Saturday, December 25, 2010

డాక్టర్‌ కొట్నీస్‌ జయంతి, Dr.Kotnis Birth day


డాక్టర్‌ కొట్నీస్‌ జయంతి-1910 అక్టోబరు10న

వైద్య విద్య ముగించుకొని మరింత ఉన్నత చదువుల కోసం తహతహలాడిన ఒక సాధారణ మధ్యతరగతి భారతీయ యువకుడు ఏవిధంగా ఒక చైనా సమాజపు జానపద కథానాయకుడి స్థాయికి చేరుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబే డాక్టర్‌ ద్వారకానాథ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌ జీవితం. ఆయన జీవించింది 32 సంవత్సరాలు. చైనాలో వైద్యసేవలు అందించింది ఐదేళ్లు. కానీ, ఇప్పటికీ చైనా ప్రజలకు ఆయన ఖాచీ హువా. అంటే చైనా 'సద్గుణ దాముడు' అని . గొప్ప అంతర్జాతీయ సంఘీభావానికి, రెండు ప్రాచీన నాగరికతల మధ్య స్నేహానికి డాక్టర్‌ కొట్నీస్‌ జీవితం ఒక ప్రతీక. రేపటికి (అక్టోబరు10 నాటికి) ఆయన పుట్టి వందేళ్లు అవుతోంది. 1910 అక్టోబరు10న మహారాష్ట్ర, షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి గుమస్తా కుటుంబంలో ఏడుగురి బిడ్డలలో రెండవవాడిగా కొట్నీిస్‌ జన్మించాడు.సామ్రాజ్యవాదుల చెరనుంచి విముక్తికోసం భారత,చైనాలు రెండూ వివిధ నేపథ్యాలలో పోరాటాలు చేస్తున్న రోజులవి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు కాలం. జపాన్‌ దురాక్రమణనె దుర్కొంటూ, కనీవినీ ఎరుగని మానవ విషాదాలతో చైనా తల్లడిల్లుతున్న కాలమది. చైనా కమ్యూనిస్టు సేనాని జనరల్‌ ఛూటే, భారత సహాయాన్ని అర్థిస్తూ నెహ్రూకు ఒక ఉత్తరం రాశాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్‌ ఆ ఉత్తరానికి స్పందించి ఒక వైద్య బృందాన్ని చైనాకు పంపాలని నిశ్చయించి ఒక ప్రకటన చేసింది. అప్పుడే 1936లో వైద్య పట్టా తీసుకున్న కొట్నీస్‌కు పరిపరి ఆలోచనలు ఉన్నాయి. సర్జరీలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాలని ఉండేది. అందుకోసం ఎడింబరో పోవాలా? బొంబాయిలోనే చదవాలా? ఇందుకోసం డబ్బులు ఎలా సర్దుబాటు చేసుకోవాలి? లేదా ప్రాక్టీస్‌ పెట్టి స్థిరపడి పెళ్లి చేసుకోవాలా? ఇవీ 26ఏళ్ల ఆ యువ వైద్యుడి ఆలోచనలు. కానీ, ఏ చారిత్రక శక్తుల ప్రభావం వల్లనో కొట్నీిస్‌ చైనా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఐదుగురి వైద్యుల బృందం ఎంపికైతే అందులో అతి పిన్నవయస్కుడు కొట్నీస్‌. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో వైద్యసేవలు అందించిన డాక్టర్‌ మోహన్‌లాల్‌ అటల్‌ ఈ బృంద నాయకుడు. నాగపూర్‌లో ప్రఖ్యాత సర్జన్‌గా ఉన్న 60సంవత్సరాల డాక్టర్‌ ఎంఆర్‌ చోల్కర్‌ ఉపనాయకుడు. డాక్టర్‌ దేవేన్‌ ముఖర్జీ, డాక్టర్‌ విజరుకుమార్‌ బసు, డాక్టర్‌ కొట్నీస్‌ ఈ బృందంలో సభ్యులు. భారత, చైనా దేశాలు దాస్య బంధనాలు తెంచుకునే వరకూ పోరాటం ఆపేది లేదని బ్రిటీష్‌, జపాన్‌ దేశాలను హెచ్చరిస్తూ శ్రీమతి సరోజిని నాయుడు వీడ్కోలు ప్రసంగం చేసిన తరువాత అంటే 1938 సెప్టెంబరు1న డాక్టర్‌ కొట్నీిస్‌ బృందం బొంబాయి నుంచి సముద్రయానం ద్వారా చైనాకు బయల్దేరింది. డాక్టర్‌ కొట్నీస్‌కు అది తిరిగి వెనక్కురాని ప్రయాణం.

భారతీయ వైద్య బృందం-మహా ప్రయాణం

డాక్టర్‌ అటల్‌ నాయకత్వంలోని కొట్నీస్‌ బృందం కాంటన్‌ చేరుకొన్నారు. రెండు ఆంబులెన్స్‌లు, ఒక సంవత్సరానికి సరిపడా మందులు, 60 పెట్టెల నిండా సర్జరీ పరికరాలు, ఒక పోర్టబుల్‌ ఎక్స్‌రే వారు వెంట తెచ్చుకున్నారు. కాంటన్‌లో చైనా నిర్మాత, సతీమణి మదామ్‌ సన్‌ఎట్‌సేన్‌ ఈ భారత వైద్య బృందానికి స్వాగతం పలికారు. కాంటన్‌లో తొలిసారిగా చూసిన యుద్ధ బీభత్స దృశ్యాలు వారిని కలచివేశాయి. బాంబుల దాడిలో గాయపడ్డ వేలాది మంది స్త్రీ, పురుషులు, బాలబాలికల హాహాకారాలు, రాత్రనక, పగలనక నిర్విరామంగా వైద్యసేవల్లో తలమునకలైన కొద్దిమంది డాక్టర్లు. ఇవీ కాంటన్‌ దృశ్యాలు. చైనాకు ఆ పరిస్థితుల్లో 5వేల మంది డాక్టర్లు అవసరం ఉంది. కానీ, 2వేల మంది మాత్రమే పట్టభద్రులైన డాక్టర్లు ఉన్నారు. వీరిలో ఒక వెయ్యి మంది మాత్రమే యుద్ధరంగంలో పనిచేస్తున్నారు. ఇంత తీవ్రమైన వైద్యుల కొరత మధ్య భారతీయ వైద్య బృందం తాము నిర్వహించాల్సిన మానవీయ పాత్రను బేరీజు వేసుకుంది. కాంటన్‌ నుండి హాంకో, అటునుండి ఇచాంగ్‌, చుంగ్‌కింగ్‌, చివరిలో యానాన్‌... ఇదీ వైద్య బృందం చేపట్టిన ప్రయాణ మార్గం.

ఇవన్నీ మహా నగరాలే. జపాన్‌ సైన్యం వైమానిక దాడితో బాంబుల విధ్వంసంతో ఒక నగరం తరువాత మరో నగరాన్ని ఆక్రమించుకుంటూ కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టిస్తున్న రోజులవి. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి. కూలిన ఇళ్లు, నిర్మానుష్యమయ్యే వీధులు, కుక్కలు తింటున్న మానవ కళేబరాలు, లేస్తున్న బాంబుల పొగ, కూలిన వంతెనలు, ధ్వంసమైన పొలాలు ఇవీ గ్రామాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. కానీ యుద్ధజ్వాలలు, మృత్యుభయాలు చైనా ప్రజలకు ఒక వినూత్నమైన జీవన శైలిని అలవాటు చేశాయి. ఒక వైపు చావులు, మరోవైపు చావును సవాలు చేస్తూ ఆటపాటలు, స్వాగత సత్కారాలు. వందల మైళ్ల ప్రయాణాలు చేస్తూ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళుతూ అక్కడ క్షతగాత్రులకు వైద్యం చేస్తూ కొన్నిరోజుల పాటు అక్కడే గడిపేది.హాంకో నగరం నుండి ఇంటికి రాసిన ఉత్తరంలో కొట్నీిస్‌ ఇలా పేర్కొన్నాడు. 'ఇక్కడ రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంబులెన్స్‌ వాహనాల కొరత తీవ్రంగా ఉండటం వలన గాయపడిన సైనికులు ఆసుపత్రివరకూ నడుచుకుంటూ రావాల్సిందే. వారు ఇక్కడకు చేరుకునేటప్పటికి ఒక్కోసారి వారం రోజులు కూడా పడుతుంది. తీవ్రంగా గాయపడిన సైనికులు దారిలోనే మరణిస్తున్నారు. యుద్ధరంగం నుండి హాంకోకు రోజూ సగటున 800మంది గాయపడిన సైనికులు చేరుకుంటున్నారు. ఇక డాక్టర్ల, నర్సుల తదితర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇందువల్ల రోగులకు సరైన చికిత్స అందడం లేదు. ఒక్క అంగుళం ఖాళీ ప్రదేశం లేకుండా రోగులు చాపలు పరుచుకొని పడుకుంటున్నారు'.

