికాదు . ప్రేంచంద్ కూడా అంతే. ఏ మాత్రము నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకొని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెపుతుండేవారు.  భర్తకున్న అనారోగ్య సమస్యలు , జీర్ణకోశ సమస్యలు ఆమెకు ఆందోళన కలిగిస్తూఉండేవి . ఎంతో శ్రద్ద తీసుకొని చూసుకుంటూ తన సాహిత్యసేవా , పత్రిక సేవా నడపడము లో సహకరిస్తూ ఉండేవారు.

ప్రేమ్‌చంద్ 1935 లో జ్వరము బాధపడుతూ పత్రికకు సంపాదకీయము రాయడము మొదలు పెట్టగానే భార్య అభ్యంతరము పెట్టింది. అందుకు ఆయన " రాణీ నువ్వు పొరపడుతున్నావు . నేను నాకు నచ్చిన పని చేయుచున్నాను . ఇందులో నాకు ఆనందము దొరుకుతుంది. ఇది ఒకరకమైన మత్తును కలిగిస్తుంది. కాని ఇది చెడుపని కాదు. నేను దీపం వంటి  వాడిని ... వెలుతురును ఇస్తాను , ఆ వెలుతురు ఇతరులు లాభానికి వాడుకుంటారో , నష్టపోతారో నాకు సంబంధము  లేదు . " అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు . నాటి నుండి ఆయన ఆరోగ్యము తగ్గడము మొదలు పెట్టింది.

1936 లో ' గోదాన్‌ ' అచ్చు అయింది. మంగళసూత్రమనే మరో నవలను ఆలోచిస్తున్నారు. కాని ఆరోగ్యము సహకరించలేదు . తన ఆరోగ్యము వలన భార్య బాధపడుతుందని ఆయనకు దిగులు. రక్తపు వాంతులు అయ్యాయి . ఆమె సుభ్రము చేసింది. పక్కన వచ్చికూర్చుని నుదుటిమీద చెయ్యివేసి ఉంచమని భార్యను  కోరాడు . ఆమె కంటనీరుతో అలాగే కూర్చుంది. నీకు తెలియకుండా దాచిన రహస్యాలను చెబుతాను విను.  " నా మొదటి వివాహం తర్వాత మరో స్త్రీ నా జీవితం లోకి ప్రవేశించింది. నిన్ను పెళ్ళిచేసుకున్నాక కూడా ఆమెతో నా సంబంధం కొనసాగింది. అలాగే నీకు చెప్పకుండా కొందరికి డబ్బులు ఇచ్చి , ఆ అప్పు ను తీర్చేందుకు  కధలు రాసేవాడిని " ఇలా తాను చేసిన తప్పులను ఒప్పుకోవడము మొదలు పెట్టాడు .  నిజానికి అవన్నీ భార్యకు తెలుసు . అయినా ఆయన కోసము వాటిని తెలియనట్టుగానే ఉంది.  ఆ విషయము ప్రేంచంద్ కి అర్ధమయ్యేసరికి భార్య శివరాణీదేవి మీద గౌరవం , ప్రేమ పెరిగిపోయింది.

అన్నీ తెలిసి నన్ను నిలదీయని నీ హృదయం ఎంత ఉన్నతమైనదో ఈ రోజు గ్రహించాను . నాకిప్పుడు ఎక్కువ కాలము బ్రతకాలని ఉంది నాకోసము కాదు ... నా భార్యకోసము ... ఆమె మహాత్యాగి . ఆమె తో కలిసి మరికొంతకాలము ఉండాలనివుంది. నన్ను బ్రతికించు . వచ్చే జన్మలో కూడా ఈమెనే నా అర్ధాంగిగా చెయ్యి ... కనీసము నా ఈ చివరి ప్రార్ధనన్నా ఆలకించు ... అని తనలోతాను సణుగుతున్నారు. మనము ఎవరికీ ఏ అపకారము  చెయ్యలేదు . భగవంతుడు మన మొర తప్పక ఆలకిస్తాడు . రాణీ ,, నువ్వు నాపక్కనే ఉండు . ఎక్కడికీ వెళ్ళకు . నువ్వు ఉంటే నాకు ధైర్యము గా ఉంటుంది . నీకు చెప్పాలకున్న విషయాలు పూర్తిగా చెప్పగలుగుతాను.  ఇది జరిగిన రెండవరోజూ అంటే ... అక్టోబర్ -08 -1936 న విరోచనమైంది. రాణి శుభ్రం చేద్దామనుకుంటుండగానే ఆయన శరీరము చల్లబడింది. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 56 సంవత్సరాలకే ఆ మహా రచయిత జీవితం అంతమైంది.

