Friday, February 11, 2011

డా.జాకీర్‌ హుస్సేన్‌,Dr.Zakir Hussain



డాజాకీర్‌ హుస్సేన్‌ జయంతి: ఫిబ్రవరి 08, 1897న జన్మించిన డా జాకీర్‌ హుస్సేన్‌ బెర్లి న్‌ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ డిగ్రీ పొందారు. ‘జామియా మిలియా ఇస్లామియా’ విద్యా సంస్థను స్థాపించారు. హిందూ ముస్లిం సామరస్యానికి కృషి చేశారు. 1957లో బిహార్‌ గవర్నర్‌ అయ్యారు. 1962 లో ఉపరాష్టప్రతిగా, 1967లో భారత మూడవ రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. 13-05-1967 నుండి 03-05-1969 ఆ పదవిలో కొనసా గారు. రాష్టప్రతి పదవి చేపట్టిన మొదటి మహ మ్మదీయుడు.

-అత్యల్పకాలం రాష్టప్రతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్టప్రతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.




  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.