Thursday, March 14, 2013

Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.

-దొమ్మాట వెంకటేశ్ హైదరాబాద్-(నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పదవ వర్థంతి) @http://www.sakshi.com/

=========================
Visit my website - > Dr.seshagirirao.com/

Periyar,పెరియార్

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Periyar,పెరియార్- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

             
దేశంలో అంటరానితనం, కులవివక్ష లకు వ్యతిరేకంగా బహుజనులను ఉద్య మబాట పట్టించిన నిత్య చైతన్యమూర్తి పెరియార్. దేశంలో మనువాదుల వికృ తాలకు వ్యతిరేకంగా పెరియార్ సాంఘి క విప్లవోద్యమానికి నాంది పలికారు. గృహహింసను అరికట్టేందుకు మహిళలతో కలిసి మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి వారితోపాటు జైలుకు వెళ్లారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ సమసమాజం స్థాపన లక్ష్యంగా అహరహం పోరాడిన సంఘ సంస్కర్త పెరియార్. హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా నవదంపతులతో బహిరంగ ప్రమాణాల ద్వారా వివాహాలు చేయించిన స్త్రీ విముక్తి ప్రదాత.

పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించాడు. ఆయన పేరు ఈ.వి.రామస్వామి నాయకర్. ‘పెరియార్’ బిరుదును 1938 సంవత్సరంలో మహిళలు ఆయనకు ప్రదానం చేశారు. పెరియార్ అనగా ‘మహానుభావుడు’. సమాజంలో చోటుచేసుకున్న దుష్ట సంప్రదాయాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 1925లో ‘స్వయం గౌరవం’ పేరుతో సాంస్కృతిక, సామాజిక విప్లవాన్ని ప్రారంభించి పెరియార్ నవసమాజా నికి దారులు వేశారు. పురుషుని స్వాధీనంలో ఉన్న వస్తుసంపద, వనరులు, ఆస్తులు స్త్రీలను కట్టు బానిసలుగా మార్చిన తీరును చారిత్రక దృష్టి కోణం నుంచి అవగాహన చేసుకున్న తొలి స్త్రీవాది పెరియార్. బలహీన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేత కమ్యూనల్ జీవో 1926ను జారీ చేయించి, అమలు చేయించిన సామాజిక న్యాయ కోవిదుడు. అడుగంటిపోతున్న ‘ద్రవిడ సంస్కృతి’ని పరిరక్షించేందుకు దక్షిణ భారతాన్ని ‘ద్రవిడనాడు’గా ప్రకటించాలని ఎలుగెత్తి చాటిన ఆత్మగౌరవ పతాక!

రాజకీయ రంగంలో అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం ఫలప్రదమవుతుందని నాడే చాటి చెప్పిన పెరియార్ మార్గం విలక్షణమైనది. 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెరియార్ బహుజనుల పట్ల ఆ పార్టీ ప్రదర్శిస్తున్న వివక్షను ప్రశ్నిస్తూ, అందుకు నిరసనగా 1925లో రాజీనామా చేశారు. బహుజ నుల సమస్యలపై గాంధీ వంటి నాయకులు ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా వారితో చర్చలకు, సంవాదాలకూ ఆయన ఏ మాత్రం వెనుకాడలేదు. పెరియార్ 1939లో ‘జస్టిస్ పార్టీ’లో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ‘ద్రవిడ కజగమ్’ నెలకొల్పి అన్నా దురైతో కలిసి పనిచేశారు. ‘నవయుగ ప్రవక్తగా’, ‘ఆసియా సోక్రటిస్’గా యునెస్కో 1970లో పెరియార్‌ను గౌరవించింది. దాక్షిణాత్యుల ఆభిజాత్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శ నంగా నిలిచిన పోరాటయోధుడు పెరియార్. 1973, డిసెంబర్ 24న పెరియార్ తుదిశ్వాస విడిచారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు జనాభా దామాషా ప్రాతిపదిక కావాలని పెరియార్ ప్రవచించిన ప్రజాస్వామ్య సూత్రం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేయాల్సిన కర్తవ్యం నేటి బహుజనులపై ఉంది.

బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా
(రేపు పెరియార్ 39వ వర్ధంతి)-@http://www.sakshi.com/main/
  • ==========================
Visit my website - > Dr.seshagirirao.com/

Monday, March 11, 2013

Savitri Jindal,సావిత్రీ జిందాల్

  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Savitri Jindal,సావిత్రీ జిందాల్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



 ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె. అంతేకాదు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆ మహిళ పద్మశ్రీ సావిత్రీ జిందాల్‌. తన గురించి తాను ఏం చెబుతున్నారంటే...

హర్యానాలోని హిసార్‌ మా స్వస్థలం. 1970లో ఒ.పి.జిందాల్‌తో నా పెళ్లి జరిగింది. అప్పటి నుంచీ కుటుంబమే నా ప్రపంచంగా మారిపోయింది. భార్యగా, తల్లిగా ఎంతో సంతోషంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. నలుగురు అబ్బాయిలూ, అయిదుగురు అమ్మాయిలను పెంచి పెద్దచేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బయటి విషయాలూ, వ్యాపార లావాదేవీలన్నీ ఆయనే చూసుకునేవారు. పిల్లలూ, ఇంటికి వచ్చిపోయే బంధువులూ... ఇదే నా లోకం. 2005లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన మరణించేంతవరకూ మాకున్న ఆస్తిపాస్తులు ఏమిటో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన తదనంతరం ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో వ్యాపార లావాదేవీలకు నేను పూర్తిగా కొత్త కావడంతో మా నలుగురు అబ్బాయిలు పృథ్విరాజ్‌, సజ్జన్‌, రతన్‌, నవీన్‌లే అన్ని విషయాలూ చూసుకునేవారు. నేను బోర్డు మీటింగులకూ, వాటిలో తీసుకునే నిర్ణయాలకూ చాలా దూరంగా ఉండేదాన్ని. వూపిరి సలపని వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండటానికి రాజకీయాల నెపంతో మూడు రోజులు
హిసార్‌ నియోజకవర్గంలో గడిపేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఒకప్పుడు అంత టెన్షన్‌ పడ్డానా అని నాకే నవ్వొస్తుంటుంది. ఇప్పుడు నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. బోర్డు మీటింగుల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాను.

* ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. వివిధ వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలనూ నియంత్రించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు వ్యాపార రంగానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మనదేశంలో ప్రముఖ వ్యాపారాలన్నీ కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యాయి.

అలాకాకుండా వ్యాపారం చేయాలనుకునే ఉత్సాహవంతులకు ప్రోత్సాహకర పరిస్థితులు కల్పించాలి. అప్పుడు స్వయం ఉపాధికి అవకాశాలూ పెరుగుతాయి.

* విద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో మా సంస్థలు ఎంతోకాలంగా సేవలందిస్తున్నాయి. 2007లో ఒ.పి.జిందాల్‌ కమ్యూనిటీ కాలేజీని స్థాపించాం. దీంట్లో వృత్తి

విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తాం. ఒకవ్యక్తి సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించడానికి కావాల్సిన శిక్షణంతా ఇక్కడ లభిస్తుంది. ప్రతిభ కనబరిచినవారికి స్కాలర్‌షిప్‌ సౌకర్యమూ ఉంది.

* సుమారు యాభైమూడు వేలకోట్ల రూపాయల సంపదతో దేశంలోని సంపన్నుల్లో ఏడో స్థానం పొందాను. ప్రపంచ సంపన్నుల్లో యాభైఆరో స్థానం సాధించడం, ఇంకా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా ఎంపిక కావడమూ సంతోషంగానే ఉంది. అయితే, ఇవేమీ నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నిరాడంబరంగా జీవించడానికే ఇష్టపడతాను. నేను పగ్గాలు
చేపట్టిన తర్వాత సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగిందని మాత్రం కాస్త గర్వంగానే చెప్పగలను.

