Thursday, March 14, 2013

Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

             
సామ్యవాద స్వాప్నికుడు!నిర్భీతికి, నిజాయితీకి చిరునామా గామారి సమాజ శ్రేయస్సుకై తుది శ్వాస దాకా పరితపించిన విలక్షణ రాజకీయవేత్త రామ్‌మనోహర్ లోహియా. స్వాతంత్య్ర సంగ్రామం లో అతి కీలకఘట్టమైన క్విట్ ఇండి యా ఉద్యమంలో ఉద్ధండులైన నేతలందరూ నిర్భంధానికి గురైన సందర్భంలో, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వంటి నాయకులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేయడంలో లోహియా నిర్వహించిన పాత్ర అనన్యం. 1910 మార్చి 23న ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్‌లో సంపన్నుల ఇంట జన్మించిన లోహియా ఆడంబరాలకు దూరంగా జీవించారు. కష్టపడటంలోనే తృప్తి ఉందన్నది లోహియా సిద్ధాం తం. బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినప్పుడు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ అనుచరుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నప్పటికీ భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి విప్లవవాదుల ప్రభావం లోహియాపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వస్తేచాలన్న పరిమిత లక్ష్యానికి లోహియా ఎన్నడూ లోనుకాలేదు.

ప్రపంచ దేశాల్లోని అన్ని జాతుల విముక్తితోపాటు వర్ణ వివక్ష పూర్తిగా రూపుమాసినప్పుడే, మానవాళి సంపూర్ణంగా వికసించడం సాధ్యమని నమ్మిన క్రాంతదర్శి. స్వాతంత్య్రానంతర భారతదేశాన్ని గురించి లోహియా ఎన్నో కలలుకన్నాడు. దేశ భవి ష్యత్తుకూ, దారిద్య్ర నిర్మూలనకూ ‘ప్రజాస్వామిక సామ్యవాద’ సాధనే మార్గమని భావించిన నేత లోహియా. గాంధీ, మార్క్స్‌లను ఎంతగా అభిమానించినప్పటికీ, వారి సిద్ధాంతాలను మాత్రం లోహియా యథాతథంగా అంగీకరించకపోవడం గమనార్హం. ‘గాంధీ-మార్క్స్ అండ్ సోషలిజం’ అన్న తన ప్రసిద్ధ గ్రంథంలో, తన భావాన్ని మరింత లోతుగా వివరిం చారు. భారత రాజకీయాల్లో ‘తృతీయశక్తి’ అన్న భావనకు, ఆచరణ రూపాన్ని కల్పిం చిన ఘనత లోహియాకే సొంతం.

దేశంలో సోషలిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించడమే కాక, అంటరానితనానికి, కులవివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారు. స్వదేశీ సంస్థానాల విలీనం, గోవా విమోచనోద్యమంలో లోహియా నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది. ఆంగ్ల భాషా వ్యతిరేకోద్యమం సహా నేపాల్ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంలో లోహియా గణనీయమైన కృషిని సాగించారు. రాజకీయ జీవితాచరణలో విలువలకు పట్టంగట్టిన రామ్‌మనోహర్ లోహియా 1967 అక్టోబర్ 12న ఢిల్లీలోని విల్లింగ్టన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం, ఆ ఆసుపత్రి పేరును ‘డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రి’గా నామకరణం చేశారు. మరణానికి ముందు తన చుట్టూ గుమిగూడిన వైద్యులను ఉద్దేశించి లోహియా అన్న మాటలు మరువలేనివి-‘‘ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు డాక్టర్ల రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటిది, నా కోసం ఇంత మంది డాక్టర్లా!’’ అంటూ కన్నీరు కార్చడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టడమే కకా, నేటికీ మన పాలకులకు అదొక హెచ్చరికగా మిగిలిపోయింది.

