Monday, November 14, 2011

డా. రాజేంద్ర ప్రసాద్ ,Dr. Rajendra Prasad



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ ----------- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



రాజేంద్ర ప్రసాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి (Constituent Assembly) అధ్యక్షత వహించాడు. భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో కొద్ది కాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఒక ముఖ్య నాయకుడుకూడా. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు.

For full details : see Telugu Wikipedia.org- Rajendraprasad

  • ========================================


Visit my website - > Dr.seshagirirao.com/

Wednesday, October 5, 2011

కమలా నెహ్రూ , Kamala Nehru



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -కమలా నెహ్రూ , Kamala Nehru- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


పాత డిల్లీ లోని కాశ్మీరీ బ్రాహ్మిణ్ కుటుంబములో 01 ఆగస్ట్ 1899 సంవత్సరములో " రాజ్ పతి , జవహర్మాల్ కౌల్ దంపతులకు జన్మించారు .ఈమె తోడ ఇద్దరు తమ్ముళ్లు ..చాంద్ భహదూర్ కౌల్ , కైలాష నాథ్ కౌల్ , ఒక చెల్లెలు ..స్వరూప్ కథ్జు . 14 -11 - 1889 తేదిన పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ గారి తో వివాహం 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న "కమలా నెహ్రూ" వివాహమయ్యింది. కమలా నెహ్రూ మామగారు -మోతీలాల్ నెహ్రూ. అత్తగారు -శ్రీమతి స్వరూప రాణి. ఇంటి పట్టునే ఉండే కమలానెహ్రూ 1921 లొ non-coperation movement లో వుమెన్‌ గ్రూప్ కి నాయకత్వము వహించి విదేసీ వస్తువులు దుస్తులు , మద్యము అమ్మకాలు చేయకూడదనే నినాదముతో ముందుకు సాగారు . రెండుసార్లు అరెస్ట్ అయ్యారు .

నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్థినంతా దారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పటల్ గా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు. 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాద్ లో జన్మించిన ఇందిర అల్లారు ముద్దుగా పెరిగారు. ఇందిర బాల్యం అలహాబాదు లోనే గడిచింది. 1924 లో కమలానెహ్రూ ఒకబాబును కన్నారు . ప్రీ మెచ్యూర్ గా జన్మించడం వలన 2 రోజులలో బాబు చనిపోయాడు . 1934 లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు కాబడి కలకత్తా, డెహ్రాడూన్‌ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం పాడైంది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ దిగులుతో అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌ కు వెళ్లి 1936 లో టి.బి. జబ్బు మూలాన మరణించారు . మే 27 వ తేది 1964వ సంత్సరంలో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకు దూరమయ్యారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు , పార్కులు , ఆసుపత్రులు , విశ్వవిద్యాలయాలు వెలసాయి .


  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Monday, October 3, 2011

లాలా లజపతిరాయ్,Lala lajpat Rai



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -లాలా లజపతిరాయ్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


  • లాలా లజపత్ రాయ్ --జనణము : జనవరి 28, 1865 -
  • మరణము : నవంబరు 17 1928,
  • బిరుదులు :పంజాబ్ కేసరి -
  • జన్మస్థలం: ఫిరోజ్‌పూర్., పంజాబ్, భారతదేశం,
  • ఉద్యమము: భారత స్వతంత్ర సంగ్రామం,
  • ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రెస్, ఆర్య సమాజ్,

లాలా లజపత్ రాయ్ భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28 1865, మరణం నవంబరు 17 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.

లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో లాల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు.

For more details : Lala Lajapathi Rai
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, October 1, 2011

శాంతిస్వరూప్ భట్నాగర్,Santhiswaroop Batnagar



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -శాంతిస్వరూప్ భట్నాగర్,Santhiswaroop Batnagar- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.

ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో ఫిబ్రవరి 21, 1894న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది.

ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు. ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత(Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.

భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు. భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.

నువ్వు పనిచెయ్యడమే కాదు ,పనిచేసే అవకాశాలు కల్పించు అనే సిద్ధాంతాన్ని నమ్మే భట్నాగర్ భారతదేశములో వివిధప్రాంతాలలో 12 పరిశోధనా శాలలను స్థాపించారు .

జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి.

01 జనవరి 1955 తేదీన మరణించారు .

భట్నాగర్‌ అవార్డు, Batnagar Award


శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు కనబరిచిన ప్రతిభకు నిదర్శనంగా, ఆయా రం గాలకు వారు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఇచ్చే శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవా ర్డులు భారత శాస్త్ర రంగంలో అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు.2010 సం.ప్రఖ్యాతిగాంచిన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాలకు 11 మంది శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. సీఎస్‌ఐఆర్‌ ఫౌండేషన్‌ డే వార్షికోత్సవంలో.. శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ సమక్షంలో సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సమీర్‌ బ్రహ్మచారి పురస్కార విజేతల 2010 సంవత్సరానికి పేర్లు ప్రకటించారు. ఆ వివరాలు..

గణిత శాస్త్రంలో..
* మహాన్‌ మహారాజ్‌: రామకృష్ణా మిషన్‌కు చెందిన వివేకానంద యునివర్సిటీ- హౌరా
* పలాశ్‌కుమార్‌: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌-కోల్‌కతా

జీవశాస్త్రంలో ..
* అమిత్‌ ప్రకాశ్‌ శర్మ: ఇంటర్నేషనల్‌ జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ-ఢిల్లీ
* రాజన్‌ శంకర్‌ నారాయణన్‌: సీసీఎంబీ - హైదరాబాద్‌

రసాయనశాస్త్రంలో ..
* బాలసుబ్రమణియన్‌ సుందరం: జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌-బెంగళూరు
* గరికపాటి నరహరి శాస్త్రి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌

భౌతిక శాస్త్రంలో..
* షిరాజ్‌ మిన్‌వల్లా: టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌-ముంబయి
వైద్య శాస్త్రంలో..
* కె.నారాయణస్వామి బాలాజీ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -బెంగళూరు

ఇంజినీరింగ్‌లో..
* శిరీషెందు దే: ఐఐటీ- ఖరగ్‌పూర్‌
* ఉపద్రష్ట రామమూర్తి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- -

ఎర్త్‌ సైన్స్‌లో..
* శంకర్‌ దొరై స్వామి: నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రాఫీ- గోవా

ఈ పురస్కారం కింద విజేతలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రూ.5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేస్తారు.
  • ========================================


Visit my website - > Dr.seshagirirao.com/

Friday, September 23, 2011

చంద్రశేఖర్ ఆజాద్,చంద్రశేఖర్ సీతారాం తివారీ ,ChandraSekhar Azad



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -చంద్రశేఖర్ ఆజాద్(చంద్రశేఖర్ సీతారాం తివారీ ,ChandraSekhar Azad)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు,స్వాతంత్య్ర సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, త్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుదాం .

సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. ఆయనే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్.

కోర్టులో

తనను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్‌కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది-
‘‘నీ పేరేమిటి?’’ ‘‘ నా పేరు అజాద్,’’ ‘‘ తండ్రి పేరు’’ ‘‘స్వాధీన్,’’ ‘‘నీ ఇల్లెక్కడ’’ - ‘‘కారాగృహం.’’
ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకులనుంచి ‘్భరత్ మాతాకీ జై’ నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖవర్చస్సుకల ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో ‘16 కొరడాల దెబ్బలు’ అంటూ శిక్ష ప్రకటించాడు.నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే.. ఆ బాలుని శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినపుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుని ‘అజాద్’ అని పిలిచారు. అదే అతడి సార్ధక నామధేయం అయింది. శిక్షానంతరం , సేద తీర్చుకోమని (ఇది మరో అవమానం!) మూడు అణాలు ఇవ్వడం రివాజు. ఆ మూడు అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు అజాద్. బ్రిటిష్ పాఠశాల చదువు ఇష్టంలేని అజాద్ కాశీలో సంస్కృత విద్యాలయంలో చేరాడు.

ఆరోజుల్లోనే విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. అజాద్ జీవితంలో అదో పెద్ద మలుపు. బిస్మిల్ అడుగుజాడల్లో విప్లవ శంఖం పూరించాడు. ఉద్యమానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి తిరుగుబాటే మార్గం అవుతుందని సంకేతాలు ప్రజలకు అందించడం- ఆశయంగా పెట్టుకుని 1925లో జరిగిన కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్‌తో సహా యస్ఫతుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్‌సింగ్‌లను, బూటకపు విచారణ జరిపి ఉరితీసింది. మన్మధ దాస్‌గుప్తా, జోగీంద్ర చటర్జీ, ముకుందలాల్, రామకృష్ణ ఖత్రలకు పది పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అజాద్ మాత్రం తప్పించుకున్నాడు. ఆ తర్వాత అజాద్ మారువేషాలలో అనేక ఊళ్లు తిరిగాడు. వివిధ విప్లవ సంస్థలతో సంపర్కం పెట్టుకున్నాడు. తదుపరి ఫిరోజ్‌షా కోట్లలో భగత్‌సింగ్, భగవతీచరణ్, శివశర్మ, మరికొందరు విప్లవ వీరులతో కలిసి 1928 సెప్టెంబర్ 8న ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మి’ స్థాపించడం జరిగింది. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి జరిపాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంజాబ్ కేసరి నేలకొరిగాడు. విప్లవ వీరులు చూస్తూ ఊరుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆగ్రహంతో రగిలిపోతూ సాండర్స్‌ను హతమార్చారు. 1929 జూలై 10న సాండర్స్ హత్యకేసు విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం 32మందిపై నేరం మోపింది. ఆ బూటకపు విచారణానంతరం అజాద్‌తోసహా తొమ్మిదిమందిని పరారీలో వున్నారని ప్రకటించింది. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశే్వశ్వర సిన్నాహలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా, బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు. విశే్వశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు. ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వనె్న తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్జ్వల ఉదాహరణ.