హాంకో, కాంటన్‌ నగరాలు చూస్తుండగానే జపాన్‌ సైన్యం వశమయ్యాయి. హాంకోలో 17రోజులు, చుంగ్‌కింగ్‌లో రెండు నెలలు, ఇఛాంగ్‌లో 26రోజులు సైనిక ఆసుపత్రిలోనూ, రెడ్‌క్రాస్‌లోనూ భారత బృందం పనిచేసింది. హాంకోలో విప్లవనేత చౌ ఎన్‌ లై ని, చుంగ్‌కింగ్‌లో ఉన్నప్పుడే చైనా అధ్యక్షుడు విన్‌సేన్‌ను, మదామ్‌ ఛాంగ్‌ కై షేక్‌ను కలుసుకున్నారు. ఇక్కడ ఉన్నప్పుడే చైనా భాషలోకి తమ పేర్లను మార్చుకున్నారు. అప్పుడే కొట్నీస్‌కు ఖాచీ హువా (చైనా దేశపు సద్గుణ ధాముడు) అనే పేరు పెట్టారు. చుంగ్‌కింగ్‌లో ఉండగానే అంతకముందెన్నడూ చూడనంత తీవ్రమైన విమాన దాడిని వైద్య బృందం చూసింది. పునాదులతో సహా కూలిపోతున్న భవనాలను, ఒక యువతి ఒడిలో పాలు తాగుతున్న పసిపాప సజీవ సమాధిఇలాంటివే ఎన్నెన్నో విషాదాలు. నిరాయుధ పౌరులపై జరిగిన అతి భయంకర దాడి అది. అప్పటికి భారతీయ వైద్య బృందం చైనాలో అడుగుపెట్టి మూడు మాసాలైంది. ఇంతలో ఒక విషాద వార్త కొట్నీిస్‌కుచేరింది. 1938 డిసెంబర్‌ 28న కొట్నీిస్‌ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఆ వార్త. ఇంటికి వెళ్లమని సహచరులు చెబుతున్నా గుండెను రాయి చేసుకొని క్షతగాత్రులకు తన సేవలను కొనసాగించడానికే నిశ్చయించుకున్నాడు. ప్రాచీన నగరాలు, ప్రమాదకరమైన పర్వత సానువులు, సుందరమైన నదీ ప్రయాణాలు, భయంకరమైన చలి, ఓటమితో వెనక్కు తగ్గుతున్న చైనా దళాలు, వైద్యం కోసం మైళ్లతరబడి, రోజుల తరబడి నడిచి వస్తున్న సైనికులు, ప్రజలు, సామాన్యుల సాహసాలు, దేశభక్తి, అంతర్జాతీయ సంఘీభావంతో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మేధావులతో పరిచయాలు - ఇలాంటి వైవిధ్యపూరితమైన అనుభవాల మధ్య సంక్షుభిత చైనా సమాజంలో డాక్టర్‌ కొట్నీస్‌ ఒకడుగా మారసాగాడు.

చైనాలో ఉన్న ఐదేళ్లలో జరిగిన ఘటనలు, అనుభవాలు, విషాదాలు ఒక ఎత్తు అయితే, తాము చేస్తున్న పనిలో పూర్తిగా విలీనం కావడం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడటం, నిజాయితీగా చుట్టూ జరుగుతున్న సామాజిక పరిణామాలను అధ్యయనం చేయడం, నమ్మినదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం లాంటి కొట్నీస్‌లోని సుగుణాలు చైనా ప్రజలతో, సంస్కృతితో మమేకమయ్యేలా చేశాయి. కొట్నీస్‌ ఆ కాలంలో ఇంటికి రాసిన ఉత్తరంలో చైనాదేశపు సమకాలీన పరిస్థితులు తనపై చెరగని ముద్రవేశాయని, ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవించిన కమ్యూనిజం గురించి బాగా తెలుసుకోవడానికి తన అనుభవాలు దోహదప డుతున్నాయని పేర్కొన్నాడు.ó

చివరి మజిలీ యానాన్‌

భారతీయ వైద్య బృందం వైద్య మహాయాత్రలో చివరి మజిలీ యానాన్‌. ప్రపంచంలోనే అతి ఎక్కువ బాంబుదాడులకు గురైన పట్టణమిది. చైనా విముక్తి పోరాటంలో కీలకమైన 8వ రూట్‌ సైన్యానికి, గెరిల్లా సామ్రాజ్యానికి రాజకీయ పరిపాలనా కేంద్రం ఇదే. యానాన్‌కు 15 కి.మీ దూరంలో ఉన్న ఒక గుహలో 200 పడకల ఆసుపత్రిని అప్పుడే నిర్మించారు. ఇక్కడే కొట్నీస్‌, డాక్టర్‌ బసు ఇద్దరూ వైద్యసేవలు అందించారు. మరో 80 కి.మీ దూరంలో కొండల మధ్య ఉన్న వైద్య కళాశాలలో పనిచేయడానికి డాక్టర్‌ ఛోల్కర్‌, డాక్టర్‌ ముఖర్జీలు వెళ్లారు. భారతీయ బృందానికి ఏర్పాటు చేసిన స్వాగత సభకు సాదాసీదా సైనిక దుస్తులతో ఉన్న మావో హాజరయ్యారు. భారతీయ వైద్యులతో వైద్యం చేయించుకోవడం కోసం సుదూర ప్రాంతాలనుంచి కూడా జనం వచ్చేవారు. నాలుగు మాసాలు గడిచేలోపే విపరీతమైన చలివల్ల వృద్ధులైన డాక్టర్‌ ఛోల్కర్‌, డాక్టర్‌ ముఖర్జీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వారు స్వదేశానికి వెనుతిరగాల్సి వచ్చింది. పౌష్టికాహారం లేకపోవడం వల్ల తరువాతి రోజుల్లో బృంద నాయకుడు అటల్‌కు జబ్బుచేసింది. ఆయన కూడా భారత్‌కు వెనుతిరిగాడు.

చివరికి ఇద్దరు - గొప్ప స్నేహితులు

ఇలా యానాన్‌లో 9నెలలు గడిచాయి. చైనా వచ్చి సంవత్సరం అవుతోంది. ఇక స్వదేశం వెళ్లాల్సి ఉంది. కానీ, ఇంతలో జనరల్‌ ఛూటే నుండి పిలుపు వచ్చింది. మిగిలిన వైద్యులూ గుర్రాలు, కంచర గాడిదలు సహాయంతో గెరిల్లా యుద్ధరంగ కేంద్రమైన ఉసియాంగ్‌ చేరుకున్నారు. అక్కడ ఒక గుడిసెలో ఛూటేను కలిశారు. ఆ గెరిల్లా యుద్ధరంగంలో పూరిగుడిసెలే ఆసుపత్రి వార్డులు. అక్కడే ఆపరేషన్లు. గాయపడిన వారికి సకాలంలో, జాగ్రత్తగా, ఏ ఒక్క క్షతగాత్రుడు మిగిలిపోకుండా, తక్కువ మందులతో ఎక్కువ ఫలితాలు సాధించేలా వైద్యం చేయాలనేది వారు పెట్టుకున్న సూత్రం. కొట్నీస్‌, బసు రెజిమెంట్లతో పాటు కదిలిపోతూ యుద్ధరంగంలో సంచార వైద్యం చేయసాగారు. ఇంతలో వారికి డాక్టర్‌ బెతూన్‌ మరణ వార్త తెలిసింది. బెతూన్‌ స్థానంలో పనిచేయటానికై ఉతారుకి రావాల్సిందిగా కొట్నీస్‌కు ఆహ్వానం అందింది. ఇద్దరు మిత్రులు విడిపోవాల్సి వచ్చింది. డాక్టర్‌ కొట్నీస్‌కు మళ్లీ 1500 కి.మీ. ఆరునెలల ప్రయాణం. దారంతా గ్రామ ఆసుపత్రులను తనిఖీ చేయడం, సూచనలు ఇవ్వడం, వైద్యం చేయడం. మరోవైపు డాక్టర్‌ బసు రెండు నెలలపాటు కాలినడకన 600 కి.మీ నడిచి యానాన్‌ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడే ప్రధాన వైద్యుడిగా మళ్లీ విధులు నిర్వహించడం ప్రారంభించాడు.

ఆ విధంగా విడిపోయిన ఇద్దరు మిత్రులు మళ్లీ కలువనే లేదు. డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ అంతర్జాతీయ శాంతి ఆసుపత్రిలో మొట్టమొదటి డైరెక్టర్‌గా కొట్నీస్‌ బాధ్యతలు స్వీకరించాడు. అక్కడ తన మనోభావాలను డాక్టర్‌ బసుకు ఉత్తర రూపంలో తెలియజేశాడు. క్షణం తీరిక లేకుండా ఉందని, నిఘంటువు అవసరం లేకుండానే చైనా పుస్తకాలు చదువుతున్నానని, శస్త్రచికిత్సలో తన కృషిలో తృప్తిగా ఉందని అందులో రాశాడు.యానాన్‌ రాకముందు విప్లవ పంథా పైన సరైన అవగాహన ఉండేది కాదని, బుర్రలో బూర్జువా భావాలు ఉండేవని, కానీ ఇప్పుడు గణనీయమైన పరివర్తన కలిగిందని రాశాడు. బెతూన్‌ ఆసుపత్రిలోనే చింగ్లాన్‌ ఆయనకు పరిచయం అయింది. ఆమె నర్సింగ్‌ విద్యాలయంలో ఒక ఉపాధ్యాయిని. వారిద్దరూ 1941 నవంబర్‌ 25న వివాహం చేసుకున్నారు. 1942 ఆగస్టు 23న వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి ఇంగ్‌హువా అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్‌ హువా అంటే అర్థం భారత్‌-చైనా అని. ఈ కాలంలోనే వైద్య విద్యార్థులకు శస్త్ర చికిత్స పాఠ్యగ్రంథాన్ని రాయడం ప్రారంభించాడు. 175 పేజీలు రాశాడు.

