Showing posts with label Dhundiraj Govind Phalke. Show all posts
Showing posts with label Dhundiraj Govind Phalke. Show all posts

Thursday, January 5, 2012

దాదాసాహెబ్‌ ఫాల్కే ,Dhundiraj Govind Phalke, Dada Saheb Falkhe



  • image : courtesy with http://wikipedia.org/

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --దాదాసాహెబ్‌ ఫాల్కే ,Dhundiraj Govind Phalke, Dada Saheb Falkhe- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


జయంతి: 30-4-1870 .దాదాసాహెబ్‌ దుండిరాజ్‌ గోవింద ఫాల్కే మహారాష్టల్రోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. పురావస్తు శాఖలో డ్రాఫ్ట్‌‌సమన్‌గా, ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. 3-5-1913న ఫాల్కే మొదటి చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ విడుదలైంది. అదే మొట్టమొదటి భారతీయ కథా (మూకీ) చలన చిత్రం. అందువల్లనే ఫాల్కే భారతీయ చలన చిత్ర పితామహుడుగా పేరుపొందారు. 1914లో ఆయన రెండవ చిత్రం ‘మోహినీ భస్మాసుర’ విడుదలయింది. ఆయన నిర్మించిన చివరి చిత్రాలు ‘సేతుబంధన్‌’, ‘గంగావతరణ్‌’, ఫాల్కే పేరిట కేంద్ర ప్రభుత్వం చలన చిత్ర రంగానికి విశిష్టసేవలు చేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తోంది.

దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ ) - ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు. మరణము - ఫిబ్రవరి 16, 1944. .1966లో ఇతని పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడినది. రాజా హరిశ్చంద్ర 1913, దాదాసాహెబ్ ఫాల్కేచే దర్శకత్వం వహింపబడినది.

సినీ ప్రస్థానం

* రాజా హరిశ్చంద్ర (1913)
* శ్రీ కృష్ణ జన్మ (1918)
* కలియా మర్దాన్ (1919)
* సేతు బంధన్ (1923)
* గంగావతరన్ (1937)

  • ========================================


Visit my website - > Dr.seshagirirao.com/