* ఒ.పి. జిందాల్‌ గ్రూప్‌ సంస్థ 1952లో ప్రారంభమైంది. అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో ప్రపంచంలోనే ఇది మూడోది. దీంట్లో స్టీల్‌, పవర్‌, మైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌కు సంబంధించిన నాలుగు విభాగాలున్నాయి. నలుగురు అబ్బాయిలూ ఒక్కొక్కరూ ఒక్కో విభాగ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఎవరికి ఏ సమస్య వచ్చినా నలుగురూ ఒకచోట కూర్చుని జాగ్రత్తగా చర్చించిమరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా  తామంతా అన్నదమ్ములమేనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఇదంతా తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణే. నా పిల్లలకు కుటుంబ వారసత్వంగా ఆస్తిపాస్తులే కాదు, నీతి నిజాయతీలూ, కష్టపడేతత్వం, చక్కటి వ్యక్తిత్వం కూడా వచ్చాయి.

* బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. మా ఉద్యోగులను కేవలం ఉద్యోగుల్లా చూడను, కుటుంబ సభ్యుల్లానే చూస్తాను. వారి సమస్యలను శ్రద్ధగా వింటాను. 'కుటుంబం అంటే నువ్వూ, నేనూ, పిల్లలు మాత్రమేకాదు, మన ఉద్యోగులు కూడా' అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను.

* నేటి మహిళా వ్యాపారవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి పనిచేయండి. శ్రమజీవికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో గట్టి పోటీ ఎదురైనా, అవరోధాలు కలిగినా బెదిరిపోకండి. వ్యాపార ప్రపంచంలో అవన్నీ సహజం. ధైర్యంగా ముందడుగు వేస్తే ఫలితం ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటుంది.

*అభిరుచుల విషయానికి వస్తే... సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొంటాను. ఏకాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతాను, పిల్లలకు కమ్మగా వండిపెడతాను.
  •  =========================
Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, February 21, 2013

I.K.Gujral ,భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --I.K.Gujral ,భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

 భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌(93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా భాద్యతలు నిర్వహించారు.గుజ్రాల్‌ సతీమణి షీలా గుజ్రాల్‌ పంజాబీ, హిందీ, ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీశ్‌ గుజ్రాల్‌ ప్రముఖ చిత్రకారుడు.

1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్‌కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా వున్నారు. అనంతరం కొంతకాలం సోవియట్‌యూనియన్‌లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు.వీపీసింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 1989లో వీపీ సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవెగౌడ సారధ్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్‌ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.

for more details : I.K.Gujral
  • ===============================
 Visit my website - > Dr.seshagirirao.com/

Monday, February 18, 2013

P.T.usha,పి.టి.ఉష

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -P.T.usha,పి.టి.ఉష- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



ఈమె పూర్తిపేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్‌ ఉష. ఈమె 1964 మే 20న పుట్టింది. మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించి, పరుగుల రాణిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఈమెను అందరూ ముద్దుగా పయోలి ఎక్స్‌ప్రెస్‌ అని పిలుస్తుంటారు. ఇక ఈమె విజయ పరంపరలో 1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజితం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెప్పింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా 2 రజిత పతకాలు సొంతం చేసుకుంది. అదేవిధంగా 1990 ఆసియాడ్‌లో 3, 1994లో ఒకటి రజితాలు గెలుచుకుంది. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతటి ఖ్యాతిని భారతదేశానికి అందించినందుకు ఈమెను 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది.

ఇటువంటి మహాన్నత విలువలున్న మన మహిళలు తాజాగా ట్రస్‌ రీసెర్చ్‌ అడ్వయిజరీ వారి పరిశోధనల్లో కూడా భారత దేశపు అత్యంత నమ్మకమైన మహిళా మణులుగా ఎంపికై రికార్డ్‌ని మరొకమారు తిరగ రాసారని చెప్పవచ్చు.

For more details : see wikipedia.org - P.T.Usha
  • =========================
 Visit my website - > Dr.seshagirirao.com/

Tuesday, January 22, 2013

మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand

  •  
  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - మున్సీ ప్రేంచంద్‌-Munshi Premchand- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

1980 జూలై 31 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో జన్మించిన మున్షి ప్రేమ్ చంద్  భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.