  • జన్మస్థలం: బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం,
  • నిర్యాణ స్థలం: అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశం,
  • ఉద్యమము: భారత జాతీయ ఉద్యమం,
  • ప్రధాన సంస్థలు: నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్,
  • మరణము – ఫిబ్రవరి 27, 1931, అలహాబాదు, ఉత్తరప్రదేశ్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

బాలగంగాధర తిలక్ ,Bal Gangadhar Tilak



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -బాలగంగాధర తిలక్ ,Bal Gangadhar Tilak- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, మంచి ఉపాధ్యాయుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజంగా అబ్బాయి. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.

బాలగంగాధర తిలక్ ని భారతజాతీయోద్యమ పిత గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest)గా భావిస్తారు.

  • జణనము :జూలై 23 1856.
  • ఇతర పేర్లు: లోకమాన్య తిలక్,
  • జన్మస్థలం: రత్నగిరి, మహారాష్ట్ర,
  • ఉద్యమము: భారత స్వాతంత్ర్యోద్యమం,
  • ప్రధాన సంస్థలు:భారత జాతీయ కాంగ్రేసు,
  • నిర్యాణ స్థలం: బొంబాయి,ఇండియా,
  • మరణము : ఆగష్టు 1 1920.

పూర్తి వివరాలకోసం --> బాలగంగాధర తిలక్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Wednesday, September 21, 2011

గోపాలక్రిష్ణ గోఖలే ,Gopal Krishna Gokhale



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గోపాలక్రిష్ణ గోఖలే - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ (ప్రస్తుత మహారాష్ట్ర) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.

For more details see Wikipedia - Gopalakrishna Gokhale
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Monday, September 19, 2011

Jwala Gutta , జ్వాలా గుత్తా



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jwala Gutta , జ్వాలా గుత్తా
- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ ఛాంపియన్. కేంద్ర ప్రభుత్వము ఆగస్ట్ 18, 2011 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది. క్రాంతి, ఎలెన్ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్ చేతబట్టిందీ అప్పటినుంచే. చదువు, బ్యాడ్మింటన్ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగారు. సింగిల్స్‌తోపాటు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆడడం జ్వాల ప్రత్యేకత!. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విన్నర్‌గా నిలిచారు.

జ్వాల సెప్టెంబర్ 7, 1983న మహారాష్ట్ర లోని వార్ధాలో తెలుగు తండ్రి గుత్తా క్రాంతి, చైనా తల్లి ఎలెన్‌ కి జన్మించింది. తాత చెంగ్ వార్ధాలోని సేవాగ్రాం ఆశ్రమములో మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ ఆత్మకథ, రచనలను ఛైనా భాషలోనికి అనువదించాడు. భట్టిప్రోలు మండలం గుత్తావారిపాలెం జ్వాల పెద్దల స్వస్థలం. జ్వాల తాతయ్య గుత్తా సుబ్రహ్మణ్యం అభ్యుదయవాది, స్వాతంత్య్రయోధుడు. ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు సుబ్రహ్మణ్యం. చిన్నతనంలోనే సోదరులతో కలిసి వందేమాతరం నినాదాన్ని అందుకున్నారు. ఆగ్రహించిన నాటి బ్రిటిష్ పాలకులు ఈ కుటుంబాన్నీ, వీరి బంధుగణాన్నీ అరెస్టుచేసి జైలుకు పంపారు. ఉద్యమబాటలో వీరి ఆస్తులు కరిగిపోయాయి. సుబ్రహ్మణ్యం పెదనాన్న, పెద్దమ్మ జైల్లోనే ప్రాణాలు విడిచారు. బయటపడ్డాక అప్పులతో కాలం గడుపుతుండగానే వారు కోరుకున్న స్వేచ్ఛాభారతం సిద్ధించింది. మిగిలిన కొద్దిపాటి ఆస్తులు అమ్ముకుని ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు వలసబాట పట్టాయి. తమిళనాడుకు వెళ్లి పుష్పగిరి గ్రామంలో వ్యవసాయం ఆరంభించి పూలతోటలు సాగుచేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు అరుగురు సంతానం. అందులో క్రాంతి ఒకరు. ఈ కుటుంబానికి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌తో అనుబంధం ఏర్పడింది. మకాం అటు మార్చారు. గాంధీజీ బేసిక్ స్కూలును ఆరంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. ఆ క్రమంలో వాకాడు, హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య, ఇంటర్మీడియెట్ చదివిన క్రాంతి మహారాష్ట్ర వెళ్లి డిగ్రీ, కెమిస్ట్రీలో పీజీ చేశారు. అప్పుడే సేవాగ్రామ్ వచ్చిన చైనా యువతి ఎలెన్‌తో పరిచయం ప్రేమగా మారింది. వివాహబంధం ముడిపడ్డాక ఆమెకు భారత పౌరసత్వం వచ్చింది. ఆర్‌బీఐ ఉద్యోగిగా మహారాష్ట్రలో అయిదేళ్లు పనిచేసిన క్రాంతి, 1988లో బదిలీపై హైదరాబాద్ చేరుకున్నారు.
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, September 1, 2011

గుల్జారీలాల్ నందా ,Gulzarilal Nanda



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గుల్జారీలాల్ నందా - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


గుల్జారీలాల్ నందా ..జూలై 4, 1898 పుట్టి - జనవరి 15, 1998 న మరణిచారు . భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణము తరువాత. రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.

for more details - > Gulzarilal Nanda in Telugu
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Kalpana chavla , కల్పనా చావ్లా


  • https://6772741428248755133-a-1802744773732722657-s-sites.googlegroups.com/site/seshagirirao2006/home/kalpana-chavla/Kalpana%20chavla-img.jpg?attachauth=ANoY7coT4BZ_gk53JR5AYUv4SIejdwCKwCpu3GuUcokcmqBRaGGCTzgNJRVcCFJLmNkX14XZbx83h3PD0CkPEUjQk8GqPBiAM2PZW7soeLkpsfFKWhQfXWXkTA9mdoR2yl8_hOsjUgVgUlBe3V-2eBDgDUAVqG9g7qvkkfX6eW-wHTXdtpw3w-_Z6fHliFXlh45iXMasrN_iYlqOxmtZbAWFWiEfW5sAiqQ2F8vb0v2M1GpYTqcSVJztS9SG847q8VazUM2QeZ7t&attredirects=0


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalpana chavla , కల్పనా చావ్లా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

బనారసి చావ్లా, సనాజ్యోతి దంపతులకు 1961లో కర్నల్ జిల్లాలోని హర్యానాలో కల్పన జన్మించారు. చిన్నతనం నుంచి తనకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. టాటా. ఆయనలా గాలిలో ఎగరాలని కలలు కనడం ప్రారంభింది. ఆమె ఆత్మవిశ్వాసమే ఆమె ఆశయ సాధనకు తోడ్పడింది. యువతకు మార్గదర్శిగా మిగిలింది.
కల్పన సంప్రదాయాలను గౌరవించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా పాతతరం ఆలోచనలకు స్వస్తి పలికింది. మొదటితరం వారసురాలుగా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో తనకు ఇష్టమైన తన చిన్ననాటి కలకు రెక్కలు తొడగాలని ‘ఏరోనాటికల్ ఇంజినీరింగ్’లో చేరిన తొలి మహిళ. కల్పన కట్టుబాట్లు తెంచుకొని ముందడుగు వేయడం తల్లిదండ్రులకు ఏ మాత్రం రుచించలేదు. పిల్లలచేత మనస్సులో నాటుకున్న ఆలోచనలకు అనుగుణంగా పెద్దలు చేయూత అందించాలని కల్పన భావించేది. తల్లిదండ్రులు ఆగ్రహించినప్పటికి తన కోసం ఎదురుచూస్తున్న ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఉన్నత చదువుల కోసం అమెరికా ప్రయాణమైంది. టెక్సాస్, బౌల్డర్, కొలరాడో విశ్వవిద్యాలయాలలో అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకుంది.
ఆమె తన విద్యాభ్యాసం అనంతరం ‘నాసా ఎమ్స్ పరిశోధన కేంద్రం’లో పని చేయడం ప్రారంభించింది. తనకు అమెరికా పౌరసత్వం లభించడంతో తనతోటి సహచరుడు, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ జీన్ పైరీ హరిసన్‌ను వివాహం చేసుకున్నారు. విమానాలు నడపటంలో శిక్షణ పొంది, వ్యోమగామిగా మారడానికి మార్గం సుగమం చేసుకొన్నారు.

For more details -> Kalpana Chavla
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Wednesday, August 31, 2011

ఇందిరా గాంధీ ,Indira Gandhi



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ఇందిరా గాంధీ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ఇందిరా ప్రియదర్శిని గాంధీ (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసారు .1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతిచేత ఎన్నిక చేయబడినారు . లాల్ బహదుర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసారు .ఉన్నత రాజకీయ కుటుంబంలో సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు ఉత్తర ప్రదేశ్)లోని మొఘల్ సరాయ్ లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించించారు . 4 విడతలుగా మొత్తం సుమారు 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించారు . ప్రధానము గా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయారు .


పూర్తి వివరాలకు : వికీపెడియా ను చూడండి -- ఇందిరా గాంధీ
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

జవహర్‌లాల్ నెహ్రూ, Jawaharlal Nehru



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జవహర్‌లాల్ నెహ్రూ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


జవహర్‌లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru)(నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ - గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

For full details in Telugu -> Jawaharlal Nehru
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Friday, August 26, 2011

అనసూయా కులకర్ణి , Anasuya Kulakarni




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అనసూయా కులకర్ణి - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ణి. అంతటితో ఆగక వివిధ దేశాల్లో విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఓనమాలు దిద్దిన అనసూయ, 1952వ సంవత్సరంలో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నరు మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకోవడం విశేషం. ప్రముఖ గురువు మైసూర్‌ టి.చౌడయ్య వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశారు. ఆమె గాన మాధుర్యానికి ఆకర్షితులై ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు 1961లో 'భక్త ప్రహ్లాద' చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

వివాహానంతరం ఆమెకు భర్తతో పాటు దేశ విదేశాలు తిరిగి చూడడం, అక్కడి సంగీత రీతులు, సంగీత వాద్యాలను తెలుసుకునే అవకాశం లభించింది. అదే ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. 1964లో భర్త ఉద్యోగ రీత్యా కాబూల్‌కు మారడంతో అక్కడి ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ సరంగ్‌ శిష్యరికంతో హిందూస్తానీ సంగీతం అభ్యసించే సదవకాశం ఆమెకు దొరికింది. ఉస్తాద్‌ తన ప్రియ శిష్యురాలికి స్వరమండల్‌ అనే తంత్రీవాద్యాన్ని కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. సంగీత వాద్యాలను సేకరించాలనే తన ఆలోచనకు నాంది పలికింది గురువుగారు బహూకరించిన ఆ తంత్రీవాద్యమే అంటారు అనసూయ. కాబూల్‌లో కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత భర్తతో కలిసి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, కెన్యా, పపువా న్యూ గినియా, ఉగాండా, మంగోలియా, ఇథియోపియా, భూటాన్‌, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఆదేశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నో యూనివర్శిటీలలో ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కింద సంగీతం నేర్పించారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ .... వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

''ప్రతి వాద్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తేవడం ఓ ఎత్తైతే దాన్ని పాడవకుండా భద్రపరచడం మరో ఎత్తు. ఇది నిజంగా ఓ సవాలు'' అంటారు అనసూయ. ఇండోనేషియాలో ఆమె మొదటిసారిగా అంగ్‌క్లంగ్‌ ను (వెదురుబొంగులను వరుసక్రమంలో బిగించిన చట్రం. చూడడానికి జైెలోఫోల్‌ (కర్రముక్కల సంగీతపు పెట్టె) మాదిరిగా ఉండే అతిపెద్ద వాద్యం) చూశారు. అది పూర్తిగా ఒక పెద్ద గదిని ఆక్రమించేది. పైగా దానిలో స్వరాలు పలికించడానికి వాద్యకారులు ముందుకు వెనుకకు పరుగెత్తవలసి వచ్చేది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గాయనీ గాయకులు నిలబడడం, పరుగెత్తడం వంటివి లేకుండా కూర్చొని ప్రేక్షకులు చూసి ఆనందించేలా ఆలపిస్తారు.

ఆ విధంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంలో కూడా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రేక్షకులు వినగల్గేలా ఎందుకు ప్రదర్శించకూడదు?'' అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా జరగాలంటే మొదటగా ఆ పరికరం పరిమాణం తగ్గించాలి. ఆ పనిని అంగ్‌క్లంగ్‌ వాద్య నిపుణుల సహకారంతో చేయాలని ఆమె భావించారు. ధ్వని, మాధుర్యం, స్వరస్థానాలలో ఏ మాత్రం మార్పు లేకుండా దాని పరిమాణం తగ్గించడంలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. పునరుద్ధరించిన ఆ వాద్యానికి 'అంగ్‌క్రంగ్‌' అనే పేరునిచ్చారు. అక్టోబర్‌ 24న తన ఇద్దరు కుమారులు, దినేష్‌ (మృదంగం), ఉమేష్‌ (ఘటం) వాద్య సహకారంతో ఇండోనేషియా దూరదర్శన్‌లో కర్ణాటక సంగీత ప్రదర్శన ఇచ్చారు. తర్వాత పెర్త్‌ నగరంలో జరిగిన హిందూమహాసముద్ర ఉత్సవంలో (ఓషన్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఆర్ట్‌) ఆమెను ఇండోనేషియా ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది.

పపువా న్యూ గినియాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాకు చెందిన సంగీతవాద్య ప్రదర్శన ఇవ్వడమంటే సాధారణ విషయం కాదు. అతికొద్ది కాలంలోనే అంగ్‌క్లంగ్‌తో ఒక గంట కచేరీ చేయగలిగేంతగా ఆ వాద్యంపై పట్టు సాధించారు అనసూయ. భారతదేశంలోనే కాక ఇతర దేశాలలోనూ ప్రపంచ సంగీత సాధనాల గురించి ప్రదర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. సందర్శకులంతా ఈ వాద్యాలను పవర్‌ పాయింట్‌ స్లైడ్స్‌లో వాయించి చూపితే బాగుంటుందని కోరడంతో ఆమె తన దగ్గరున్న వాద్యాలను స్వయంగా ప్రదర్శించి చూపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపడం వల్ల ప్రేక్షకులు ఆ వాద్యనాదంలో పూర్తిగా లీనమవగల్గుతారు. ఏది ఎలా ఉన్నా ప్రతిసారీ ఈ విలువైన వాద్యాలను కదిలించడం సాధ్యంకాదు కదా! ఇదంతా ఎప్పటికి సాధ్యపడుతుందో!'' అంటారు అనసూయ సాలోచనగా.

మరొక శ్లాఘనీయమైన అంశం ఏమిటంటే అనసూయ గౌరవార్థం బెంగళూరులోని పలు సంస్థలకు, మలేషియాలోని ఒక సంస్థకు ఆమె పేరు పెట్టారు. అనసూయ ఎన్నో టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నో పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశారు. 2001 వ సంవత్సరంలో అన్నామలై యూనివర్శిటీ నుంచి కర్ణాటక సంగీతంలో ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు. 2008వ సంవత్సరంలో అంగ్‌క్లంగ్‌ వాద్యంలో భారతీయ శాస్త్రీయ సంగీతబాణీలో పలికించినందుకు గాను ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు.

అదే సంవత్సరం అక్టోబర్‌ 24న ఐరాస దినోత్సవం సందర్భంగా 90 నిమిషాల పాటు దాదాపు 20 సంగీత వాద్యాలను ఒక సహచరుని సాయంతో పరిచయం చేస్తూ ప్రదర్శించారు. ఆ ప్రదర్శన యవనికలోని నృపతుంగరోడ్‌లో జరిగింది. అనసూయ మాత్రం సంగీత వాద్యాల సేకరణ, వాటిని వాయించే విధానం, ముఖ్యంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. ''మొదట నేను సేకరించిన వాద్యాలను మొదటి అంతస్తులో భద్రపరిచేదాన్ని. కానీ క్రమంగా సేకరణ వాద్యాలు ఎక్కువయ్యాయి. దాంతో రెండవ అంతస్తు కూడ నిర్మించి, రెండు అంతస్తుల్లోనూ అరలు, బీరువాలు డిజైన్‌ చేసి ప్రదర్శనకు వీలుగా తయారుచేశాము. కానీ ఇప్పుడు ఈ రెండు అంతస్తులు కూడా నిండిపొయ్యాయి'' అని నవ్వుతూ చెప్తారు అనసూయ. మొత్తంగా ఇప్పటికి ఆమె సేకరించిన సంగీత వాద్యాల సంఖ్య అక్షరాలా 300. అంగ్‌క్లంగ్‌ కళాకారిణిగా ఆమె 'కర్ణాటక కళాశ్రీ'' అవార్డు కూడా అందుకున్నారు.

అనసూయా కులకర్ణి జీవితం ఎందరెందరికో మార్గదర్శకమైంది. తమకు కావలసింది ఏమిటో కచ్చితంగా తెలుసుకొని, అదే దిశగా పయనించి లక్ష్యాన్ని చేరుకుని తాము ఎంతో సాధించామని పొంగిపోయేవారు కొందరైతే, లక్ష్యసాధనలో అవరోధాలకు జడిసి, తమ జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లి, ఏమీ సాధించలేక పరిస్థితులను నిందిస్తూ కూర్చొనేవారు మరికొందరు. కానీ అనసూయ జీవితంలో తనకు ఎదురైన అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుని ప్రపంచ సంగీత రంగాన్నే తన జీవితంగా మలచుకొని ఆరు పదుల వయసులో కూడా పరిస్థితులతో ఎలాంటి రాజీ పడకుండా సాగిస్తున్న పయనాన్ని హర్షించకుండా ఉండలేం. ''నేను ఇక ఎక్కువ కాలం పాడలేననేది నిజం. అయినప్పటికీ పాడగలిగిన విద్వాంసులకు ఏ మాత్రం కొరతలేదు. కానీ అంగ్‌క్లంగ్‌పై శాస్త్రీయ సంగీతాన్ని పలికించగల ఏకైక కళాకారిణిని మాత్రం నేనే'' అని సగర్వంగా చెప్తారు అనసూయ.

-- వివరాలు...- నాగ శిరీష
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, August 18, 2011

ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి (ఇన్ఫోసిస్‌),N.R.Narayanamurty(Infosis)



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి (ఇన్ఫోసిస్‌) - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

నారాయణమూర్తి 20 ఆగస్ట్ 1946 న మైసూర్ , కర్నాటక రాస్ట్రము లో కన్నడ మద్వ బ్రహ్మిణ్ కుటుంబము లో జన్మించారు . ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ , ఐ.ఐ.టీ లో మాస్టర్ డిగ్రీ చేసారు .

వ్యూహాలు గొప్పగా ఉండవచ్చు. లక్ష్యాలు అత్యున్నతంగా ఉండవచ్చు. జీతాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు. అనుభవ సంపన్నుల అండదండలూ ఉండవచ్చు. ఏ సంస్థ మనుగడకైనా ఇవొక్కటే సరిపోవు.

'మనసు' కూడా ఉండాలి! మూడు దశాబ్దాల క్రితమే ఇన్ఫోసిస్‌ పేరుతో మనసున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించారు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి. 'మానవీయ పెట్టుబడిదారి వ్యవస్థ'కు దారిచూపిన ఆ నాయకుడు ఈ శనివారం (ఆగస్టు 20) ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నారు.

ఇన్ఫోసిస్‌.నారాయణమూర్తి.--ఒక వ్యక్తి+ఒక సంస్థ= ఐటీ రంగంలో ఒక అద్భుతం.
ఆ గొప్పదనం వ్యక్తిదా, సంస్థదా? అంటే.. సంస్థలాంటి వ్యక్తిది. 'ఇన్ఫోసిస్‌' నారాయణమూర్తిది!

