Wednesday, October 5, 2011

కమలా నెహ్రూ , Kamala Nehru



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -కమలా నెహ్రూ , Kamala Nehru- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


పాత డిల్లీ లోని కాశ్మీరీ బ్రాహ్మిణ్ కుటుంబములో 01 ఆగస్ట్ 1899 సంవత్సరములో " రాజ్ పతి , జవహర్మాల్ కౌల్ దంపతులకు జన్మించారు .ఈమె తోడ ఇద్దరు తమ్ముళ్లు ..చాంద్ భహదూర్ కౌల్ , కైలాష నాథ్ కౌల్ , ఒక చెల్లెలు ..స్వరూప్ కథ్జు . 14 -11 - 1889 తేదిన పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ గారి తో వివాహం 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న "కమలా నెహ్రూ" వివాహమయ్యింది. కమలా నెహ్రూ మామగారు -మోతీలాల్ నెహ్రూ. అత్తగారు -శ్రీమతి స్వరూప రాణి. ఇంటి పట్టునే ఉండే కమలానెహ్రూ 1921 లొ non-coperation movement లో వుమెన్‌ గ్రూప్ కి నాయకత్వము వహించి విదేసీ వస్తువులు దుస్తులు , మద్యము అమ్మకాలు చేయకూడదనే నినాదముతో ముందుకు సాగారు . రెండుసార్లు అరెస్ట్ అయ్యారు .

నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్థినంతా దారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పటల్ గా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు. 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాద్ లో జన్మించిన ఇందిర అల్లారు ముద్దుగా పెరిగారు. ఇందిర బాల్యం అలహాబాదు లోనే గడిచింది. 1924 లో కమలానెహ్రూ ఒకబాబును కన్నారు . ప్రీ మెచ్యూర్ గా జన్మించడం వలన 2 రోజులలో బాబు చనిపోయాడు . 1934 లో జైలు నుండి విడుదలైన నెహ్రూ తిరిగి అరెస్టు కాబడి కలకత్తా, డెహ్రాడూన్‌ లలో జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో నెహ్రూ ఆరోగ్యం పాడైంది. భర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కమలా నెహ్రూ దిగులుతో అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌ కు వెళ్లి 1936 లో టి.బి. జబ్బు మూలాన మరణించారు . మే 27 వ తేది 1964వ సంత్సరంలో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకు దూరమయ్యారు. కమలా నెహ్రూ చనిపోయిన తరువాత ఆమె పేరుతో కాలేజీలు , పార్కులు , ఆసుపత్రులు , విశ్వవిద్యాలయాలు వెలసాయి .


  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.