మున్షీ ప్రేంచంద్‌ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాంఘీక జీవనంలో మనిషి తనాన్ని, మంచి తనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహరచయిత ఉర్దూలో హిందీలో కథలు, నవలలు, సంపాదకీయాలు రాసిన మహానీ యుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశాడు. కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత కూడా కథలాగా కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి. కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని కథలు మన కళ్లు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్లల్లో గడ్డకట్టిన కన్నీళ్లని ప్రవహింప చేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకు తెలియని మహాత్తు ఉంది. ఈ మధ్య అలాంటి కథ చాలా రోజుల తరువాత మళ్లీ చదివాను. అది ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకడైన మున్సీ ప్రేంచంద్‌ కథ ‘ఈద్‌ పండుగ’. ఈ కథ చదివిన వ్యక్తుల కళ్లు కూడా ఆ కథలోని హమీద్‌ నానమ్మ అమీనాతో పాటు వర్షిస్తాయి. మనిషిగా ఎలా వుండాలో ఆలోచింప చేస్తాయి. ఈ కథలో ప్రేమా, మానవత్వం అనుబంధం ఎన్నో కలగలిపి ఉంటాయి.  అలాంటి కథే ‘ఈద్‌ పండుగ’ మన మనస్సులని కదిలించే కథ. మన భావోద్వేగాలకి చలనం ఇచ్చే కథ. ప్రేంచంద్‌ రాసిన కథ ల్లో చాలా గొప్ప కథ ‘ఈద్‌ పండుగ’ ఈ కథ ఈద్గా (మసీదు) పేరు తో అనువాదం అయ్యింది.



ప్రేమ్‌చంద్ 1880, జూలై 31న వారణాసి దగ్గర కాశికి నాలుగు మైళ్ళ దూరములో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్ మరియు ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ''ధన్‌పత్ రాయ్'' అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, ఇతనిని 'నవాబ్' అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు. ప్రేమ్‌చంద్ తల్లితండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో  సవతి తల్లి మరియు ఆమె పిల్లల బాధ్యత  ప్రేమ్ చంద్  పై పడింది. వారి కుటుంబము లో ఆరోగ్యము అంతంతమాత్రమే . అనారోగ్యము వారసత్వమూగా అందుకున్నాడు ప్రేమంచంద్ . ఆరోగ్యము సహకరించక , ఉద్యోగములో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగము మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డాడు .

ప్రేంచంద్ కి బాల్యములోనే వివాహమైంది. కాని అది బలవంతపు వివాహము , అయిష్ట వివాహము  అనేవారు. పెద్దలు చేసిన పెళ్ళిని ఆయన అంగీకరించలేదు. ఆమె తో సంసారము చెయ్యలేదు.  ఈ లోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు . బాల్యములోనే వివాహవైధవ్యము సంభవించిన 11 యేళ్ళ బాలికను వివాహమాడేందుకు అభ్యుదయభావావు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన . అది చూసి ప్రేంచంద్ స్పందించాడు . తాను చేసుకుంటానని ముందుకు వెళ్ళాడు .. ఆ విధము గా " శివరాణీదేవి " ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు . తనకు ఇంతకుముందు పెళ్ళి అయిన విషయము చెప్పలేదు. సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నము చేశాడు . విద్యాశాఖలో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది . 1920 లో వచ్చిన సహాయనిరాకరణ ఉద్యమం లో గోరఖ్ పూర్ లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై  ప్రభుత్వ ఉద్యోగము వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకొని , పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. 250 కధలు , 12 నవలలు రచించాడు .