ఇన్ఫోసిస్‌ను ఆయన ఒక మామూలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీగానో, అవుట్‌సోర్సింగ్‌ కేంద్రంగానో రూపొందించలేదు. ఒక వ్యవస్థగా తీర్చిదిద్దారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు గణిత సిద్ధాంతాల్లా, సైన్స్‌ ఫార్ములాల్లా...తిరుగులేని విలువల సూత్రాలు. ఒక దేశానికి రాజ్యాంగంలా పనికొస్తాయి. ఒక వ్యక్తికి వికాస పాఠాల్లా ఉపయోగపడతాయి. వ్యాపార సంస్థలో అమలుచేస్తే, అది కలకాలం నిలుస్తుంది.

విద్యాసంస్థలో అమలు చేస్తే రేపటి పౌరులు ప్రయోజకులు అవుతారు. స్వచ్ఛంద సంస్థలో అమలుచేస్తే లక్ష్యసాధన సులువైపోతుంది. గొప్ప పుస్తకాలు, స్ఫూర్తిప్రదాతలు, విజయాలు, వైఫల్యాలు, సృజన, సమాజ పరిశీలన, నిరంతర అధ్యయనం, మిత్రబృందం... ఇన్ఫోసిస్‌ లీడర్‌కు అక్షౌహిణుల సైన్యంలా అండగా నిలిచిన అంశాలెన్నో, వ్యక్తులెందరో. నారాయణమూర్తి ఎవర్నీ మరచిపోలేదు. ఏ అనుభవాన్నీ మనసు పొరల్లోంచి చెరిపేసుకోలేదు. 'మూడు దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్‌ ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ఎంతో సంపదనిచ్చింది. ఓ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎన్‌.ఎస్‌.రాఘవన్‌, క్రిస్‌ గోపాలకృష్ణన్‌, నందన్‌ నీలేకని...ఇలాంటి సహచరులే లేకపోతే నేను లేను. ఉన్నా సున్నా. ఇంత గొప్ప విజయం, ఓ వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేదే కాదు' అని వినమ్రంగా చెబుతారు. ఒక స్థాయికి వెళ్లేసరికి ఏ మనిషికైనా అహం నెత్తినెక్కి కూర్చుంటుంది. ఈయనేమిటి - ఒక రుషిలా, ఒక ఫకీరులా - ఏదీ తనదికానట్టు మాట్లాడతారే? అనిపించవచ్చు.

'కర్మణ్యేవాధికారస్తే...' భగవద్గీతలో నారాయణుడి ఉవాచ, నారాయణమూర్తి ఆలోచనలకు మూలకేంద్రం. తాను తామరాకుమీద నీటి బొట్టుననే అనుకుంటారు. 'అది భౌతికమైన సంపద కావచ్చు. మేధోపరమైన సంపద కావచ్చు. మనం సృష్టించినదంతా మనది కాదు. దానికి మనం తాత్కాలికమైన సంరక్షకులం మాత్రమే. నలుగురితో పంచుకోవడం ద్వారానే దాని విలువ పెరుగుతుంది' అంటారు.

సమాజంలో తనవంతు బాధ్యత నిర్వర్తించడానికి నారాయణమూర్తి ఎంచుకున్న మార్గం...'మానవీయ పెట్టుబడిదారి వ్యవస్థ'. ఇది పెట్టుబడిదారి, సామ్యవాద వ్యవస్థల్లోని మేలు లక్షణాల కలయిక. ఎవరికివారు ధర్మబద్ధమైన మార్గంలో సంపదను పెంచుకుంటూనే, ఏదోఒక రూపంలో నలుగురితో పంచుకునే విధానం. ఆ నలుగురూ...ఉద్యోగులు కావచ్చు. వాటాదారులు కావచ్చు. ఖాతాదారులు కావచ్చు. ప్రజలు కావచ్చు. విలువల పునాదులు
పునాదుల్ని బట్టి నిర్మాణం. విలువల్ని బట్టి వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్‌కు బలమైన విలువల పునాదులు వేశారు నారాయణమూర్తి. బిలియన్‌డాలర్‌ కంపెనీ కావాలి..నాస్‌డాక్‌లో నవోదు కావాలి...ఆస్తులు సంపాదించాలి... ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో ఎక్కాలి... ఇన్ఫోసిస్‌ స్థాపన వెనుక ఇలాంటి ఖరీదైన కలలేం లేవు. 'ఇన్నేళ్ల తర్వాత కూడా, కొన్నికోట్లమందికి అక్షరం అందనంత దూరంలో ఉంది.

సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. వైద్యసౌకర్యాలు అంతంతమాత్రమే. మరుగుదొడ్లు కూడా కరవే'... తరహా అంతర్మథనమే ఎక్కువ. కమ్యూనిస్టు సిద్ధాంతాలూ తన భావాలూ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. ఏదో ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని చెప్పేవారు. అంతలోనే, అవకాశాల్ని వెతుక్కుంటూ పారిస్‌ వెళ్లిపోయారు. అక్కడ జరిగిన సంఘటన నారాయణమూర్తి నిర్ణయాన్ని మార్చేసింది. సెర్బియా బల్గేరియాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంలోని ఓ రైల్వేస్టేషన్‌లో ఉన్నారప్పుడు. పారిస్‌ నుంచి మైసూరుకు తిరుగు ప్రయాణంలో అదో మజిలీ. రైల్లో ఓ జంట పరిచయమైంది. మాటలు కలిశాయి. తన భావాల్నీ ఆలోచనల్నీ ఆవేశంగా పంచుకుంటున్నారు. అటుగా వెళ్తున్న ఓ గార్డు నక్కినక్కి వీళ్ల మాటలు విన్నాడు. నారాయణమూర్తి బల్గేరియా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారేవో అన్న అనుమానం వచ్చింది. లాక్కెళ్లి ఇరుకిరుకు గదిలో బంధించాడు. చిమ్మచీకటి. చిన్న రంధ్రం మాత్రమే ఉంది. అదీ కాలకృత్యాలు తీర్చుకోడానికి. తిండి లేదు. నిద్రలేదు. సాయంచేసే నాథుడు లేడు. రక్తం
గడ్డకట్టుకుపోయేంత చలి. అదో నరకం. ఇరవైనాలుగు గంటల తర్వాత 'మా మిత్రదేశం...భారత్‌ నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు. పాపమని వదిలేస్తున్నాం' అంటూ బరబరా బయటికి ఈడ్చి పడేశాడు.

దీంతో నారాయణమూర్తికి కమ్యూనిస్టుల మీదున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. మూర్తి ఆలోచనల్ని ప్రగాఢంగా ప్రభావితం చేసిన పుస్తకాలు మూడున్నాయి...మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌ (మహాత్మాగాంధీ), ప్రొటెస్టెంట్‌ ఎథిక్‌ అండ్‌ స్పిరిట్‌ ఆఫ్‌ కాపిటలిజం (మాక్స్‌ వెబర్‌), బ్లాక్‌ స్కిన్‌ - వైట్‌ మాస్క్స్‌ (ఫ్రంజ్‌ ఫానన్‌). గాంధీజీ విలువల గురించి చెప్పారు. 'సమున్నతమైన ఆలోచనలు, కష్టించే స్వభావం ఉన్న యువత దేశ ప్రగతికి పునాదులు' అన్న ఆలోచనకు వెబర్‌ మద్దతు పలికారు. ఫ్రంజ్‌ ఫానన్‌ భావాలు పాలకుల అసలు రంగును బట్టబయలు చేశాయి. వాళ్లంతా నల్లతోలు కప్పుకున్న తెల్లదొరలేనని తేల్చిచెప్పాయి. 'మరి, నిజమైన నాయకుడు ఎలా ఉంటాడు?' అని
ప్రశ్నించుకున్నప్పుడు...బోసినవ్వుల బాపూ కళ్లముందు కనిపించాడు. భారతదేశానికి రాగానే, దేశీయ అవసరాల కోసం ఓ ఐటీ సంస్థను స్థాపించారు. అప్పటికి భారత్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఉపయోగించుకునే స్థాయికి ఎదగలేదు. దీంతో వ్యాపారం మూతబడింది. పాట్నీ కంప్యూటర్స్‌లో చేరారు. మంచి సంస్థ. మంచి జీతం. అన్నిటికీ మించి ఆ ఆరుగురు సహోద్యోగులు. ఏదో ఒకరోజు అత్యద్భుత విజయాలు సాధించాలన్న ఉత్సాహం వాళ్లలిో కనిపించేది. అందర్లోనూ సమాజం అంటే బాధ్యత ఉంది. విలువలంటే గౌరవం ఉంది. అలాంటి సహచరులే తోడుంటే, జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమేరాదనిపించింది. ఆ ఆరుగురికీ కూడా నారాయణమూర్తి మీద అలాంటి అభిప్రాయమే ఉంది. అంతా మంచి స్నేహితులయ్యారు. ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నారాయణమూర్తి ఇంట్లోని ఓ చిన్నగదిలో ఇన్ఫోసిస్‌ ప్రాణంపోసుకుంది.

విలువల పునాదుల్లేని సంస్థలు 'సత్యం'లా కనుమరుగు కావడం సత్యం. విలువల పునాదుల్లేని వ్యక్తులు కేంద్ర మాజీమంత్రి రాజాలా జైలుపాలు కావడం ఖాయం. విలువల్లేని దేశాలు పాకిస్థాన్‌లా నిత్యం నెత్తురోడటం నిజంనిజం. 'మేం నమ్మిన విలువలకూ కట్టుబడిన నైతిక సూత్రాలకూ విరుద్ధంగా ఉంటే, ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టునైనా తిరస్కరిస్తాం' అనాలంటే ఆ ఇన్ఫోసిస్‌ నాయకుడికి ఎంత ధైర్యం ఉండాలి? డబ్బు, ప్రతిష్ఠ, బ్రాండ్‌...ఇవేవీ లేనిరోజుల్లో కూడా నారాయణమూర్తి తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. అప్పట్లో ఇన్ఫోసిస్‌ విదేశాల నుంచి ఒక కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత అధికారికి లంచం ఇస్తే, లక్షరూపాయల సుంకంతో బయటపడవచ్చు. మిగిలిన పనులూ చకచకా పూర్తయిపోతాయి. నారాయణమూర్తి లంచం ఇవ్వడానికి తిరస్కరించారు. నిబంధనల ప్రకారం పదిలక్షలు చెల్లించారు. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థకు అది భారీ వెుత్తమే. లోటు పూడ్చుకోడానికి ఆరేళ్లు పట్టింది. 'విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన సంస్థగా ఎదగాలి' అన్నది ఇన్ఫోసిస్‌ విజన్‌ స్టేట్‌మెంట్‌. సిరిసంపదలతో, అధికారంతో వచ్చే గౌరవం మెరుపులాంటిది. తాత్కాలికం. మేధస్సుకే శాశ్వత గౌరవం. విలువలకే వినయపూర్వక ప్రణామాలు!
'పవర్డ్‌ బై ఇంటలెక్ట్‌...
డ్రివెన్‌ బై వాల్యూస్‌' - ఇన్ఫోసిస్‌ నినాదం.
మేధస్సు దిశానిర్దేశం చేస్తుంది. విలువలు ముందుండి నడిపిస్తాయి. మేధ, విలువలు ఉన్నచోటికి...విజయం దానంతట అదే వస్తుంది. విజయలక్ష్మి వెనకాలే ఘల్లుఘల్లుమంటూ ధనలక్ష్మి!