విశ్రాంతిని మరిచిపోయి నిర్విరామంగా వ్యాధులతో యుద్ధం చేస్తున్న డాక్టర్‌ కొట్నీస్‌కు మలేరియా సోకింది. మళ్లీ మళ్లీ తిరగబెట్టింది. దానికి తోడు మూర్చ పదేపదే రావడం ప్రారంభమైంది. జపాన్‌ దిగ్బంధనం వల్ల అవసరమైన మందులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వందలాది ప్రాణాలను కాపాడిన డాక్టర్‌ కొట్నీస్‌ 1942 డిసెంబర్‌ 9న తుదిశ్వాస విడిచాడు. మరణించేనాటికి కొట్నీస్‌ వయసు 32 సంవత్సరాలు. భారతదేశపుత్రుడు అంతర్జాతీయ దృక్పథంతో ఫ్యాసిస్టు వ్యతిరేక పోరాటంలో చైనా ప్రజల కోసం పోరాడుతూ చివరికి చైనా గ్రామంలోనే ఖననం చేయబడ్డాడు. కొట్నీస్‌ మరణించిన వార్త వారం రోజుల తరువాత డాక్టర్‌ బసుకు తెలిసింది. కానీ, ఆయన దాన్ని మొదట్లో నమ్మలేదు. కానీ నిర్ధారించుకున్న తరువాత 1943 ప్రథమార్థంలో భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. కొట్నీస్‌ ప్రభావం ఎంతగా చైనాను తాకిందంటే 'కొట్నీస్‌ నుండి నేర్చుకోండి' అని చైనా అంతటా ఒక ఉద్యమంగా సాగింది. భారత దేశంలో కూడా కొట్నీస్‌ ఒక వైతాళికుడయ్యాడు. డాక్టర్‌ బసు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు శాంతారామ్‌ 'కొట్నీిస్‌ కి అమర్‌ కహానీ' పేరుతో 1946లో విడుదలైన సినిమా బొంబాయిలో 27 వారాలపాటు ఆడింది. నిజానికి కొట్నీస్‌ జీవితం ఈనాటి యువకులకు ఒక గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. ఆచరణ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి మౌలిక మార్పులు వస్తాయో కొట్నీస్‌ నిరూపించాడు. అంతర్జాతీయ దృక్పథంతో ఇక్కడి ప్రజలకు సేవలందించిన డాక్టర్‌ రామచంద్రారెడ్డి, డాక్టర్‌ శేషారెడ్డి లాంటి వారి ఎందరికో డాక్టర్‌ కొట్నీస్‌ స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. క్యూబా డాక్టర్లు నేటికీ ఈ అంతర్జాతీయతతోనే వివిధ దేశాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. కొట్నీస్‌ శతజయంతి సందేశాన్ని వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

(రచయిత జనవిజ్ఞానవేదికఆరోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్‌)('డాక్టర్‌ కొట్నీస్‌ జీవన జ్వాల' ఆధారంగా...).


  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Saturday, December 11, 2010

బి.ఆర్‌.అంబేద్కర్‌ డా., B.R.Ambedkar Dr.



భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956)బాబాసాహెబ్ అని ప్రసిద్ధి, ధర్మశాస్త్రపండితుడు, భారత ప్రధాన రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, బౌధుడు, తత్వశాస్రవేత, అన్త్రోపోలోజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచేయత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద ధర్మ పునరుద్ధరణకర్త.

భారత రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తేది- 14-04 -1891వ సంవత్సరంలో మహర్‌ సామా జికవర్గానకి చెందిన భీమాబాయి, రాంజీ దంపతులకు జన్మించారు. గ్రామ నామాన్ని బట్టి అంబేద్కర్‌ ఇంటిపేరు ‘అంబావదేకర్‌’. అయితే అంబేద్కర్‌ను ఎంతో ఇష్టపడే తన ఉపాధ్యాయుడు అమిత వాత్సల్యంతో తన ఇంటిపేరు ‘అంబేద్కర్‌’ను ‘అంబావదేకర్‌’ స్థానంలో రాశారు. 1913లో బరోడా మహా రాజు ఉపకారవేతనంతో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. 1915లో అంబేద్కర్‌ రాసిన ‘ఎన్సియెంట్‌ ఇండియన్‌ కామర్స్‌’ అనే వ్యాసానికి ఎం.ఏ డిగ్రీ వరించింది. 1916లో ‘క్యాస్ట్‌‌స అండ్‌ దెయిర్‌ మెకానిజమ్‌, జెనెసిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే అంశంపై ఆంత్రో పాలజీ సెమినార్‌లో పలువురి ప్రశంసలు పొందారు అంబేద్కర్‌. ‘నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా - ఎ హిస్టారికల్‌ అండ్‌ ఎనలిటికల్‌ స్టడీ’ అనే అంశంపై రాసిన పరిశోధనాత్మక గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి డిగ్రీ పొందారు. 1947- 51 మధ్యకాలంలో కేంద్ర మంత్రివర్గంలో న్యాయశాఖామంత్రిగా పనిచేశారు. జీవితాం తం కులనిర్మూలన, అట్టడుగు వర్గాల అభ్యు న్నతి కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన సం ఘసంస్కర్త, దళితజన బాంధవుడు అంబేద్క ర్‌.

తన అమోఘ మేధాశక్తితో రాజ్యాంగాన్ని రచించిన భారత పరిపాలనా వ్యవస్థకు ఒక రూపాన్ని చేకూర్చిన మహనీయుడు. ఆయన సేవలను గుర్తిస్తూ... 1990లో భారత ప్రభు త్వం అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘భారతరత్న’ బిరుదినిచ్చి సత్కరించింది.



పూర్తి వివరాలకు --> అంబేద్కర్ బి.ఆర్.

========================================

Visit my website - > Dr.seshagirirao.com

Monday, November 22, 2010

లాల్ కృష్ణ అద్వానీ, L.K.Advani



లాల్ కృష్ణ అద్వానీ-పార్లమెంటు సభ్యుడు,మాజీ ఉపప్రధాని,మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి ,భారతీయ జనతా పార్టీ మాజీ అద్యక్షుడు


భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. 1980లో భాజపా ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు.

For full details - > Advani L.K in Telugu

========================================
Visit my website - > Dr.seshagirirao.com

Saturday, November 20, 2010

ఎన్‌.జి.రంగా , N G Ranga,ఆచార్య ఎన్‌.జి.రంగా


ఆచార్య ఎన్‌.జి.రంగా : దేశంలో సుదీర్ఘకాలం పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసి, ఎటువంటి పదవి ఆశించకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన తుది శ్వాస విడిచేంత వరకు అవిశ్రాంత పోరాటం జరిపిన మహౌన్నతుడు ఆచార్య ఎన్‌.జి.రంగా, రైతుల పక్షాన చట్టసభలలో తన వాణిని వినిపించి, పాలక పక్షాలు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను గుర్తించే విధంగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన చేనేత కార్మికుల, వ్యవసాయ కూలీల జీవితాలలో వెలుగులు నింపడానికి ఆవిరళ కృషి సల్పారు. దేశంలో రైతాంగ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేలా విశేషంగా ప్రయత్నించారు. దేశంలో తొలిసారిగా వ్యవసాయ రుణాలపై మారటోరియం ప్రకటించడానికి ఆద్యుడు ఎన్‌.జి.రంగానే.

ఆయన నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు 1900 నవంబర్‌ 7వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు గోగినేని రంగనాయకులు. అనంతరం ఎన్‌.జి.రంగాగా సుప్రసిద్ధులయ్యారు. ఇరవై ఏళ్ళ వయస్సులో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాడ్‌ వెళ్ళారు. మూడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రంగా కాంగ్రెసు పార్టీవైపు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది. ఆనంతరం 1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర అధ్యాపకునిగా, అనంతరం మద్రాసు ప్రభుత్వ ఆర్ధిక సలహాదారునిగా కొంత కాలం పనిచేశారు. 1930లో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌లతో సన్నిహితంగా మెలుగుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో విజృంభించారు. 1931లో భూమి శిస్తుకు వ్యతిరేకంగా ఉద్యమించిన రంగాను బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టులకు బెదరని రంగా రైతుల దుర్భర పరిస్ధితులకు వ్యతిరేకంగా రైతు రుణ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ఫలితంగానే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆనాడు రైతుల రుణాలపై మారటోరియంను ప్రకటించింది. అప్పటి నుంచి రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ రంగా ప్రత్యక్షమై ఉద్యమాలను నిర్వహించేవారు. యువతకు రాజకీయాలు నేర్పడానికి పాఠశాలను స్ధాపించిన ఘనత ఆచార్య ఎన్‌.జి.రంగాకే దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఆయన నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి సమర్ధులైన నాయకులను రాజకీయాల్లోకి తేవడమే లక్ష్యంగా 1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధి ప్రారంభించడం విశేషం. రాష్ట్రం, దేశం నుంచి విద్యాలయానికి విచ్చేసి రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్న నాయకులు ఎందరో సమర్ధులైన నాయకులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యే పదవులను చేపట్టి రాణించారు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యుడే. రంగా స్పూర్తితో ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ విద్యాలయాలను నిర్వహించారు. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా రైతుల ప్రతినిధిగా పార్లమెంటులో ప్రవేశించి తమ వాణిని వినిపించారు. అప్పటినుంచి విజయ పరంపర సాగిస్తూ...సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి,గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు. రంగా మరణంతో భారత రాజకీయ వినీలాకాశం నుంచి ఓ ధృవతార రాలిపోయిందని జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నాయకులు తమ సందేశాల్లో కొనియాడటం విశేషం.