లెక్కల వెంకటరెడ్డి లెక్కలవారి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా-(నేడు రామ్‌మనోహర్ లోహియా 45వ వర్థంతి)@ http://www.sakshi.com/
  • ========================= 
Visit my website - > Dr.seshagirirao.com/

Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు


  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - Madapati Hanumantharao,మాడపాటి హనుమంతరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
             
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. కృష్ణాజిల్లా ఒక్కనూరు గ్రామం లో 1885, జనవరి 22న జన్మించిన మాడపాటి ఆంధ్రమహాసభ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాడపాటి గ్రంథాలయోద్యమంలో నిర్వహిం చిన భూమిక ఎన్నదగినది.

పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాల యం మాడపాటి చల్లని నీడన ఎదిగినవే. 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మాడపాటి 1970, నవంబర్ 11న 85వ ఏట కన్నుమూశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి. ‘ఆంధ్ర పితామహ’గా ఖ్యాతినొందిన మాడపాటి తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.
వంకాయలపాటి రవి కూకట్‌పల్లి, హైదరాబాద్

(నేడు ‘ఆంధ్రపితామహ’ మాడపాటి 42వ వర్ధంతి)- @ http://www.sakshi.com/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

Jhulkaribhai,ఝల్కారిబాయి

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jhulkaribhai,ఝల్కారిబాయి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


నిష్పాక్షిక దృష్టితో చరిత్రను తరచి చూస్తే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నిష్టుర సత్యాలు వెలుగు చూస్తాయన్నది అక్షరసత్యం. చరిత్రకారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రాక అలా మరుగునపడ్డ ఝల్కారిబాయి జీవిత చరిత్ర ఎంత విలక్షణమైనదో అంత అపురూపమైనది. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారిబాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మిం చిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

--బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(నేడు ఝల్కారిబాయి 182వ జయంతి)@http://www.sakshi.com/main/
  • =====================
Visit my website - > Dr.seshagirirao.com/

Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.

-దొమ్మాట వెంకటేశ్ హైదరాబాద్-(నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పదవ వర్థంతి) @http://www.sakshi.com/

=========================
Visit my website - > Dr.seshagirirao.com/

Periyar,పెరియార్

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Periyar,పెరియార్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

             
దేశంలో అంటరానితనం, కులవివక్ష లకు వ్యతిరేకంగా బహుజనులను ఉద్య మబాట పట్టించిన నిత్య చైతన్యమూర్తి పెరియార్. దేశంలో మనువాదుల వికృ తాలకు వ్యతిరేకంగా పెరియార్ సాంఘి క విప్లవోద్యమానికి నాంది పలికారు. గృహహింసను అరికట్టేందుకు మహిళలతో కలిసి మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి వారితోపాటు జైలుకు వెళ్లారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ సమసమాజం స్థాపన లక్ష్యంగా అహరహం పోరాడిన సంఘ సంస్కర్త పెరియార్. హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా నవదంపతులతో బహిరంగ ప్రమాణాల ద్వారా వివాహాలు చేయించిన స్త్రీ విముక్తి ప్రదాత.

పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించాడు. ఆయన పేరు ఈ.వి.రామస్వామి నాయకర్. ‘పెరియార్’ బిరుదును 1938 సంవత్సరంలో మహిళలు ఆయనకు ప్రదానం చేశారు. పెరియార్ అనగా ‘మహానుభావుడు’. సమాజంలో చోటుచేసుకున్న దుష్ట సంప్రదాయాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 1925లో ‘స్వయం గౌరవం’ పేరుతో సాంస్కృతిక, సామాజిక విప్లవాన్ని ప్రారంభించి పెరియార్ నవసమాజా నికి దారులు వేశారు. పురుషుని స్వాధీనంలో ఉన్న వస్తుసంపద, వనరులు, ఆస్తులు స్త్రీలను కట్టు బానిసలుగా మార్చిన తీరును చారిత్రక దృష్టి కోణం నుంచి అవగాహన చేసుకున్న తొలి స్త్రీవాది పెరియార్. బలహీన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేత కమ్యూనల్ జీవో 1926ను జారీ చేయించి, అమలు చేయించిన సామాజిక న్యాయ కోవిదుడు. అడుగంటిపోతున్న ‘ద్రవిడ సంస్కృతి’ని పరిరక్షించేందుకు దక్షిణ భారతాన్ని ‘ద్రవిడనాడు’గా ప్రకటించాలని ఎలుగెత్తి చాటిన ఆత్మగౌరవ పతాక!