నాయకుల కార్ఖానా
ఇన్ఫోసిస్‌లో 'నేను', 'నాది', 'నా విజయం' అన్న మాట ఎక్కడా వినిపించదు, చీఫ్‌ మెంటార్‌ నుంచి సామాన్య ఉద్యోగి దాకా ఎవరూ ఉపయోగించరు. వాళ్లకు తెలిసిందల్లా 'బృంద'గానమే! ఆ సమష్ఠితత్వమే లేకపోతే ఇన్ఫోసిస్‌ లేదు. అక్కడ అనుచరులుండరు. అంతా నాయకులే. ముప్పైఏళ్ల క్రితం విత్తు నాటుతున్నప్పుడే ఆ లక్షణాన్ని కంపెనీ జన్యువుల్లోకి ఎక్కించారు నారాయణమూర్తి. సిబ్బందిలో నాయకత్వ లక్షణాల్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన శిక్షణ సంస్థను స్థాపించారు -ఇన్ఫోసిస్‌ లీడర్‌షిప్‌ ఇన్‌స్టిట్యూట్‌. 'యాక్సిలరేటెడ్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌' ద్వారా నవతరం ఆలోచనలకు సానబడతారక్కడ. ప్రతి యువనాయకుడికీ ఒక సీనియర్‌ నాయకుడు మార్గదర్శనం చేస్తాడు. ఇన్ఫోసిస్‌ను ప్రారంభించిన తొలిరోజుల్లో...ఏ కొత్త ఆలోచన అయినా వ్యవస్థాపక సభ్యుల నుంచే వచ్చేది. సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా యువతరం పెద్దగా చొరవ చూపేవారు కాదు. చెప్పవచ్చో లేదో అన్న బిడియం కావచ్చు. తమకు అంత స్థాయి లేదేవో అన్న భయమూ కావచ్చు. నారాయణమూర్తికి ఆ సంశయం అర్థమైంది.
వ్యవస్థలోని లోపమూ తెలిసొచ్చింది. వ్యూహరచన, సంక్షోభ నివారణ, మార్పును గమనించే నైపుణ్యం, నాయకత్వ ప్రతిభ...తదితర లక్షణాల్ని ఇన్ఫోసియన్లలో పెంపొందించడం తక్షణ కర్తవ్యమని భావించారు.

ఆ నిర్ణయం వల్ల...ఒక్క ఇన్ఫోసిస్‌ మాత్రమే లాభపడలేదు. ఆ పరిజ్ఞానంతో...ఎంట్రప్రెన్యూర్స్‌గా అవతరించినవారు ఎంతోమంది. స్పష్టమైన ఆలోచనతో, నలుగురికీ ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో సంస్థ నుంచి బయటికెళ్లేవారిని నారాయణమూర్తి మనసారా ఆశీర్వదిస్తారు. ఇన్ఫోసిస్‌ అంటుకొమ్మలు నలుదిశలా విస్తరించాయి. ఇన్ఫోసిస్‌కు అవతల...కళ్లనిండా కలలతో, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో, ఆలోచనల నిండా అద్భుతాలతో ఆసరా కోసం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది యువతీయువకుల మాటేమిటి? అలాంటివారి కోసమే నారాయణమూర్తి కాటమరాన్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటుచేశారు. సృజనకు నిధుల కొరత ఉండకూడదన్నది ఆయన ఆలోచన. 'ఎంట్రప్రెన్యూర్‌షిప్‌' అనేది ఉపాధి అవకాశాల సృష్టికి, పేదరిక నిర్మూలనకు ఓ మార్గం. ఒక వ్యాపార ఆలోచనను ప్రోత్సహించడం అంటే ఒక నాయకుడిని సృష్టించడమే. నిజానికి దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు కారణం ప్రజల నిర్లిప్తతే. తమను తాము అనుచరుల్లానో బానిసల్లానో భావించుకోవడం వల్లే ఈ దుస్థితి. 'నేనో లీడర్‌'ని అనుకుంటే...మనం స్పందించే పద్ధతి వేరుగా ఉంటుంది. మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. మన ఆలోచనలో, ఆచరణలో అది ప్రతిబింబిస్తుంది. ఆ నాయకత్వశక్తే ఇన్ఫోసిస్‌ను మిగిలిన సంస్థల కంటే ఉన్నతంగా నిలబెట్టింది.

భవితకు భరోసా...
ఇంత చండాలమైన దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం...అని ఏ దేశ ప్రజలైనా బాధపడ్డారంటే, ఇంత పనికిమాలిన కంపెనీలో ఉద్యోగం చేయడం ఏ జన్మలో చేసుకున్న పాపవో...అని ఏ సంస్థ ఉద్యోగులైనా గొణుక్కున్నారంటే...ఆ దేశం సంకోభానికి దగ్గర్లో ఉన్నట్టు, ఆ సంస్థ సమస్యల్లో చిక్కుకున్నట్టు. అన్నిటికీ మించి, అది నాయకుడి వైఫల్యం! పౌరుల్లో సిబ్బందిలో వాటాదారుల్లో ఖాతాదారుల్లో నమ్మకాన్ని నింపలేనివాడు లీడర్‌ అనిపించుకోలేడు. అంత నమ్మకం రాత్రికిరాత్రి పుట్టుకురాదు. పరీక్షలు నెగ్గాలి. సవాళ్లు అధిగమించాలి. రాబోయే రేపటిని ఈరోజే కళ్లముందు ఆవిష్కరించాలి. సవాళ్లొచ్చినా సంక్షోభాలొచ్చినా లీడర్‌ తమ వెనుక ఉంటాడన్న భరోసా ఇవ్వాలి.

ఇరవైఏళ్ల క్రితం, ఓ విదేశీ సంస్థ బిలియన్‌ డాలర్లో అంతకంటే కాస్త ఎక్కువో చెల్లించి ఇన్ఫోసిస్‌ను సొంతం చేసుకోడానికి ముందుకొచ్చింది. మిగతా భాగస్వాములు సంతోషంగా అంగీకరించారు. ఇక నారాయణమూర్తి వంతు. ఏ పరిస్థితుల్లో ఏ లక్ష్యాలతో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించిందీ అందరికీ గుర్తుచేశారు. 'ఇన్ఫోసిస్‌ మన కల. మనందరి జీవితం. ఒక దశాబ్దం పాటు కంటికిరెప్పలా చూసుకున్నాం.

గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో...ఎన్నో అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. భవిష్యత్‌ అంతా ఐటీదే! అయినా కూడా, అమ్మాలనుకుంటే...ఎవరి చేతుల్లోనో పెట్టడం ఎందుకు? మీ వాటాల్ని నేనే కొంటాను'... నారాయణమూర్తి మాట్లాడాక, ఎవరూ మాట్లాడలేదు. చాలాసేపు నిశ్శబ్దం. నిజానికి, ఆయన జేబులో చిల్లిగవ్వకూడా లేదు. తామంతా కలిసి కట్టుకున్న విలువల మేడ ఇంకెవరి చేతుల్లోకో వెళ్లకూడదన్న తపనే అలా మాట్లాడించింది. భాగస్వాములూ అర్థంచేసుకున్నారు. ఇంకెప్పుడూ ఎవరూ అలాంటి ప్రతిపాదన తీసుకురాలేదు. పదేళ్లలో ఆ సంస్థ మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్ల కంటే, 28 వేలరెట్లు ఎక్కువైంది. ఇప్పుడైతే, ఇన్ఫోసిస్‌ షేరంటే బంగారమే! మార్చి 2010 నాటికి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇన్ఫోసిస్‌లో వాటాలున్నాయి. వాటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.50 వేల కోట్లు.ప్రస్తుతం, లక్షా పాతికవేలమందికి పైగా ఇన్ఫోసిస్‌ నీడలో బతుకుతున్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందినవాడు నాయకుడు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నవాడు మహానాయకుడు!


అనుభవ పాఠాలు...
వైఫల్యమంటే తెలియని సంస్థ ఏదైనా ఉందంటే, దానికి గెలుపు రుచీ తెలిసుండకపోవచ్చు! ఎదురుదెబ్బలే లేకపోతే, ఎదురుతిరిగే ధైర్యం ఎలా వస్తుంది? ఇన్ఫోసిస్‌కు అనుభవమే అసలైన పెట్టుబడి.