========================================
Visit my website - > Dr.seshagirirao.com

సి.పి.బ్రౌన్ , C P brown




సి.పి.బ్రౌన్‌ : 10-11-1798వ సంవత్సరంలో కలకత్తా నగరంలో జన్మించారు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. కలెక్టర్‌కు అసిస్టెంట్‌గా 1820లో కడప చేరుకున్నారు. ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే... తెలుగు సాహిత్యసేవ చేశారు. మహాభారతం శుద్ధ ప్రతి తయారీకి 2000 రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అప్పటికి ఆయన నెల జీతం 500 మత్రమే. 60 వేల అప్పు తెచ్చి వేలాది తెలుగు గ్రంథాలను సేకరించి పండితులచేత పరిష్కరణలు చేయించి అచ్చుకు ప్రతులను సిద్ధం చేయించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు. నిఘంటువులను కూర్చాడు. 36 ఏళ్ళు మనదేశంలో ఉద్యోగం చేసి చివరి దశలో లండన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

బిపిన్‌ చంద్రపాల్ , Bipin Chandra Pal




బిపిన్‌ చంద్రపాల్‌ : 07-11-1858వ సంవత్సరంలో నాటి బెంగాల్‌లోని (నేటి బంగ్లాదేశ్‌) సిల్హట్‌లో జన్మించారు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్‌ చౌక్‌’ అని పిలుస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడిందట. ట్రిబ్యూన్‌, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి. గాంధీజీతో విబేధించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ అనే నాయక త్రయాన్ని ‘లాల్‌, బాల్‌, పాల్‌’ అని సగౌరవంగా పిలిచేవారు.


========================================
Visit my website - > Dr.seshagirirao.com

సర్‌ సి.వి.రామన్‌ , Sir C V Raman




సర్‌ సి.వి.రామన్‌ : తిరుచురాపల్లి సమీపంలో తేది: 07-11-1888వ సంవత్సరంలో జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వం

అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 28-02-1828న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు. ఈ అంశం పై నేచర్‌ పత్రికలో ఆయన ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే గా జరుపుకుంటున్నారు.

For some more information -> C.V.Raman (India)

========================================
Visit my website - > Dr.seshagirirao.com

Friday, November 19, 2010

Acharya Vinoba Bhave,ఆచార్య వినోబా భావే




ఆచార్య వినోబా భావే గా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు.

వినోబా, మహారాష్ట్రలోని గగోదేలో 1895, సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యములో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు.

ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.

for some more details ->ఆచార్య వినోబా భావే

========================================
Visit my website - > Dr.seshagirirao.com

డా వి.శాంతారామ్‌ సినీ దర్శకుడు , Dr.V.Shantaram film director



డా వి.శాంతారామ్‌ జయంతి: మహారాష్టల్రోని కొల్హాపూర్‌కు సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించారు శాంతారామ్‌. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించారు. సుమారు 90 సినిమాలు నిర్మించారు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించారు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచారు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్ర్తీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌ కీ అమర్‌ కహానీ మొ సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించారు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ... 1985లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును బహూకరించింది. అంతేకాక నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన అక్టోబర్‌ 18, 1990వ సంవత్సరంలో మరణించారు

========================================
Visit my website - > Dr.seshagirirao.com

ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్ , Ustad Bismillah khan



ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ జయంతి: నవంబర్‌ 16, 1916వ సంవత్సరంలో బీహార్‌లోని ఓ కుగ్రామంలో జన్మించారు బిస్మిల్లాఖాన్‌. అసలు పేరు అమీరుద్దీన్‌ ఖాన్‌. బెనారస్‌లో స్థిరపడ్డ ఈయన భారతీయ సంగీత సంప్రదాయానికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిపెట్టారు. షెహనాయ్‌ వాద్యానికి ప్రపంచంలో గొప్ప స్థానాన్ని కల్పించారు. పూరీ జగన్నాథాలయంలో, కాశీ విశ్వేశ్వరాలయంలో కచేరీలు నిర్వహించి సర్వమత సమభావనను చాటిచెప్పారు. పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, భారతరత్న వంటి అత్యున్నత పౌరపుర స్కారాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు.

పూర్తి వివరాలకోసం -- వికీపిడియాలో చూడండి .....ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్ (Ustad Bismillah khan)
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Sunday, September 5, 2010

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ , Sarvepalli Radhakrishnan



పేదింట్లో పుట్టిన పిల్లాడు... చదువే లోకంగా ఎదిగాడు... పెద్దయ్యాక విద్యావ్యవస్థకే... మెరుగులు దిద్దాడు... ప్రపంచం మెచ్చిన విద్యావేత్తగా పేరొందాడు... అతడే సర్వేపల్లి రాధాకృష్ణన్‌!

ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవమని మీకు తెలుసు. మన మొదటి ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజునే ఇలా 'టీచర్స్‌ డే'గా చేసుకుంటామనీ తెలుసు. మరి ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయుల దినోత్సవంగా ఎందుకు చేసుకోవాలి? ఆయన గొప్పతనమేంటి? తెలుసుకుందాం రండి.

చెన్నై దగ్గర తిరుత్తణి అనే చిన్న వూరిలో 1888 సెప్టెంబర్‌ 5న పుట్టిన రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. తిరుపతిలోని జర్మన్‌ మిషనరీ స్కూల్లో మొదలైన విద్యాభ్యాసం ఆపై ఉపకార వేతనాలతోనే సాగింది. మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తి చేసిన రాధాకృష్ణన్‌, ఇరవై ఏళ్ల చిన్న వయసులోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన వ్యక్తిత్వం, బోధన శైలి విద్యార్థులపై చెరగని ముద్ర వేసేవి. కళాశాల గ్రంథాలయంలోని దేశ, విదేశీ తత్వ గ్రంథాలన్నీ చదువుతూ విలువైన వ్యాసాలను, పరిశోధన పత్రాలను రాసేవారు.

ఆయన 1918లో యూనివర్శిటీ ఆఫ్‌ మైసూర్‌లోను, 1921లో కోల్‌కతా యూనివర్శిటీలోను ప్రొఫెసర్‌ పదవులు నిర్వహించారు. ఆయన రాసిన 'ఇండియన్‌ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీలో ప్రసంగాలు చేసిన ప్రతిభ ఆయనది. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్శిటీల్లో వైస్‌ఛాన్స్‌లర్‌గా పనిచేసిన ఆయన యునెస్కో, సోవియట్‌ యూనియన్‌లకు రాయబారిగా వ్యవహరించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌'లో సభ్యుడిగా మన దేశ విద్యా వ్యవస్థ మెరుగుదలకు ఎన్నో విలువైన సూచనలు చేశారు. 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో మన రెండో రాష్ట్రపతిగా పదవిని చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయనను 1954లో భారతరత్నతో గౌరవించింది.

ఏ పదవిలో ఉన్నా నిరాడంబరంగా ఉండేవారు. రాష్ట్రపతిగా తన కొచ్చే జీతం పది వేల రూపాయల్లో కేవలం 2,500 తప్ప మిగతాదంతా ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేవారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన పుట్టిన రోజును వేడుకగా నిర్వహిస్తామని అభిమానులు కోరితే, ఆ రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా గుర్తించాలంటూ ఆయన సూచించారు.

For full Story -- Sarvepalli Radhakrishnan
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Thursday, August 26, 2010

అశ్వినీ నాచప్ప , Aswini Naachappa



పరుగుల రాణి పీటీ ఉషతో సమానంగా మెరిసిన భారతీయ క్రీడా ఆణిముత్యం.. అశ్వినీ నాచప్ప. అశ్విని, ఆదర్శం... వంటి సందేశాత్మక చిత్రాలతోనూ తెలుగు వారికి సుపరిచితురాలైన ఆమె ఇప్పుడేం చేస్తోందో తెలుసా? మెరికల్లాంటి సుశిక్షితులయిన క్రీడాకారులను తీర్చిదిద్దుతూనే... క్రీడా రంగంలో మహిళల వేధింపులకు... నానాటికీ పెచ్చుమీరుతోన్న అవినీతి పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పింది. సీఎస్‌ఐ పేరుతో ఒక సంస్థను ఆరంభించి... ప్రముఖ క్రీడాకారులను కూడగట్టి ఉద్యమం బాట పట్టింది. ఆమెతో వసుంధర ముచ్చటించింది.

మైదానంలో అశ్విని ఒక సంచలనం.. పరుగుల బరిలో, మెరుపు వేగంతో చిరుతపులిలా ఆమె లక్ష్యాన్ని అధిగమించే తీరు క్రీడాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. చిరస్మరణీయమైన విజయాలు సాధించిన అశ్వని పదేళ్ల క్రితమే మైదానానికి స్వస్తి చెప్పింది. వివాహం చేసుకొని కర్ణాటక స్విట్జర్లాండ్‌గా పేరొందిన కొడగు జిల్లాలో స్థిరపడింది.

పంతులమ్మగా ఆటలు, పాఠాలు..
పల్లె సీమలు, ప్రకృతి రమణీయత అంటే ప్రాణం పెట్టే ఆమె పరుగుల పోటీలను వీడాక ఏం చేస్తోందీ అంటే 'సినిమాల్లో నటించమని, చిన్నతెరపై కనిపించమని చాలా అవకాశాలు వచ్చాయి. కోచ్‌గా పని చేయమంటూ కొన్ని క్రీడా సంస్థలు అడిగాయి. కానీ వాటిపైకి నా మనసు పోలేదు. నేను కొడగు జిల్లాలోని గోణికొప్ప అనే చిన్న గ్రామంలో పెరిగాను. అక్కడ విద్య, ఆరోగ్య వసతుల్లేవు. అక్కడ ఉంటూ పల్లె ప్రజలకు సేవ చేయాలనుకున్నా. అందుకే అక్కడ ఓ స్కూలు ఆరంభించా. పాఠాలతో పాటూ... ఆటల్లోనూ శిక్షణనిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. అశ్విని నిర్వహిస్తున్న పాఠశాలలో అరవై శాతం స్థానికులకే చదువుకునే అవకాశం. ప్రస్తుతం 560 మంది విద్యార్థులు అక్కడ చదువుకొంటున్నారు.

