Sunday, January 20, 2013

Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ

  •  

  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా నిష్క్రమించనున్నారు. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో టాటా గ్రూపును స్థాపించారు. యాభై ఏళ్లు సంస్థకు సేవలందించిన మాజీ ఛైర్మన్ రతన్ టాటా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది.

ఇదిలావుండగా, షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ.. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి చివరికి మిస్త్రీని ఎంపిక చేసిన విషయం తెల్సిందే. టాటా గ్రూప్ 6వ చైర్మన్‌ గా 28 డిసెంబర్ 2012 నుండి బాధ్యతలు చేపట్టారు .

పుట్టిన తేదీ : 04 జూలై 1968,
తల్లిదండ్రులు : పల్లోంజీ మిస్త్రీ : patsy perin Dubash ,
చదువు : B.E civil engineer with MBA from London Business School.
నేషనాలిటీ : ఐరిష్ ,
మతము : జోరాస్ట్ర్రియానిజం ,
భార్య : రోహిక మిస్త్రీ(Rohiqa chagla Mistry),
పిల్లలు : ఇద్దరు .
తోబుట్టువులు : ఒక అన్నయ్య : షపూర్ మిస్త్రీ , ఇద్దరు సిస్టర్స్ =లైలా మరియు అలూ ,

టాటా సంస్థలు : భారతదేశపు తొలి బహుళజాతి సంస్థ " టాటా" సంస్థలు . 20 వ శతాబ్దపు తొలి సంవత్సరాలలోనే వ్యాపార కార్యాలయం  కలిగిన సంస్థ టాటా సన్స్ . భారతదేశము బానిసపాలనలో  ఉన్న కాలములో జాతీయ భావాలు కలిగిన ఒక పార్శీ - జంషెడ్జీ టాటా ఈ సంస్థ ను నెలకొలిపారు. ప్రపంచములొ పలుదేశాలలో పరిశ్రమలు , పెట్టుబడులు కలిగిన టాటా లు ప్రవేశించని పరిశ్రమలేదు. ఉప్పునుండి సాప్ట్ వేర్ వరకు ప్రతి రంగములో వారి ఉత్పత్తులు ఉన్నాయి. టాటా స్టీల్ , టాటా లారీలు ,టాటా కార్లు , టాటా టీ , టాటా కెమికల్స్ , టాటా టెలికమ్యూనిమేషన్‌ ... ఇలా వారి ఉత్పత్తులు భారతీయలందరి జీవితాలను తాకేవే . నాన్యత విషయములో రాజీ పడని కంపెనీగా , నిజాయితీ విషయ్ము లో చాలా పారిశ్రామిక సంస్థలకన్నా మెరుగైనదిగా  టాటా లకు గుర్తింపు ఉంది. ఈ సంస్థల ఆధాయము సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా . 80 దేశాలకు పైగా వీరి పెట్టుబడులు , పరిశ్రమలు కలిగి ఉన్నాయి.

52 ఏళ్ళపాటు చైర్మన్‌ గా వ్యవహరించిన జె.ఆర్.డి.టాటా నుండి వారసత్వముగా చైర్మన్‌ పదవిని 1991 లో రతన్‌ టాటా అందుకున్నారు. సుమారు 20 ఏళ్ళ పైబడి ఆయన ఆ పదవిలో ఉన్నారు. రతన్‌ టాటా అవివాహితుడైనందున తన 75 వ ఏట తన వారసుడుగా ఎంఫిక 5 గురు సభ్యులున్న కమిటీకి అప్పగించి ... అలా ఎన్నికైన వారే ఈ సైరస్ మిస్త్రీ.

టాటా గ్రూప్ చైర్మన్ జాబితా-List of Tata Group Chairmen

  1.    జమ్సేట్జి టాటా- Jamsetji Tata (1887–1904)
  2.    దొరబ్జి టాటా-Dorabji Tata (1904–1932)
  3.   నౌరోజీ శక్లత్వల- Nowroji Saklatwala (1932–1938)
  4.   జె.ఆర్ డి టాటా J. R. D. Tata (1938–1991)
  5.   రతన్ టాటా- Ratan Tata (1991–2012)  
  6. సైరస్ మిస్త్రీ -Cyrus Mistry (2012–present)

  •  ============================ 
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.