తొలిరోజుల్లో... పేరుప్రతిష్ఠల్లేవు. డబ్బు లేదు. బ్రాండ్‌ విలువలేదు. ఓ పెద్ద కంపెనీ కంప్యూటర్ల మీద రాత్రిళ్లు మాత్రమే పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అతి కొద్దిమంది ఉద్యోగుల్ని నియమించుకున్నారు. అయినా, జీతాలకు కటకటే. ఆ ఇబ్బందులు చూడలేక ఓ భాగస్వామి తన దారి తాను చూసుకున్నారు. వీటన్నిటికి తోడు సర్కారీ కార్యాలయాల్లో అవినీతి. ఒక్క కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోడానికి (150 శాతం దిగుమతి సుంకం చెల్లించి మరీ...) పాతికసార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. టెలిఫోన్‌ పెట్టించుకోడానికి ఏడాది పట్టింది. ఐటీ మార్కెట్‌ కూడా ఏమంత గొప్పగా లేదు. ఎంతోకొంత రాబడి వస్తుందన్న ఉద్దేశంతో ఇన్ఫోసిస్‌ హార్డ్‌వేర్‌ రంగంలోకి వచ్చింది. పరిమిత వనరులతో పోటీని తట్టుకోవడం కష్టమని అర్థంకావడానికి ఎంతో సమయం పట్టలేదు. దుకాణం కట్టేశారు. ఎక్కడో భారతదేశంలో ఉన్న ఇన్ఫోసిస్‌ అనే కంపెనీని నమ్మి, అతి ముఖ్యమైన బాధ్యతల్ని అప్పగించడం రిస్కుతో కూడిన వ్యవహారమేవో అన్న అనుమానాన్ని తొలగించడానికి...'గ్లోబల్‌ డెలివరీ వోడల్‌'ను అభివృద్ధిచేసింది నారాయణమూర్తి బృందం. దీని ప్రకారం...70 శాతం పనులు భారత్‌లోని డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో జరిగితే, మిగతా 30 శాతం కీలకమైన పనులు క్త్లెంట్లు ఉన్నచోటే జరుగుతాయి. భారత ఐటీ పరిశ్రమనే మలుపు తిప్పిన నిర్ణయమది. ఇన్ఫోసిస్‌ సున్నా నుంచి ఐదు మిలియన్‌ డాలర్లకు చేరుకోడానికి పదేళ్లు పడితే, అంతకంటే కాస్త తక్కువ సమయంలోనే ఐదు మిలియన్‌ డాలర్ల నుంచి 700 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

ఎంతోకాలంగా వ్యాపార సేవలు పొందుతున్న జి.ఇ. (జనరల్‌ ఎలక్ట్రికల్స్‌) చేజారిపోవడం ఎంతపెద్ద దెబ్బో...అంత గొప్ప పాఠం కూడా. అప్పటిదాకా దాదాపు 25 శాతం వ్యాపారాన్ని ఇస్తున్న సంస్థ..ధరల విషయంలో చిన్న తేడా రావడంతో వెనక్కి తగ్గింది. మరో ఐటీ కంపెనీ అయితే బిక్కచచ్చిపోయేది. మరో నాయకుడైతే వాటాదారులకు వెుహం చూపించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇన్ఫోసిస్‌ ఆ పని చేయలేదు. నారాయణమూర్తి వెనకడుగు వేయలేదు. నలభై ఎనిమిది గంటల్లో తమ భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటించారు. రాబడి లోటును ఎలా పూడ్చుకునేదీ వివరించారు. ఆ పారదర్శకత ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచింది. ఇక నుంచి ఒక క్త్లెంట్‌ మీద కాని, ఒక దేశం మీద కాని, ఒక టెక్నాలజీ మీద కాని పూర్తిగా ఆధారపడకూడదన్న నిర్ణయానికొచ్చారు. సంస్థ నాయకత్వ బాధ్యతల విషయంలోనూ
ఆయనకు అంతే ముందుచూపు ఉంది. యాభై రెండేళ్లకే మేనేజింగ్‌ డైరెక్టరు పదవి నుంచి తప్పుకున్నారు. అరవై అయిదేళ్లకే ఛైర్మన్‌ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నారు. ఎక్కడా వోహం లేదు.

పదవీ వ్యావోహం లేదు. 'వ్యాపార సంస్థ నిర్వహణ అనేది రిలే పరుగుపందెం లాంటిది. ఒకరు పరుగు ఆపగానే, మరొకరు అందుకుంటారు. మరెవరో గమ్యానికి చేరుకుంటారు. ఇంకెవరో పతకం స్వీకరిస్తారు. ఆ బృందంలో నేనూ ఒక ఆటగాడిని. నేనే సర్వస్వం కాదు'...ఎంత గొప్ప మాట. నారాయణమూర్తిలాంటి నిఖార్సైన లీడర్‌ మాత్రమే అనగలరీ మాట.
* * *
''ఇంతకాలం ముందుండి నడిపించారు. ఇక ముందు, ఎవరు మార్గదర్శనం చేస్తారు? ఎవరు వ్యూహ రచన చేస్తారు? ఎవరు విలువల విలువేమిటో బోధిస్తారు?''... ఇన్ఫోసిస్‌లోని ప్రతి ఉద్యోగినీ వేధిస్తున్న

ప్రశ్న.

''కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నంత కాలం...ఇన్ఫోసిస్‌కు తిరుగులేదు. ఆ ప్రయత్నం ఆగిపోతే మాత్రం, తొలిపొద్దు వెలుగుల్లోని బంగారు వన్నెలా ఆ వైభవం క్రమక్రమంగా కనుమరుగైపోతుంది''

... ఒక్క ఇన్ఫోసిస్‌కే కాదు, ప్రతి సంస్థకూ, ప్రతి వ్యవస్థకూ నారాయణమూర్తి అనుభవపూర్వక సందేశం, ఆశీర్వచనం, హెచ్చరిక.
ఆమె...
సుధామూర్తి ప్రస్తావన లేకపోతే, ఆమె త్యాగాల్ని గుర్తుచేసుకోకపోతే, ఆమె ప్రోత్సాహాన్ని కొనియాడకపోతే... నారాయణమూర్తి విజయాల చరిత్ర అసంపూర్ణం, అసమగ్రం. ఇద్దరూ కన్నడిగులే. వెుదటిసారిగా పుణెలో కలుసుకున్నారు. అతను బడిపంతులు కొడుకు. గంపెడు సంతానంలో ఒకరు. ఐఐటీ కాన్పూర్‌ నుంచి పట్టా అందుకున్నారు. అప్పటిదాకా స్థిరమైన ఉద్యోగం లేదు. ఆమె కలవారి అమ్మాయి. అప్పటికే టెల్కో (టాటా సంస్థ)లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

అతను పుస్తక ప్రియుడు. ఆమెకూ పుస్తకాలంటే ఇష్టం. ఓ మిత్రుడు అతని దగ్గర పుస్తకాలు తీసుకుని, ఆమెకు ఇచ్చేవాడు. వెుదటి పేజీలో పేరు రాసుకోవడం నారాయణమూర్తికి అలవాటు. అలా ఆయన కంటే ఆయన పేరే సుధామూర్తికి బాగా పరిచయం. ఆతర్వాత ఏదో విందులో ఇద్దరూ కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. ముందుగా మూర్తే ప్రేమ ప్రతిపాదన చేశారు. 'నా ఎత్తు ఐదడుగులా నాలుగు అంగుళాలు. కళ్లజోడు పెట్టుకుంటాను. అందగాణ్నేం కాదు. పేద కుటుంబం నుంచి వచ్చాను. నా దగ్గర డబ్బు లేదు. సంపాదిస్తాననీ అనుకోవడం లేదు. అయినా సరే, నన్ను పెళ్లిచేసుకుంటారా?' అనడిగారు. 'కాస్త ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి' అని చెప్పారు సుధ. ఆ ప్రతిపాదన కన్నవారి ముందుంచారామె. 'తాడూ బొంగరంలేని మనిషితో నీకు పెళ్లేమిటి? అసాధ్యం' తేల్చిచెప్పారు తండ్రి. 'ఎప్పటికైనా, మీ అనుమతితోనే అతన్ని పెళ్లిచేసుకుంటాను. కాదంటే, ఇలానే ఉండిపోతాను' అని బదులిచ్చారు సుధ. మూర్తి పాట్నీ కంప్యూటర్స్‌లో చేరాక...ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. చేతిలో పైసా
లేకపోయినా, నారాయణమూర్తి మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించాలని అనుకున్నప్పుడు, సుధ మనసారా ప్రోత్సహించారు. పొదుపు చేసుకున్న పదివేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నగలు కుదువపెట్టారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా... నారాయణమూర్తిని ఎప్పుడూ నిరాశపరచలేదు. 'కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను. లక్ష్యం గురించి మీరు ఆలోచించండి' అని భరోసా ఇచ్చారు. ఇద్దర్లో ఎవరో ఒకరు మాత్రమే ఇన్ఫోసిస్‌ వ్యవహారాలు చూడాలని నారాయణమూర్తి నిర్ణయించినప్పుడు ...తనకు అన్ని అర్హతలూ ఉన్నా ఆ అవకాశం భర్తకే ఇచ్చారు. ఎందుకంటే, అది ఆయన కల! తను కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. 'ఇన్ఫోసిస్‌ తొలిరోజుల్లో నేను గుమస్తాని, వంటమనిషిని, ప్రోగ్రామర్‌ని, ఆయనకు సెక్రెటరీని ..' అని నవ్వుతూ చెబుతారామె. 'ఎంత త్యాగం, ఎంత త్యాగం!' అని ఎవరైనా సానుభూతి చూపితే ఆమె తట్టుకోలేరు. 'అది త్యాగం కాదు...ప్రేమ' అని సరిచేస్తారు. ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు... రోహన్‌, అక్షత. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మూర్తిగారిది ముచ్చటైన కుటుంబం!

source : eenadu sunday magazine
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, August 4, 2011

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ , Syama Prasad Mookerjee


  • photo courtesy with - widipedia.org/
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -శ్యాంప్రసాద్‌ ముఖర్జీ , Syama Prasad Mookerjee- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


శ్యాంప్రసాద్‌ ముఖర్జీ--23-6-1953న జన సంఘ్‌ పార్టీ స్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కాశ్మీర్‌లో ఖైదులో మరణించారు. (జననం: 6-7-1901) ఈయన దేశ విభజనను వ్యతిరేకించాడు. 1947 నుండి 1950 వరకు కేంద్ర పరిశ్రమ ల శాఖామంత్రిగా పనిచేశారు. సింధ్రీ ఎరు వుల కర్మాగారం, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ ఫ్యాక్టరీ మొదలైనవి ఈయన మంత్రిగా ఉన్న ప్పుడే ప్రారంభించబడ్డాయి. 8-4-1950న భారత్‌ - పాకిస్తాన్‌ ప్రధానమంత్రులు చేసు కున్న లియాఖత్‌ ఒప్పందానికి నిరసనగా కేం ద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. 1951లో ఈయన స్థాపించిన జనసంఘ్‌ పార్టీ పేరు ఆ తరువాత భారతీయ జనతా పార్టీగా పేరు మార్చబడింది.