ఆటల దిశగా ప్రోత్సాహం...
క్రీడా రంగాన్ని వీడాక అశ్విని తనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పర్చుకుంది. 'అవును, మా వారు వ్యాపార వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. మాకు ఇద్దరమ్మాయిలు. వారి ఆలనాపాలన, చదువులు, ఆసక్తులు నేను బాధ్యతగా చూస్తాను. అవికాక స్కూలు నిర్వహణ ఉండనే ఉంది. అయితే ఒకటి, చుట్టుపక్కల గ్రామాల్లో, పాఠశాలల్లో పిల్లల్ని క్రీడల దిశగా ప్రోత్సహించే ప్రతి కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొనేదాన్ని' అంటూ వివరించారు.
అవినీతికి వ్యతిరేకంగా...
రాజకీయాల్లో మితిమీరుతోన్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం గురించి విన్నప్పుడల్లా అశ్విని బాధపడేది. 'కేంద్ర క్రీడా శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్‌ అధికారి బీపీవీ రావు, నేను క్రీడల్లో అవినీతి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ప్రతిసారీ సమస్యలు చర్చించడమే కానీ పరిష్కారం కోసం చిన్న ప్రయత్నం చేసిన వారు కనబడలేదు. నువ్వే అందుకు ముందుకు రావొచ్చు కదా అని ఆయన చాలాసార్లు అన్నారు. ఎంతో ఆలోచించిన మీదట అడుగు ముందుకేశాను. రెండు నెలల క్రితం క్లీన్‌స్పోర్ట్స్‌ ఇండియా (సీఎస్‌ఐ)ను ఆరంభించాను' అని తెలిపారు.

మట్టిలో మాణిక్యాల గుర్తింపు..
సాఫీగా కనిపించే ట్రాక్‌ మీద పరుగు తీసి, పతకాలు సంపాదించడం పేరు. క్రీడా సంఘాల్లోని మహామహుల్ని ఢీకొంటూ ముళ్లబాటలో నడుస్తూ, సంకల్ప సాధనకు కృషి చేయడం వేరు. 'నేను సాధించాలనుకున్న లక్ష్యాలపై స్పష్టత ఉంది. అందుకే నాలాంటి భావాలున్న హాకీ ఆటగాడు పర్గత్‌సింగ్‌, వందనారావు, రీతూ అబ్రహాం, పంకజ్‌ అద్వానీ వంటి క్రీడాకారుల మద్దతు కూడగట్టాను. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడా కుసుమాలను తయారుచేసేందుకు అశ్వినీ ఫౌండేషన్‌ను ఆరంభించాను. క్రీడల్లో అవినీతిని కడిగేస్తూ, మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరసిస్తూ, రాజకీయ ప్రమేయాన్ని నిలదీసేందుకు క్లీన్‌స్పోర్ట్స్‌ ఉద్యమాన్ని చేపట్టాను. మహిళలపై వేధింపులు, ప్రతిభావంతులైన వారిని పట్టించుకోకపోవడం వంటి సంఘటనలనూ మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం' అనే అశ్విని రాజకీయ నాయకుల ప్రమేయాన్ని తగ్గించి క్రీడా సంఘాల నాయకత్వ బాధ్యలని ఆటగాళ్లకు అప్పగించాలి అంటున్నారు. ఆ స్ఫూర్తిని పంచేందుకు ఈ నెలాఖరులో భారీ ఎత్తున మారథాన్‌ను నిర్వహిస్తున్నారు.

ఇద్దరమ్మాయిలు క్రీడాకారిణులే...
హంగూ ఆర్భాటాల కన్నా క్రీడాప్రమాణాల పెరుగుదలకు ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆమె ప్రస్తుతం 32 మంది అథ్లెట్లకు శిక్షణనిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహిస్తే ఆరోగ్యం, ఆనందం... బాగా రాణిస్తే పేరు, ఉద్యోగం వస్తాయనే ఆమె తన ఇద్దరమ్మాయిల క్రీడాసక్తుల్ని గమనించి భుజం తడుతున్నారు. పదో తరగతి చదువుతున్న పెద్దమ్మాయి అమీషా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. ఆరో తరగతి చదువుతున్న రెండో కుమార్తె దీపాలి గోల్ఫ్‌ సాధన చేస్తోంది.
- ఆదినారాయణ, న్యూస్‌టుడే, బెంగళూరు




========================================

Visit my website - > Dr.seshagirirao.com

Wednesday, August 25, 2010

మదర్‌ థెరిస్సా , Mother Teresa



మదర్‌ థెరిస్సా శతజయంతి-2010 August 26.
కోల్‌కతా: విశ్వమాత మథర్‌ థెరిస్సా శతజయంతి నేడు. పేదలకు ప్రేమను పంచిన ఆ అమృత మూర్తి 1910 ఆగస్టు 26న అల్బేనియాలో జన్మించారు. సేవే మార్గంగా సాగిన ఆమె తన జీవితాన్ని అభాగ్యులకు అంకితం చేశారు. ఆమె నిస్వార్థ సేవను అనేక దేశాలు, ప్రభుత్వాలు, సంస్థలు ఎంతగానో కొనియాడాయి. ఆమె సేవకు గుర్తింపుగా 1979లో నోబెల్‌ శాంతి బహుమతి, 1980లో భారతరత్న లభించాయి. ప్రశంసలతోపాటు మదర్‌ విమర్శలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక కష్టాలను ఎదుర్కొని నిర్భాగ్యులకు తమ ఆపన్న హస్తాన్ని అందించారు. 1997 సెప్టెంబర్‌ 5న ఆ మాతృమూర్తి కన్నుమూశారు. ఆమె మరణానంతరం పోప్‌ ఆమెను సెయింట్‌హుడ్‌ హోదాతో గౌరవించారు



full details - > Mother teresa in wikipedia.org/
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Sunday, June 27, 2010

కృష్ణమ్మాళ్ , Krushnammal









'అన్యాయం' అన్న మాట వినిపిస్తే చాలు... ఆ మసకబారినకళ్లు ఎర్రబడతాయి. తడబడే అడుగులు వడివడి అవుతాయి. వూతకర్ర ఆయుధమై లేస్తుంది. జనాలూ ఉద్యమాలే వూపిరిగా బతుకుతున్న కృష్ణమ్మాళ్‌ జీవితం సాహసాల సమాహారం. ఆ పోరాటయోధురాలికి ఎనభైనాలుగేళ్ల వయసు ఓ లెక్కే కాదు.
ఆ రోజు క్రిస్‌మస్‌.
మనుషుల కోసం పుట్టి, మనుషుల కోసం జీవించి, మనుషుల కోసం మరణించి, మళ్లీ మనుషుల కోసం బతికొచ్చిన మహనీయుని జన్మదినం. దూరంగా చర్చిలో పాస్టరు క్రీస్తుసందేశాన్ని బోధిస్తున్నాడు.

ప్రేమ...శాంతి...కరుణ. ఈ మూడు మాటల్లోనే జీసస్‌ జీవితసారమంతా ఉంది.

'మనం నిజంగా క్రీస్తు సందేశాన్ని అర్థంచేసుకున్నామా? ఆయన మార్గంలోనే నడుస్తున్నామా? నడిస్తే ఇన్ని ఘోరాలెందుకు జరుగుతాయి? మనుషులింత ఆటవికంగా ఎందుకు ప్రవర్తిస్తారు?'... ఆలోచించినకొద్దీ ఆ దుశ్చర్యను తలుచుకున్నకొద్దీ కృష్ణమ్మాళ్‌లో ఆవేశం కట్టలు తెంచుకుంది.

తంజావూరు జిల్లాలోని కిల్వెన్మణిలో నలభైనాలుగుమంది దళితుల్ని వూచకోత కోశారు. ఎంత అమానుషం!

ఒకటి...రెండు...మూడు...నలభైమూడు...

ఆ దళితులు ఏడ్చారు. కాళ్లుపట్టుకున్నారు. ప్రాణాలు తీయెుద్దని బతిమాలారు. అయినా వినలేదా కసాయి సైన్యం. భూస్వాములు పెంచిపోషించిన రాకాసి మూకలకు బలహీనుల ప్రాణాలతో ఆడుకోవడమంటే మహాసరదా!

నలభైనాలుగు...
వరుసలో చివరగా, నెలల పసికందు!
ఆకలో, అమ్మలేదన్న బెంగో...గుక్కపెట్టి ఏడుస్తోంది. ఓ రాక్షసుడు నిర్దాక్షిణ్యంగా పసిగుడ్డు గుండెల్లో పిడిబాకు దించాడు. చిన్నారి గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది. అంతటితో ఆగలేదా దుర్మార్గం. అలానే, ఆ కత్తివెునని చెట్టుకొమ్మకి గుచ్చేశాడు. బిడ్డశవం బొమ్మలా వేలాడుతుంటే... అంతా పడీపడీ నవ్వారు!

పైశాచికానందానికి పరాకాష్ఠ!

కష్టానికి తగిన కూలీ అడగటమే ఆ దళితులు చేసిన నేరం. భూస్వాములు ఆగ్రహంతో వూగిపోయారు. పిశాచాల దండుతో దళితవాడ మీద దండెత్తారు.
కృష్ణమ్మాళ్‌ ఆ సమయానికి జయప్రకాశ్‌ నారాయణ్‌తో కలిసి పాదయాత్రలు చేస్తున్నారు. వూచకోత గురించి వినగానే, ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఆ అమాయకుల పరిస్థితి గుర్తొచ్చి కన్నీళ్లు పొంగుకొచ్చాయి. వెంటనే వెళ్లాలి. బాధితులకు ధైర్యం చెప్పాలి. ఆత్మవిశ్వాసం నింపాలి. పోరాడటం నేర్పాలి.