రాజకీయ రంగంలో అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం ఫలప్రదమవుతుందని నాడే చాటి చెప్పిన పెరియార్ మార్గం విలక్షణమైనది. 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెరియార్ బహుజనుల పట్ల ఆ పార్టీ ప్రదర్శిస్తున్న వివక్షను ప్రశ్నిస్తూ, అందుకు నిరసనగా 1925లో రాజీనామా చేశారు. బహుజ నుల సమస్యలపై గాంధీ వంటి నాయకులు ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా వారితో చర్చలకు, సంవాదాలకూ ఆయన ఏ మాత్రం వెనుకాడలేదు. పెరియార్ 1939లో ‘జస్టిస్ పార్టీ’లో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ‘ద్రవిడ కజగమ్’ నెలకొల్పి అన్నా దురైతో కలిసి పనిచేశారు. ‘నవయుగ ప్రవక్తగా’, ‘ఆసియా సోక్రటిస్’గా యునెస్కో 1970లో పెరియార్‌ను గౌరవించింది. దాక్షిణాత్యుల ఆభిజాత్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శ నంగా నిలిచిన పోరాటయోధుడు పెరియార్. 1973, డిసెంబర్ 24న పెరియార్ తుదిశ్వాస విడిచారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు జనాభా దామాషా ప్రాతిపదిక కావాలని పెరియార్ ప్రవచించిన ప్రజాస్వామ్య సూత్రం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేయాల్సిన కర్తవ్యం నేటి బహుజనులపై ఉంది.

బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(రేపు పెరియార్ 39వ వర్ధంతి)-@http://www.sakshi.com/main/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

Monday, March 11, 2013

Savitri Jindal,సావిత్రీ జిందాల్

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Savitri Jindal,సావిత్రీ జిందాల్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



 ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె. అంతేకాదు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆ మహిళ పద్మశ్రీ సావిత్రీ జిందాల్‌. తన గురించి తాను ఏం చెబుతున్నారంటే...

హర్యానాలోని హిసార్‌ మా స్వస్థలం. 1970లో ఒ.పి.జిందాల్‌తో నా పెళ్లి జరిగింది. అప్పటి నుంచీ కుటుంబమే నా ప్రపంచంగా మారిపోయింది. భార్యగా, తల్లిగా ఎంతో సంతోషంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. నలుగురు అబ్బాయిలూ, అయిదుగురు అమ్మాయిలను పెంచి పెద్దచేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బయటి విషయాలూ, వ్యాపార లావాదేవీలన్నీ ఆయనే చూసుకునేవారు. పిల్లలూ, ఇంటికి వచ్చిపోయే బంధువులూ... ఇదే నా లోకం. 2005లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన మరణించేంతవరకూ మాకున్న ఆస్తిపాస్తులు ఏమిటో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన తదనంతరం ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో వ్యాపార లావాదేవీలకు నేను పూర్తిగా కొత్త కావడంతో మా నలుగురు అబ్బాయిలు పృథ్విరాజ్‌, సజ్జన్‌, రతన్‌, నవీన్‌లే అన్ని విషయాలూ చూసుకునేవారు. నేను బోర్డు మీటింగులకూ, వాటిలో తీసుకునే నిర్ణయాలకూ చాలా దూరంగా ఉండేదాన్ని. వూపిరి సలపని వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండటానికి రాజకీయాల నెపంతో మూడు రోజులు
హిసార్‌ నియోజకవర్గంలో గడిపేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఒకప్పుడు అంత టెన్షన్‌ పడ్డానా అని నాకే నవ్వొస్తుంటుంది. ఇప్పుడు నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. బోర్డు మీటింగుల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాను.

* ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. వివిధ వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలనూ నియంత్రించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు వ్యాపార రంగానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మనదేశంలో ప్రముఖ వ్యాపారాలన్నీ కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యాయి.

అలాకాకుండా వ్యాపారం చేయాలనుకునే ఉత్సాహవంతులకు ప్రోత్సాహకర పరిస్థితులు కల్పించాలి. అప్పుడు స్వయం ఉపాధికి అవకాశాలూ పెరుగుతాయి.

* విద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో మా సంస్థలు ఎంతోకాలంగా సేవలందిస్తున్నాయి. 2007లో ఒ.పి.జిందాల్‌ కమ్యూనిటీ కాలేజీని స్థాపించాం. దీంట్లో వృత్తి

విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తాం. ఒకవ్యక్తి సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించడానికి కావాల్సిన శిక్షణంతా ఇక్కడ లభిస్తుంది. ప్రతిభ కనబరిచినవారికి స్కాలర్‌షిప్‌ సౌకర్యమూ ఉంది.

* సుమారు యాభైమూడు వేలకోట్ల రూపాయల సంపదతో దేశంలోని సంపన్నుల్లో ఏడో స్థానం పొందాను. ప్రపంచ సంపన్నుల్లో యాభైఆరో స్థానం సాధించడం, ఇంకా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా ఎంపిక కావడమూ సంతోషంగానే ఉంది. అయితే, ఇవేమీ నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నిరాడంబరంగా జీవించడానికే ఇష్టపడతాను. నేను పగ్గాలు
చేపట్టిన తర్వాత సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగిందని మాత్రం కాస్త గర్వంగానే చెప్పగలను.

* ఒ.పి. జిందాల్‌ గ్రూప్‌ సంస్థ 1952లో ప్రారంభమైంది. అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో ప్రపంచంలోనే ఇది మూడోది. దీంట్లో స్టీల్‌, పవర్‌, మైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌కు సంబంధించిన నాలుగు విభాగాలున్నాయి. నలుగురు అబ్బాయిలూ ఒక్కొక్కరూ ఒక్కో విభాగ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఎవరికి ఏ సమస్య వచ్చినా నలుగురూ ఒకచోట కూర్చుని జాగ్రత్తగా చర్చించిమరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా  తామంతా అన్నదమ్ములమేనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఇదంతా తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణే. నా పిల్లలకు కుటుంబ వారసత్వంగా ఆస్తిపాస్తులే కాదు, నీతి నిజాయతీలూ, కష్టపడేతత్వం, చక్కటి వ్యక్తిత్వం కూడా వచ్చాయి.

* బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. మా ఉద్యోగులను కేవలం ఉద్యోగుల్లా చూడను, కుటుంబ సభ్యుల్లానే చూస్తాను. వారి సమస్యలను శ్రద్ధగా వింటాను. 'కుటుంబం అంటే నువ్వూ, నేనూ, పిల్లలు మాత్రమేకాదు, మన ఉద్యోగులు కూడా' అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను.

* నేటి మహిళా వ్యాపారవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి పనిచేయండి. శ్రమజీవికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో గట్టి పోటీ ఎదురైనా, అవరోధాలు కలిగినా బెదిరిపోకండి. వ్యాపార ప్రపంచంలో అవన్నీ సహజం. ధైర్యంగా ముందడుగు వేస్తే ఫలితం ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటుంది.

*అభిరుచుల విషయానికి వస్తే... సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొంటాను. ఏకాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతాను, పిల్లలకు కమ్మగా వండిపెడతాను.
  •  =========================
Visit my website - > Dr.seshagirirao.com/