For more details - > శ్యాంప్రసాద్‌ ముఖర్జీ , Syama Prasad Mookerjee
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

బంకించంద్ర ఛటర్జీ , Bankim Chandra Chatterjee


  • photo : courtesy - Wikipedia.org/

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -బంకించంద్ర ఛటర్జీ , Bankim Chandra Chatterjee- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


  • 26-6-1838న బెంగాల్‌లోని కంతల్‌పు రాలో జన్మించారు బంకించంద్ర ఛటర్జీ. బెంగాల్‌లో మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. తండ్రివలెనే ఈయన కూడా డిప్యూటీ కలెక్టరయ్యాడు. స్వస్థాన వేష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇరవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్‌’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్‌ నందిని, కపాలకుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మొ దలైన 15 నవలలు రాశాడు. దేశాన్ని మాతృమూర్తిగా సంబో ధిస్తూ... దేశభక్తిని ప్రబోధిస్తూ... ‘వందేమాతరం’ గేయం రాసిన తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్‌’ న వలలో పొందుపరిచాడు. ఈ న వల వివిధ భారతీయ భాషలలో నికి అనువదించబడడం వలన ఈ గేయం దేశవ్యాప్తంగా ప్రచా రాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. ఈ గేయానికి రవీంద్రుడు బాణీకట్టి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 1896 కాంగ్రెస్‌ సభలలో గానం చేశాడట.

For full details -->బంకించంద్ర ఛటర్జీ , Bankim Chandra Chatterjee
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

Monday, August 1, 2011

మంగళ్ పాండే , Mangal pande



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ ----------- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే !

కోల్కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మద్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. కారణం బ్రిటిషు వారు సిపాయిలకు తుపాకులకు, ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసిన తయారు చేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు.

source : Mangal pande
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, July 30, 2011

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ , EswarachandraVidhyasagar



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ఈశ్వరచంద్ర విద్యాసాగర్ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కవి, రచయిత, విద్యావేత్త, తత్వవేత్త, సమాజ సేవకుడు. ఈయన బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్... బిర్సింగా గ్రామం (నేటి పశ్చిమ బెంగాల్) లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా పేదరికంలో గడుపుతూ కూడా ఎంతో పుస్తక జ్ఞానాన్ని పొందాడు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావటంతో కొడుకు కూడా అదే వృత్తిని చేపట్టాడు. గ్రామంలో ప్రారంభమయిన ఈశ్వరచంద్ర విద్యాభ్యాసం ఆ తర్వాత తండ్రి కోల్‌కతాలో ఉద్యోగంలో చేరటంతో అక్కడ కొనసాగింది.
1839లో హిందూ న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణుడై ‘విద్యాసాగర్’ అనే బిరుదును పొందాడు. రెండు సంవత్సరాల తర్వాత పోర్టు విలియమ్ కాలేజీలో ప్రధాన సంస్కృత పండిత పదవిని పొందాడు. అక్కడ ఆయన... అన్ని కులాలకు సంస్కృతం నేర్పాలని,మహిళలను ప్రోత్సహించాలని పోరాటం ప్రారంభించాడు. ఆ తర్వాత స్కూల్ ఇన్‌స్పెక్టర్ పదవిలో ఉండగా కొత్తగా ఇరవై స్కూళ్లను స్థాపించాడు. కొంతకాలం తర్వాత పోర్టు విలియమ్ కాలేజీ మూతపడింది.

కోల్‌కతా విశ్వవిద్యాలయం ప్రారంభం కావడంతో ఈశ్వరచంద్ర దానికి స్థాపక సభ్యుడయ్యాడు. ఆయన అప్పటికే మహిళల హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఈశ్వరచంద్ర విశాలహృదయం, ఔన్నత్యం కలవాడని అతని గురించి తెలిసిన వారందరూ అంగీకరిస్తారు.

సమాజంలోని పేదవారి మీద కనికరం చూపి వారికి సహాయం చేసేవాడు. చిన్నపెద్ద అందరికీ వినయం, సహనం నేర్పేవాడు. స్వామి వివేకానంద ఈశ్వరచంద్ర గురించి మాట్లాడుతూ ‘‘ఉత్తర భారతంలో విద్యాసాగర్ నీడ సోకని నా వయసువాడు ఎవ్వడూ లేడు’’ అన్నాడంటే ఈశ్వరచంద్ర ఖ్యాతిని అర్థం చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకోసం --> ఈశ్వరచంద్ర విద్యాసాగర్
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జె.ఆర్‌.డి.టాటా , J.R.D.Tata






J.R.D.Tata భారతీయ వ్యాపార వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించిన వ్యాపా ర దిగ్గజం, టాటా సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసిన - జెహంగిర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా.... తేదీ 29 జూలై 1904న పారిస్‌లో జన్మించారు.

1877 లో జెమ్‌షెట్‌జీ టాటా ప్రారం భించిన వ్యాపారం పరిశ్రమలను ఈయన బాగా విస్తరింపజేశా రు. జెమ్‌షెట్‌జీ బావమరిది కుమారుడైన రతన్‌జీ, ఫ్రెంచ్‌ మహి ళ సుజానే బ్రెయిరీలకు జూలై 29, 1904వ సంవత్సరంలో జన్మించారు. ఈయన టాటా పగ్గాలు చేపట్టిన తరువాతనే టాటా స్టీల్‌, టాటా కెమికల్స్‌, హోటళ్ళు (తాజ్‌, లేక్‌ ప్యాలెస్‌) టైటాన్‌ వాచ్‌, టాటా టీ, లాక్మె మొదలైన సంస్థలు ఏర్పడ్డాయి. భారత దేశపు ప్రథమ ఎయిర్‌లైన్స్‌ అయిన ‘ఎయిర్‌ ఇండియా’ వ్యవస్థాప కుడు కూడా ఈయనే కావడం విశేషం. అనేక శాస్త్ర, సాంకేత సంస్థలను స్థాపించి ఆయా రంగాల వికాసానికి కృషి చేశారు. 1993లో ఆయన మరణా నంతరం భారత ప్రభుత్వం జె.ఆర్‌.డి.టాటాను ‘భారత రత్న’ పురస్కారంతో సత్కరించింది.

మరికొంత సమాచారము కొరకు -> J.R.D.Tata
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Monday, July 25, 2011

ఎమ్.ఎఫ్.హుసేన్,Maqbool Fida Husain





హుస్సేన్‌ను తన సమకాలికుల్లోకెల్లా ఉన్నతంగా నిలిపే అంశమేమిటంటే ఎటువంటి అంశాన్ని అయినా మనోహరంగా, వినూత్నమైన రీతిలో చిత్రించగలగడం. అన్ని రకాల కళా రూపాల్లోను ఆయనది అందెవేసిన చేయి. పోస్టర్ల తయారీ దగ్గర నుంచి అబ్బురపరిచే పెయింటింగ్స్‌, పిల్లల ఆటవస్తువుల తయారీ వరకు అన్నిటిలోనూ ఆయన విశేష ప్రావీణ్యం ప్రదర్శించారు. వలస పాలనలో రాజా రవి వర్మ మాదిరిగానే, ఆధునిక దృక్పథంతో సాంప్రదాయిక రీతులను మేళవిస్తూ జన రంజకంగా, ఆకట్టుకునేలా బొమ్మలు గీయడంలో హుస్సేన్‌ అనిర్వచనీయమైన కృషి చేశారు.

మక్బూల్ ఫిదా హుసేన్ జననం : 1915, పంఢర్‌పూర్, మహారాష్ట్ర , ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధ్ గాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ పికాసో" తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996 లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్‌ జున్ 9(8) న లండన్ లొ(అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుఝ్హామున 2:30ని|| కు) అనారొగ్యం తో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో ఆయన తనువు చాలించారన్న వార్త ఎంతగానో బాధ కలిగించింది.

for full details _ see wikipedia.org -- ఎమ్.ఎఫ్.హుసేన్
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com

Thursday, July 14, 2011

కామరాజ్‌ నాడార్ , Kamaraj Nadar




మట్టిలోంచే మాణిక్యాలు వస్తాయి.ప్రజల నుండే నాయకులు వస్తారు. అలాంటి నాయకుల్లో తమిళనాడులోని తిన్నెవెల్లి జిల్లాలోని విరుదు నగర్‌ దగ్గర మారుమూల గ్రామంలో ఉన్న నిరుపేద కల్లుగీత కుటుంబంలో జన్మించినాడు కామరాజ్‌ నాడార్‌. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రి ఇందిరా గాంధికి అత్యంత సన్నిహితుడిగా, జాతీయ కాంగ్రెస్‌ అస్తవ్యస్థంగా ఉన్న సమయంలో ఉండి... గరీబీ హఠావో, ఆరు సూత్రాల పథకాలను రూపొందించి- ప్రతి పేదవానికి ఇల్లు, భూమి, సంక్షేమ పథకాలను అందజేసి, కాంగ్రెస్‌ పార్టీని పేదల పార్టీగా మలచిన గొప్ప జాతీయ నాయకుడు కామరాజు నాడార్‌.

ఆయన రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది. అప్పటికే అనేక లుక లుకలతో ఉన్న జాతీయ కాంగ్రెస్‌ను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న కామరాజ్‌ నాడార్‌ గొప్ప పోరాట యోధుడు. ప్రజల నుండి వచ్చి, పెద్దగా చదువుకోకున్నా ప్రజల జీవితాలను చదివినాడు కామరాజ్‌. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణం చిన్నతనం నుండి రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడమే.