చిమ్మ చీకట్లో బయల్దేరారు. చేతిలో దీపంలేదు. తోడుగా ఎవరూ లేరు. రెండువందల కిలోమీటర్ల ప్రయాణం. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్న రోజులు. బస్సులో ప్రయాణించారు. డొంకల దార్లో నడిచారు. ఏటికి ఎదురీదారు.
ఆ చీకటి ప్రయాణం, ఆమె జీవితయాత్రలో గొప్ప మలుపు! ఎవరో చేతులుచాచి రారమ్మని పిలుస్తున్నట్టు, ఏవో గొంతుకలు కాపాడమని వేడుకుంటున్నట్టు... ఆమె వడివడిగా అడుగులువేశారు. 'అది దేవుడిచ్చిన పిలుపు'... అంటారు కృష్ణమ్మాళ్‌ నలభైరెండేళ్ల నాటి సంఘటనను తలుచుకుని.

తరాలుగా నేలను నమ్ముకుని బతుకుతున్న నిరుపేదల నోట్లో మట్టికొడుతున్నారు భూస్వాములు. కష్టం దళితులది. పంట పెత్తందార్లది. ఎన్నితరాలని సహిస్తారు. ఎంత ఆకలని భరిస్తారు. నోరుతెరిచారు. శ్రమకు తగిన వేతనం అడిగారు. భూస్వాములు ఆ ధైర్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. వూచకోతతో కడుపుమంట చల్లార్చుకున్నారు.

దున్నేవాడికి భూమే దన్ను. ఆస్తయినా, ఆయుధమైనా, ఆత్మవిశ్వాసమైనా పిడికెడు మట్టే! 'భూస్వాముల కబంధహస్తాల నుంచి నేలతల్లికి విముక్తి కల్పించేదాకా నేను నిద్రపోను'.. కృష్ణమ్మాళ్‌ మాటలు వాళ్లకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. భూస్వాములు వూరుకుంటారా? ఆమెను బెదిరించారు. అరెస్టు చేయించారు. చంపాలని కుట్రపన్నారు. కృష్ణమ్మాళ్‌ భయపడలేదు. ఆమెది గాంధేయమార్గం. హర్తాళ్లతో నిరసన తెలిపారు. భజనలతో హితవు చెప్పారు.

ఆ పోరు హోరెత్తింది. ప్రభుత్వమే దిగొచ్చింది. పన్నెండువందల ఎకరాల దేవుడిమాన్యం దరిద్రనారాయణులకు దక్కింది. ఆ నేలను దుక్కిదున్నింది వాళ్లే. నారు పోసింది వాళ్లే. నీరు కట్టింది వాళ్లే. కృష్ణమ్మాళ్‌ చొరవతో కష్టఫలం కూడా వాళ్లదే ఇపుడు. ఆ ఉద్యమ సారథి కృష్ణమ్మాళ్‌ కూడా దళిత కుటుంబం నుంచే వచ్చారు. బాల్యంలో లెక్కలేనంత వివక్ష అనుభవించారు.

అనుభవాలే పాఠాలు
కృష్ణమ్మాళ్‌ పట్టివీరన్‌పట్టి అనే కుగ్రామంలో పుట్టారు. ఆ చిన్నారి పుస్తకాల సంచి భుజానికేసుకుని బడికెళ్తుంటే పల్లెపల్లెంతా కళ్లింతలు చేసుకుని చూసేది. ఓ ఆడపిల్ల, అదీ దళితవాడ అమ్మాయి చదువుకోవడమంటే ఓ విడ్డూరం. ఓ సాహసం. ఆ అనుమానపు చూపులమధ్య, ఆ అవమానపు మాటలమధ్య... కృష్ణమ్మాళ్‌ చదువులు కొనసాగించింది. బాల్యంలోనే తండ్రిపోయాడు. ఉన్నప్పుడూ కుటుంబాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యానికి కట్టుబానిసై, తాగితాగి చచ్చిపోయాడు. బాధ్యతంతా అమ్మ నాగమ్మాళ్‌దే. పన్నెండుమంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఏడుగురు బతికి బట్టకట్టారు. వారిలో కృష్ణమ్మాళ్‌ ఒకరు. ఆ తల్లికి విశ్రాంతి తెలియదు. అలసట తెలియదు. తెల్లారేలోపు పనికెళ్లిపోయేది. చీకటిపడ్డాక చెమటలు కక్కుతూ తిరిగొచ్చేది. అంతమంది పిల్లలకు వండివార్చి తినిపించేసరికి అర్ధరాత్రి దాటేది. అంతకష్టపడినా అర్ధాకలే. భూస్వాములు ఇచ్చే చాలీచాలని కూలీతో సర్దుకుపోవాలి. కొన్నిసార్లు అదీ లేదు. ఎదురుతిరిగే ధైర్యం ఎవరికీ లేదు.
అట్టడుగు జాతి. అందులోనూ మహిళ. సమాజంలో ఎన్ని అవమానాలు భరించాలో అన్నీ భరించారు కృష్ణమ్మాళ్‌. చెప్పులు వేసుకోడానికి వీల్లేదు. మంచినీళ్ల బావిని తాకడానికి వీల్లేదు. అగ్రవర్ణాల వీధిలో తలెత్తుకు తిరగడానికి వీల్లేదు. ఈడుపిల్లలతో ఆడుకోడానికి వీల్లేదు. ఆ దుర్భర పేదరికం, నికృష్టమైన సామాజిక పరిస్థితులు...కృష్ణమ్మాళ్‌కు జీవితమంటే ఏమిటో నేర్పాయి.
సొంతూళ్లో ప్రాథమిక పాఠశాలవరకే ఉంది. పైచదువులకు మధురై వెళ్లాలి. ఆడపిల్లని అంతదూరం ఎలా పంపిస్తారు. పంపినా, చదివించే స్థోమత ఉండొద్దూ! అన్నయ్య ప్రోత్సహించాడు. 'చెల్లీ! నీకు తోడుగా నేనుంటా' అని ధైర్యం చెప్పాడు. ఆమాత్రం బాసట చాలు. తను దూసుకుపోగలదు. ఆ వూళ్లో పెద్దచదువులకు పట్నందాకా వెళ్లిన తొలిదళిత బాలిక కృష్ణమ్మాళే! ఆమె చదువుతున్న స్కూల్లో ఓ టీచరు సాహిత్య ప్రియుడు. ఆమెకు గొప్పగొప్ప తమిళ గ్రంథాలను పరిచయం చేశాడు. ప్రపంచాన్ని చూడ్డానికి అక్షరాన్ని మించిన గవాక్షం ఏముంటుంది? 'చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. అమ్మ కష్టం తప్పించాలి... అనుకునేదాన్ని. గొప్పగొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలూ ఆత్మకథలూ చదివేకొద్దీ నా ఆలోచన మరింత విశాలమైంది. దున్నుకోడానికి జానెడు భూమి, తలదాచుకోడానికి కాసింత జాగా లేని ఎంతోమంది అమ్మలు నా కళ్లముందు కనిపించారు. వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నది నా ఆశయమైంది'... ఒక సాధారణ బాలిక, ఉద్యమనేతగా ఎదగడానికి ఈ ఆలోచనలే బీజం వేశాయి.

కృష్ణమ్మాళ్‌ వ్యక్తిత్వం మీదా నిరాడంబరమైన జీవనశైలి మీదా మడమతిప్పని సిద్ధాంతశక్తి మీదా ప్రభావం చూపిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. తమిళకవి రామలింగ వల్లలార్‌ బోధనలు ఆమెకు మానవతా పాఠాలు నేర్పాయి. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన సుందర రామచంద్రన్‌ అమ్మలా అభిమానించారు. కృష్ణమ్మాళ్‌లోని ఆత్మవిశ్వాసం ఆమెకు బాగా నచ్చింది. ఓసారి ప్రార్థన సమావేశంలో మహాత్ముడి పక్కనే కూర్చున్న కృష్ణమ్మాళ్‌ను చూపిస్తూ 'ఆ అమ్మాయి ఎవరు?' అనడిగారట రాజాజీ. 'నా కూతురే..' అని చెప్పారు సుందర రామచంద్రన్‌. అంత ప్రేమ! పైచదువుల ఖర్చంతా తనే భరించారు.