మూలము : చివరి రోజుల్లో@స్వాతి వారపత్రిక .... 11-1-2013



===========================
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, January 20, 2013

Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ

  •  

  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా నిష్క్రమించనున్నారు. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో టాటా గ్రూపును స్థాపించారు. యాభై ఏళ్లు సంస్థకు సేవలందించిన మాజీ ఛైర్మన్ రతన్ టాటా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది.

ఇదిలావుండగా, షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ.. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి చివరికి మిస్త్రీని ఎంపిక చేసిన విషయం తెల్సిందే. టాటా గ్రూప్ 6వ చైర్మన్‌ గా 28 డిసెంబర్ 2012 నుండి బాధ్యతలు చేపట్టారు .

పుట్టిన తేదీ : 04 జూలై 1968,
తల్లిదండ్రులు : పల్లోంజీ మిస్త్రీ : patsy perin Dubash ,
చదువు : B.E civil engineer with MBA from London Business School.
నేషనాలిటీ : ఐరిష్ ,
మతము : జోరాస్ట్ర్రియానిజం ,
భార్య : రోహిక మిస్త్రీ(Rohiqa chagla Mistry),
పిల్లలు : ఇద్దరు .
తోబుట్టువులు : ఒక అన్నయ్య : షపూర్ మిస్త్రీ , ఇద్దరు సిస్టర్స్ =లైలా మరియు అలూ ,

టాటా సంస్థలు : భారతదేశపు తొలి బహుళజాతి సంస్థ " టాటా" సంస్థలు . 20 వ శతాబ్దపు తొలి సంవత్సరాలలోనే వ్యాపార కార్యాలయం  కలిగిన సంస్థ టాటా సన్స్ . భారతదేశము బానిసపాలనలో  ఉన్న కాలములో జాతీయ భావాలు కలిగిన ఒక పార్శీ - జంషెడ్జీ టాటా ఈ సంస్థ ను నెలకొలిపారు. ప్రపంచములొ పలుదేశాలలో పరిశ్రమలు , పెట్టుబడులు కలిగిన టాటా లు ప్రవేశించని పరిశ్రమలేదు. ఉప్పునుండి సాప్ట్ వేర్ వరకు ప్రతి రంగములో వారి ఉత్పత్తులు ఉన్నాయి. టాటా స్టీల్ , టాటా లారీలు ,టాటా కార్లు , టాటా టీ , టాటా కెమికల్స్ , టాటా టెలికమ్యూనిమేషన్‌ ... ఇలా వారి ఉత్పత్తులు భారతీయలందరి జీవితాలను తాకేవే . నాన్యత విషయములో రాజీ పడని కంపెనీగా , నిజాయితీ విషయ్ము లో చాలా పారిశ్రామిక సంస్థలకన్నా మెరుగైనదిగా  టాటా లకు గుర్తింపు ఉంది. ఈ సంస్థల ఆధాయము సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా . 80 దేశాలకు పైగా వీరి పెట్టుబడులు , పరిశ్రమలు కలిగి ఉన్నాయి.

52 ఏళ్ళపాటు చైర్మన్‌ గా వ్యవహరించిన జె.ఆర్.డి.టాటా నుండి వారసత్వముగా చైర్మన్‌ పదవిని 1991 లో రతన్‌ టాటా అందుకున్నారు. సుమారు 20 ఏళ్ళ పైబడి ఆయన ఆ పదవిలో ఉన్నారు. రతన్‌ టాటా అవివాహితుడైనందున తన 75 వ ఏట తన వారసుడుగా ఎంఫిక 5 గురు సభ్యులున్న కమిటీకి అప్పగించి ... అలా ఎన్నికైన వారే ఈ సైరస్ మిస్త్రీ.

టాటా గ్రూప్ చైర్మన్ జాబితా-List of Tata Group Chairmen

  1.    జమ్సేట్జి టాటా- Jamsetji Tata (1887–1904)
  2.    దొరబ్జి టాటా-Dorabji Tata (1904–1932)
  3.   నౌరోజీ శక్లత్వల- Nowroji Saklatwala (1932–1938)
  4.   జె.ఆర్ డి టాటా J. R. D. Tata (1938–1991)
  5.   రతన్ టాటా- Ratan Tata (1991–2012)  
  6. సైరస్ మిస్త్రీ -Cyrus Mistry (2012–present)

  •  ============================ 
Visit my website - > Dr.seshagirirao.com/