1929 నాటికే కామరాజ్‌ కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుడైన సత్యమూర్తికి సహచరుడిగా ఉండేవాడు.ఆయన సత్యమూర్తిని రాజకీయ గురువుగా భావించేవాడు. అంతేకాకుండా ప్రముఖ సంఘ సేవకుడు నారాయణ గురు ప్రభావం కామరాజ్‌ పై ఉండేది. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో ముందు ఉన్నాడు. తమిళనాట కల్లుగీత కులాలవారిని అంరాని జాతిగా చూసేవారు. గుడి, బడి, సామాజిక హోదా కోసం కామరాజ్‌ నాడార్‌ శక్తికొద్ది ఉద్యమాలు నడిపాడు. అనతి కాలంలోనే కల్లుగీత, ఇతర అణగారిన కులాల నాయకుడిగా ఎదిగాడు. ఇదే సమయంలో సత్యమూర్తితో కాంగ్రెస్‌ పార్టీ తరపున రాష్టమ్రంతటా తిరగడం ద్వారా మంచి అనుభవం, పలుకుబడి కలిగిన వ్యక్తిగా రూపొందాడు. అనంతర కాలంలో తమిళనాడు కాంగ్రెస్‌లో గొప్ప శక్తిగా ఎదిగాడు.

1930లో మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 1931లో తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. 1937లో కాంగ్రెస్‌ అసెంబ్లీ నుండి పోటీ చేశాడు.చారిత్రక విరూద్‌నగర్‌, శివకాశి వంటి ప్రాముఖ్యం కలిగిన ప్టణాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కల్లుగీత కులస్థులైన నాడార్లు ఎక్కువగా జస్టిస్‌ పార్టీలోనే ఉండేవారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నుండి కామరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జాతీయ కాంగ్రెస్‌ నాయకుల దృష్టికి వచ్చింది. దీనితో ఆయన ఇందిరాగాంధీకి దగ్గరయ్యాడు.

అదే సమయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు వెల్లువెత్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి బహుజన కులాలకు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో పెరియార్‌ రామస్వామి పెద్ద ఆందోళన చేపట్టాడు. దానితో రాజగోపాలాచారి స్థానంలో కామరాజ్‌ నాడార్‌ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన కామరాజ్‌కు సామాన్యుల సమస్యలు తెలుసు కాబట్టి, వారి బాగు కోసం శక్తి మేరకు కృషి చేశాడు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాడు. వెనుకబడిన కులాల జాబితాలోని అన్ని కులాలకు ఉద్యోగ, విద్యా రంగాల రిజర్వేషన్లలో, బడ్జెట్‌లో పెద్ద పీఠం వేయడం ఆయన కృషితోనే సాధ్యమయింది.

1954 నుండి 1963 వరకు కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. బ్రాహ్మణులతో సమానంగా పరిపాలన చేసిన కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు రాజకీయ చరిత్ర ను తిరగ రాశాడు. ఆ తర్వాత తమిళనాడులో అనేక సామాజిక కోణాల నుండి కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి.కామరాజ్‌ పరిపాలనను అన్ని వర్గాల వారు గౌరవించారు. ఆ తర్వాత కామరాజ్‌ నాడార్‌ 1969 నాటికి జాతీయ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించారు.జాతీయ కాంగ్రెస్‌ అత్యున్నత అధ్యక్ష బాధ్యతను కామరాజ్‌కు అప్పగించింది.

-ఇందిరా గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించిన యోధుడు నాడార్‌. కామరాజ్‌ నాడార్‌ వంటి వ్యక్తులు పుట్టుకొచ్చిన ఈ దేశంలో- నేటి రాజకీయ నాయకులకు అటువంటివారి అవసరం లేదనేలా రాజకీయాలు మారాయి. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచే తమ రాజకీయ ఎన్నికల స్థానాలను రిజర్వు చేసుకుంటున్నారు. సామాన్యుడిని రాజకీయ శక్తిగా మలచే ప్రక్రియను ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది.

--Written by Ambala Narayan goud.

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

సునీల్ మనోహర్ గవాస్కర్ ,Sunil Manohar Gavaskar





1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గవాస్కర్ (Sunil Manohar Gavaskar) , భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ 1970' , 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

For More details ->Sunik Gavaskar - Cricketer
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

డా కిరణ్‌ బేడి, Dr.Kiran bedi



16-07-1972న భారత పోలీస్‌ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన డా కిరణ్‌ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన కిరణ్‌ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్‌ సైన్సెస్‌ విభాగం నుండి డాక్టర్‌ను కూడా పూర్తి చేసింది. ఢిల్లీ డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌)గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహిం చింది. 9 వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలు కు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్‌ మెగసెసె అవార్డు లభించింది. ఐక్యరా జ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్‌ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్‌ బేడీ నే కావడం విశేషం. ‘ఐ డేర్‌’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్‌ బేడీ.

for more details -> Dr.Kiran bedi IPS
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com

Friday, February 11, 2011

మోతీలాల్ నెహ్రూ , Motilal Nehru



మోతీలాల్ నెహ్రూ (ఆంగ్లం : Motilal Nehru) జననం మే 6, 1861 – మరణం ఫిబ్రవరి 6, 1931. భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు.

జీవిత చరిత్ర : మోతీలాల్ నెహ్రూ ఆగ్రా లో పుట్టాడు, తండ్రి 'గంగాధర్' ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు. మోతీలాల్, స్వరూప్ రాణీ ని వివాహమాడాడు.

for full lesson -> Mothilal Nehru in Telugu Wikipedia


  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

డా.జాకీర్‌ హుస్సేన్‌,Dr.Zakir Hussain



డాజాకీర్‌ హుస్సేన్‌ జయంతి: ఫిబ్రవరి 08, 1897న జన్మించిన డా జాకీర్‌ హుస్సేన్‌ బెర్లి న్‌ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ డిగ్రీ పొందారు. ‘జామియా మిలియా ఇస్లామియా’ విద్యా సంస్థను స్థాపించారు. హిందూ ముస్లిం సామరస్యానికి కృషి చేశారు. 1957లో బిహార్‌ గవర్నర్‌ అయ్యారు. 1962 లో ఉపరాష్టప్రతిగా, 1967లో భారత మూడవ రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. 13-05-1967 నుండి 03-05-1969 ఆ పదవిలో కొనసా గారు. రాష్టప్రతి పదవి చేపట్టిన మొదటి మహ మ్మదీయుడు.

-అత్యల్పకాలం రాష్టప్రతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్టప్రతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.




  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com

Wednesday, January 26, 2011

హరగోవింద్ ఖొరానా, HARGOBIND KHORANA


హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. జనవరి 9, 1922న అవిభక్త భారత దేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది).ప్రస్తుతం (2007) ఆయన మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.


మరింత సమాచారము కోసం : తెలుగు వికిపిడియాను చూడండి ->హరగోవింద్ ఖొరానా
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

స్వామి వివేకానంద, Swami Vivekananda


స్వామి వివేకానంద జయంతి : జనవరి 12, 1863వ సంవత్సరంలో కలకత్తాలో జన్మిం చారు స్వామి వివేకానంద. వీరి అసలుపేరు నరేంద్రనాథ్‌ దత్‌. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్‌ దత్‌. వివిధ మత సిద్ధాంతా లను ఆకలింపు చేసుకున్న ఆయన కొంత కాలం బ్రహ్మసమాజం ప్రభావంలో గడిపాడు. రామకృష్ణ పరమహంస మరణానంతరం సన్యాసం స్వీకరించి వివేకానందుడయ్యాడు. హిమాలయాలకు వెళ్ళి ఆరేళ్ళపాటు ధ్యానం లో గడిపాడు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూమత ప్రతినిధి గా హాజరయ్యాడు. ఆ తరువాత ఇంగ్లాండ్‌, శ్రీలంక, స్టిట్జర్లాండ్‌ మొదలైన దేశాలు పర్య టించి ఉపన్యసించాడు. ఇంగ్లాండ్‌లో ఆమె శిష్యురాలిగా మారి ఇండియాకు వచ్చిన మార్గ రెట్‌ నోబుల్‌ ఆ తరువాత సిస్టర్‌ నివేదితగా మారింది. రామకృష్ణమిషన్‌ అనే సంస్థను స్థాపించాడు. ‘రాజయోగం’ మొదలైన గ్రంథా లను రచించాడు. కలకత్తా సమీపంలోని బేలూరులో జులై 4, 1902వ సంవత్సరంలో మరణించాడు.

For details about Swami Vivekananda in Telugu --> Swami Vivekananda స్వామి వివేకానంద
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Tuesday, January 25, 2011

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్, Netaji Subhas Chandra Bose

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి: 24-01-1897.

ప్రభావతి, జనకీనాథ్‌ బోస్‌ దంపతులకు తేదీ 24-01-1897వ సంవత్సరంలో ఒరిస్సాలో ని కట్‌ లో జన్మించాడు నేతాజీ సుభాష్‌ చం ద్రబోస్‌ 1920 లండన్‌లో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చిత్తరంజన్‌ దాస్‌ ఈయనకు మార్గదర్శి. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని 1921లో అరెస్టయ్యాడు. కాంగ్రెస్‌లో కొంతకాలం కొనసాగిన తరువాత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అనే పార్టీని స్థాపించాడు. 1941 లో బ్రిటీష్‌ పోలీసుల కన్నుగప్పి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

జర్మనీలోని ఒక జలాంత ర్గామిలో 90 రోజులు ప్రయాణించి ఆఫ్రికాను ప్రదక్షిణం చేసి హందూ మహాసముద్రం మీ దుగా జపాన్‌ చేరుకున్నాడు. 1943లో ఇండి యన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) కి సర్వసైన్యాధిపతిగా నాయక త్వం వహించాడు. ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’ పేరుతో ఆత్మక థను రాశాడు. ఈయన ఫార్మోసా వెళుతున్న సమయంలో విమానం కూలిపోవటంతో మర ణించాడని అంటారు. ఆ ప్రమాదంలో వీరు మరణించి ఉండకపో వచ్చునని కొందరి అభిప్రాయం.

మరికొంత సమాచారము కోసం - > వికీపిడియాలో నేతాజీ సుబాష్ చంద్రబోస్

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com