మహాత్ముడి మాటలూ జీవనవిధానమూ కృష్ణమ్మాళ్‌ను ఎంతగా ప్రభావితం చేశాయంటే, ఆ మరుక్షణం నుంచే గాంధేయవాదిగా మారిపోయారు. మహాత్ముడు కోరుకున్న గ్రామస్వరాజ్యం రావాలంటే, దున్నేవాడిదే భూమి కావాలి. నేల ఒకరిదీ, శ్రమ ఒకరిదీ అయితే...అది రామరాజ్యం అనిపించుకోదని ఆమె అభిప్రాయం. భూమి విషయంలో తన భావాలకూ వినోబా ఆలోచనలకూ సారూప్యం ఉన్నట్టు అనిపించేది. అందుకే, తొలిపరిచయంలోనే శిష్యురాలు అయ్యారు. చదువైపోగానే భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడే, జగన్నాథన్‌ పరిచయం. ఆమె జీవితం మీద భర్తగానే కాదు, తోటి ఉద్యమనేతగా కూడా ఆయన ప్రభావం ఉంది. జగన్నాథన్‌ మహాత్ముని సహాయనిరాకరణోద్యమం స్ఫూర్తితో కాలేజీ మానేశారు. 'క్విట్‌ ఇండియా' సమయంలో మూడున్నరేళ్లు జైలులో ఉన్నారు. ఇద్దరివీ వేరువేరు నేపథ్యాలు. ఆయనది అగ్రవర్ణం. ఆమె దళిత మహిళ. అతను సంపన్నుడు. ఆమె నిరుపేద. స్నేహం బలపడటానికి ఆ తేడాలేం అడ్డుకాలేదు. ముందుగా పెళ్లిప్రస్తావన తెచ్చింది జగన్నాథనే. కృష్ణమ్మాళ్‌కు ఆయనంటే అపారమైన గౌరవం. పెళ్లి ఆలోచన మాత్రం లేదు. పెద్దల మాటకు విలువిచ్చి సరేనన్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు... భూమికుమారి, సత్యాగ్రహ. 'మేం మీకు ఆస్తిపాస్తులేం ఇవ్వలేం. కానీ ప్రపంచమంతా బంధువుల్నిస్తాం. ఆత్మీయుల్ని సంపాదించిపెడతాం' అని చెప్పేవారు కృష్ణమ్మాళ్‌ తన పిల్లలకి. కాపురానికి అడుగుపెట్టిన రోజే రామచంద్రన్‌ ఆమెకో మాట చెప్పారు... 'మనకు ఇళ్లూ ఆస్తులూ వద్దు. ఖరీదైన గృహోపకరణాలూ వద్దు. మట్టి పాత్రలు చాలు. ఆ జంజాటాలేవీ లేకపోతేనే మనం నిమిషాల్లో బయల్దేరి ఎక్కడికైనా వెళ్లగలం. పేదలకు సాయం చేయగలం'. కృష్ణమ్మాళ్‌ మనసులోని మాట కూడా అదే.
స్వాతంత్య్రం వచ్చాక, ఇద్దరూ వినోబా భూదానోద్యమంలో పాల్గొన్నారు. పద్నాలుగేళ్ల పాటూ దేశమంతా తిరిగారు. సత్యాగ్రహాలు చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా వేల ఎకరాల భూమి పేదల చేతికి వచ్చింది. కిల్వెన్మణి దళితుల వూచకోత సంఘటనతో...కృష్ణమ్మాళ్‌ ఆ ప్రాంతాన్ని తన ఉద్యమ కేంద్రంగా మలుచుకున్నారు. అలా అని ఆ ఒక్క చోటికే పరిమితం కాలేదు. ఎక్కడ తన అవసరం ఉన్నా.. రెక్కలు కట్టుకుని వాలేవారు.
జయప్రకాశ్‌ నారాయణ్‌ 'పరిపూర్ణ విప్లవం'లోనూ పాల్గొన్నారామె. బుద్ధగయ మఠానికి చెందిన రెండువేల నాలుగువందల ఎకరాల భూమి మహంతుల చేతుల్లో చిక్కుకుంది. అక్కడ లైంగిక దోపిడీ కూడా జరుగుతున్నట్టు కృష్ణమ్మాళ్‌ దృష్టికి వచ్చింది. మహంతుల అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే ముందుగా మహిళల్ని సంఘటితం చేయాలి. ఆ పనే చేశారామె. ఆతర్వాత దీక్షలు ప్రారంభించారు. తొలిరోజే ఉద్యమకారుల మీద రాళ్ల వర్షం కురిసింది. జయప్రకాశ్‌ నారాయణ్‌నూ వదల్లేదు. పోలీసులు కృష్ణమ్మాళ్‌ మీద తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేయడానికి వచ్చారు. ఆమె ఎలాగోలా తప్పించుకున్నారు. ఆ సమయంలో జేపీ ఉద్యమాన్ని కొనసాగించారు. సమస్య సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఆ భూముల్ని నిరుపేదలకు పంచాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. భూమి కోసం జరిగినా, భుక్తి కోసం జరిగినా...ఏ ఉద్యమాన్నయినా ఆమె ప్రజాభాగస్వామ్యంతోనే నిర్వహించారు. ప్రజాచైతన్యమే ముఖ్యమని భావించారు.

లాఫ్టీ బాసట...
పండినా పండకపోయినా భూమి భూమే. ఎంతోకొంత డబ్బు చెల్లించకపోతే భూస్వామి మాత్రం ఎందుకు వదులుకుంటాడు? వదులుకున్నా అది ఎందుకూ పనికిరాని చౌడునేల కావచ్చు. వినోబా ఉద్యమంలో ఎదురైన అనుభవాలు ఆమెకు బాగా గుర్తున్నాయి. అందుకే కృష్ణమ్మాళ్‌...భూస్వామినీ భూమిలేని నిరుపేదల్నీ ఒకచోటికి రప్పించి, గిట్టుబాటు ధర నిర్ణయించే ప్రయత్నం చేయాలనుకున్నారు. ఆ లక్ష్యంతో ప్రారంభించిన సంస్థే లాఫ్టీ (లాండ్‌ ఫర్‌ ద టిల్లర్స్‌ ఫ్రీడమ్‌). నాగపట్నం జిల్లాలోని కుత్తూర్‌ కేంద్రంగా పనిచేస్తోంది. భూములు కొనుగోలు చేయడానికి లాఫ్టీ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. పంట చేతికొచ్చాక రైతులు వాయిదాల్లో తీరుస్తారు. ఏ తాగుడుకో బానిసైపోయి వ్యసనాల కోసం కుదువపెట్టకుండా...భూమిని మహిళల పేరిట రాస్తారు. ఆ ప్రయత్నంలో కృష్ణమ్మాళ్‌ చాలా అవరోధాలు ఎదుర్కొన్నారు. అప్పులివ్వడం కుదరదని బ్యాంకులు చేతులెత్తేశాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తడిసి వోపెడయ్యేవి. దీంతో బడుగురైతు భయపడిపోయాడు. కృష్ణమ్మాళ్‌ గాంధేయ మార్గంలిో ప్రభుత్వాన్ని కదిలించారు. రిజిస్ట్రేషన్‌ ఖర్చులు చాలావరకు తగ్గాయి. బ్యాంకులు కూడా దారికొచ్చాయి. ఈ ముప్ఫై ఏళ్లలో దళిత మహిళలు దాదాపు పదమూడు వేల ఎకరాలకు యజమానులయ్యారు. మరో పదకొండువేల ఎకరాలు వారి సొంతం కాబోతున్నాయి. నిరుపేద దళితులు బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేరన్న అధికారుల అంచనాలు తారుమారు అయ్యాయి. నూటికి నూరుశాతంమంది స్వచ్ఛందంగా రుణాలు తీర్చేశారు. సాక్షాత్తు సర్వోదయ మిత్రులే ఉద్యమం హింసామార్గం పడుతుందేవో అని భయపడ్డారు. కృష్ణమ్మాళ్‌ ఎక్కడా ఆ అవకాశం ఇవ్వలేదు. వామపక్షవాదుల తుపాకీ వోతలకు కూడా భయపడని భూస్వాములు, కృష్ణమ్మాళ్‌ అహింసా మార్గానికి తలవంచారు.

లాఫ్టీ సామాజిక సేవలోనూ ముందుంది. గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. కార్పెట్‌ తయారీ, చాపల అల్లకం వంటి చేతిపనుల్లో దళితులకు శిక్షణ ఇస్తోంది. కంప్యూటర్‌ కోర్సుల్లో తరగతులు నిర్వహిస్తోంది. వల్లివలన్‌లో మూడు హాస్టళ్లు నడుపుతోంది. అక్కడ చదువుకున్న విద్యార్థులు డాక్టర్లూ ఇంజినీర్లూ అవుతున్నారు. కరవులు, తుపాన్లు వంటి ప్రకృతి బీభత్సాలు ఎదురైనప్పుడు ప్రజలకు అండగా నిలబడుతోంది. 'ఫ్రెండ్స్‌ ఆఫ్‌ లాఫ్టీ' పేరుతో ఏర్పాటైన శ్రేయోభిలాషుల సంఘంలో ప్రపంచ వ్యాప్తంగా సభ్యులున్నారు. వాళ్లంతా కృష్ణమ్మళ్‌ ఉద్యమానికి వూతంగా నిలుస్తున్నారు. కృష్ణమ్మాళ్‌ సముద్రాన్ని కలుషితం చేస్తున్న బహుళజాతి సంస్థల మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఓసారి పెత్తందార్లు పురమాయించిన కిరాయి హంతకులు ఆమె ఒంటిమీద కిరోసిన్‌పోసి తగులబెట్టాలని చూశారు. 'మీరేం చేస్తారో చేసుకోండి...' అని హూంకరించి, యోగముద్రలోకి వెళ్లిపోయారామె. అగ్గిపుల్ల వెలిగించడానికి కూడా వాళ్లకు ధైర్యం చాల్లేదు. తోకముడుచుకుని వెళ్లిపోయారు.

అందరికీ ఇళ్లు!
ఏ అవార్డు అందుకోడానికి వెళ్లినా ఏ అంతర్జాతీయ సదస్సుకు హాజరైనా ఆమె చేతిలో ఓ ఇటుక ఉంటుంది. అందరికీ ఆ కథేమిటో చెబుతారు. వూరిచివర పూరిగుడిసెల కష్టాలు వివరిస్తారు. కృష్ణమ్మాళ్‌ బాల్యం అలాంటి పాకలోనే గడిచింది. వానాకాలం వస్తే ఇల్లంతా జల్లెడవుతుంది. తలదాచుకోడానికి చోటుండదు. పెనుదుమారం రేగిందంటే పైకప్పు గాలిపటమై ఎగిరిపోతుంది. నిరుపేద బతుకులు వీధులపాలు అవుతాయి. వేసవిలో అయితే అగ్నిప్రమాదాల భయం. తేడావస్తే, వాడవాడంతా బూడిదైపోతుంది. అసలా ఇరుకిరుకు జీవితమే నరకం. హుందాగా భద్రంగా బతకడానికి ప్రతి దళిత కుటుంబానికీ ఓ ఇల్లంటూ అవసరం. అందుకే, కృష్ణమ్మాళ్‌ వూరిచివరి బతుకులకు వెచ్చని నీడ అందించే ప్రయత్నం వెుదలుపెట్టారు. నిజానికి ఆ నిరుపేదలు పూరిపాకలు వేసుకున్న జానెడు జాగా కూడా వాళ్లది కాదు. ఏ సర్కారు భూవో అయి ఉంటుంది. పెత్తందార్లకు ఆగ్రహం వస్తే ఆ కాస్త నీడా చేజారిపోతుంది. బుల్‌డోజర్లు గుండెల మీద నుంచి వెళ్తాయి. కృష్ణమ్మాళ్‌ చొరవతో.. దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాల మీద వారికే హక్కులు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇళ్లు కట్టుకోవడమే తరువాయి. అందుకు అవసరమైన ఇటుకల తయారీకి కుత్తూర్‌లో ఓ కార్ఖానా ప్రారంభించారు. చమురు, సహజవాయువుల సంస్థ(వోఎన్‌జీసీ) యంత్రాల్ని ఇచ్చింది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఇటుకల తయారీకి పారిశ్రామిక వ్యర్థాల్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాంతోనే పర్యావరణానికి నష్టంకాని పద్ధతుల్లో అక్కడ ఇటుకలు తయారుచేస్తున్నారు. తొలి ఇటుక...పెనుమార్పుకు సూచిక! అందుకే కృష్ణమ్మాళ్‌ దాన్ని అందరికీ చూపిస్తారు.

గృహనిర్మాణంలో ఇంటికొకరు పాలుపంచుకుంటారు. 'ప్రతి మహిళకూ ఓ ఇల్లు ఉండాలన్నది నా లక్ష్యం. ఇప్పటికే రెండువేల గృహాలు సిద్ధమైపోయాయి. ఇంకో ఐదువేలు నిర్మించబోతున్నాం'...కృష్ణమ్మాళ్‌ కల నిజం కాబోతుంది. ప్రత్యామ్నాయ నోబెల్‌గా పేరున్న 'రైట్‌ లైవ్‌లీహుడ్‌ అవార్డు' విజేతగా మూడులక్షల అమెరికన్‌ డాలర్లలో తనవాటా వెుత్తాన్ని కూడా ఆమె గృహనిర్మాణాలకే కేటాయించారు. త్వరలో తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం జిల్లాల్లో దళితవాడల రూపురేఖలు మారిపోతున్నాయి.
* * *
మూడేళ్ల క్రితం జరిగిందీ సంఘటన.
కిల్వెన్మణి ఘోరకలికి కారణమైన భూస్వాముల కుటుంబం వెండిపళ్లెంలో పళ్లూపూలూ ఇంకేవో కాయితాలూ పెట్టుకుని అమ్మ దర్శనానికి వచ్చింది. కృష్ణమ్మాళ్‌ తమ వెుహం చూడటానికి కూడా ఇష్టపడరేవో అని వాళ్ల అనుమానం. భయంభయంగా ఆమె గదిలోకి వెళ్లారు. 'అమ్మా! ప్రాయశ్చిత్తం అనుకోండి. పశ్చాత్తాపం అనుకోండి. మా వంతుగా మీ ఉద్యమానికి ఎంతోకొంత సాయం చేద్దామని అనుకుంటున్నాం. దయచేసి, కాదనకండి'... అంటూ పాదాల దగ్గర వాలిపోయారు. తమ ఆస్తుల తాలూకు పత్రాలు చేతుల్లో పెట్టారు. అందులో ఓ బంగళాకు సంబంధించిన పత్రాలూ ఉన్నాయి. 'ఏమీ అనుకోకపోతే ఓ చిన్న మనవి. ఈ ఇంట్లో మీరే ఉంటే మేమంతా చాలా సంతోషిస్తాం' అని అభ్యర్థించాడో భూస్వామి.
అమ్మ చిరునవ్వుతో జవాబిచ్చారు... 'నా ప్రపంచం చాలా పెద్దది. నాలుగు గోడలకే పరిమితం కావడం నాకిష్టం లేదు. అయినా, నాకు ఇంతపెద్ద బంగళా ఎందుకు? ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడే ఉంటాను. ఆ జానెడు జాగా చాలు. అదే నా ఇల్లు'.
జగమంత కుటుంబం ఆమెది.
అమ్మ మనసు
''తొలిపొద్దే నా గురువు. తొలిపొద్దే నా దైవం. తెల్లవారుజామున నాలుగింటికే లేవడం నాకు అలవాటు. కాసేపు ఆకాశంవైపు చూస్తూ కూర్చుంటాను. నా మనసులో పేరుకుపోయిన సందేహాల్ని ఎవరో శుభ్రంగా కడిగేస్తున్న భావన కలుగుతుంది. ఆరోజుకు అవసరమైన శక్తి నాకు అందేది అప్పుడే.''

''ఈ పూట ఏ ఒక్కరు ఆకలితో పడుకున్నా ఈ సృష్టికి అర్థంలేదు. మానవత్వానికి అర్థంలేదు.
...సుబ్రహ్మణ్యభారతి కవిత్వం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. మిత్రులారా! రండి...మనమంతా ఒక్కటై ఆకలిని గెలుద్దాం. పేదరికాన్ని గెలుద్దాం.

''నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అయినా కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు ప్రారంభిస్తాను. నా మీద నాకున్న నమ్మకం, అంతకుమించి కరుణాసముద్రుడైన దేవుడిమీదున్న నమ్మకం... నన్ను ముందుకు నడిపిస్తోంది.''

''మహాత్మాగాంధీ, వినోబా భావే, జయప్రకాశ్‌ నారాయణ్‌... నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఈ ముగ్గురూ. వినోబా ప్రభావం మరీ ఎక్కువ. ఆయనో మహర్షి. పేరు గురించి ప్రచారం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిత్యం పేదల మధ్యే గడిపేవారు. పేదల గురించే ఆలోచించేవారు. ఏకాస్త తీరిక ఉన్నా ప్రార్థనలో లీనమైపోయేవారు.''

''ఈ విజయాలూ అవార్డులూ నాకు దారిచూపిన మహాత్ములకు నివాళుల్లాంటివి. పర్యావరణ సమస్యలకూ, జాతులూ మతాలపేరిట జరుగుతున్న మారణహోమాలకూ గాంధీజీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మదర్‌థెరిసా, మండేలా వంటి మహానుభావుల బోధనల్లో పరిష్కారం ఉంది. చిత్తశుద్ధితో అనుసరించడం మన కర్తవ్యం.''

''దేవుడు ఈ భూమి మీదికి పంపింది మన బతుకు మనం బతకడానికి మాత్రమే కాదు. మన పొట్ట మనం నింపుకోడానికి మాత్రమే కాదు. నలుగురికీ సాయం చేయడానికి. మనకు ఉన్నదే పదివేలు. దాన్నే అందరితో పంచుకుందాం.''
పోచంపల్లిలో...
వినోబాభావే.. వెనకాలే జగన్నాథన్‌... ఆయన వెనక కృష్ణమ్మాళ్‌.
వినోబా అనుచరులుగా ఆ దంపతులు దేశమంతా తిరిగారు. కొన్నివేల మైళ్లు పాదయాత్రలు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌ కూడా వచ్చారు. దాదాపు మూడువందల మైళ్ల ప్రయాణం! 1951లో సర్వోదయ వార్షిక సమావేశం హైదరాబాద్‌ శివార్లలోని శివరాంపల్లిలో జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమాలు, రజాకర్ల గొడవలతో రక్తసిక్తమైన తెలంగాణ ప్రాంతంలో శాంతిసందేశాన్ని వినిపించాలని వినోబా ఆలోచన. ఏప్రిల్‌ 18న ఆయన నల్గొండ జిల్లాలో కాలువోపారు. నిర్వాహకులు పోచంపల్లిలో బస ఏర్పాటు చేశారు. ఆయన నేరుగా దళితవాడకు వెళ్లారు. కనీస వసతుల్లేని పరిస్థితులు. అంతా జానెడు భూమైనా లేని నిరుపేదలే. 'మాకూ కాస్త భూమి ఉంటే, మా జీవితాలు ఇలా తెల్లారేవి కాదు' అని బాధపడ్డారు అక్కడి జనం. 'భూమి మాత్రమే వాళ్ల జీవితాల్ని మార్చగలదు. ఆ పేదలకు అవసరమైన పొలం ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?' ... ప్రార్థన సమావేశంలో గ్రామస్థుల్ని ప్రశ్నించారు వినోబా. 'నేనున్నాను. వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధం' .. రామచంద్రారెడ్డి అనే భూస్వామి ప్రకటించారు. ఆ వితరణ వినోబాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. భారతదేశంలో భూసమస్యకు ఓ పరిష్కారం దొరికింది.
ఆ సంఘటన భూదాన ఉద్యమానికి నాంది పలికింది. పరోక్షంగా కృష్ణమ్మాళ్‌ జీవితానికీ దిశానిర్దేశం చేసింది.

మూలము : ఈనాడు .

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Friday, May 14, 2010

Firoz Gandhi , ఫిరోజ్ గాంధీ

మాజీ భారత ప్రధాని దివంగత ఇందిరా గాంధి భర్త , దివంగత ఫిరోజ్ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్త



Click here for full detailas -> Firoz Gandhi

  • =====================================
Visit my website - > http://dr.seshagirirao.tripod.com/