సమాజములోని లోటుపాట్లను , స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను , మూఢనమ్మకాలను  నిరసిస్తూ రచనలు చేశాడు . మంచి పేరు ప్రతిస్టలు సంపాదించాడు . రెండవ భార్యకు తన మొదటి వివాహము  గురించి తెలిసింది. ఆ విషయము మీద ఇద్దరూ వాదులాడుకున్నారు . వారి సంసారములో వాదులాటలు సామాన్యము అయినా వారిద్దరి మధ్యా ప్రేమ , అనురాగము అధికము .  ప్రేంచందను వదిలి శివరాణీదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణము ఇష్టపడేదికాదు . ప్రేంచంద్ కూడా అంతే. ఏ మాత్రము నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకొని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెపుతుండేవారు.  భర్తకున్న అనారోగ్య సమస్యలు , జీర్ణకోశ సమస్యలు ఆమెకు ఆందోళన కలిగిస్తూఉండేవి . ఎంతో శ్రద్ద తీసుకొని చూసుకుంటూ తన సాహిత్యసేవా , పత్రిక సేవా నడపడము లో సహకరిస్తూ ఉండేవారు.

ప్రేమ్‌చంద్ 1935 లో జ్వరము బాధపడుతూ పత్రికకు సంపాదకీయము రాయడము మొదలు పెట్టగానే భార్య అభ్యంతరము పెట్టింది. అందుకు ఆయన " రాణీ నువ్వు పొరపడుతున్నావు . నేను నాకు నచ్చిన పని చేయుచున్నాను . ఇందులో నాకు ఆనందము దొరుకుతుంది. ఇది ఒకరకమైన మత్తును కలిగిస్తుంది. కాని ఇది చెడుపని కాదు. నేను దీపం వంటి  వాడిని ... వెలుతురును ఇస్తాను , ఆ వెలుతురు ఇతరులు లాభానికి వాడుకుంటారో , నష్టపోతారో నాకు సంబంధము  లేదు . " అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు . నాటి నుండి ఆయన ఆరోగ్యము తగ్గడము మొదలు పెట్టింది.

1936 లో ' గోదాన్‌ ' అచ్చు అయింది. మంగళసూత్రమనే మరో నవలను ఆలోచిస్తున్నారు. కాని ఆరోగ్యము సహకరించలేదు . తన ఆరోగ్యము వలన భార్య బాధపడుతుందని ఆయనకు దిగులు. రక్తపు వాంతులు అయ్యాయి . ఆమె సుభ్రము చేసింది. పక్కన వచ్చికూర్చుని నుదుటిమీద చెయ్యివేసి ఉంచమని భార్యను  కోరాడు . ఆమె కంటనీరుతో అలాగే కూర్చుంది. నీకు తెలియకుండా దాచిన రహస్యాలను చెబుతాను విను.  " నా మొదటి వివాహం తర్వాత మరో స్త్రీ నా జీవితం లోకి ప్రవేశించింది. నిన్ను పెళ్ళిచేసుకున్నాక కూడా ఆమెతో నా సంబంధం కొనసాగింది. అలాగే నీకు చెప్పకుండా కొందరికి డబ్బులు ఇచ్చి , ఆ అప్పు ను తీర్చేందుకు  కధలు రాసేవాడిని " ఇలా తాను చేసిన తప్పులను ఒప్పుకోవడము మొదలు పెట్టాడు .  నిజానికి అవన్నీ భార్యకు తెలుసు . అయినా ఆయన కోసము వాటిని తెలియనట్టుగానే ఉంది.  ఆ విషయము ప్రేంచంద్ కి అర్ధమయ్యేసరికి భార్య శివరాణీదేవి మీద గౌరవం , ప్రేమ పెరిగిపోయింది.

అన్నీ తెలిసి నన్ను నిలదీయని నీ హృదయం ఎంత ఉన్నతమైనదో ఈ రోజు గ్రహించాను . నాకిప్పుడు ఎక్కువ కాలము బ్రతకాలని ఉంది నాకోసము కాదు ... నా భార్యకోసము ... ఆమె మహాత్యాగి . ఆమె తో కలిసి మరికొంతకాలము ఉండాలనివుంది. నన్ను బ్రతికించు . వచ్చే జన్మలో కూడా ఈమెనే నా అర్ధాంగిగా చెయ్యి ... కనీసము నా ఈ చివరి ప్రార్ధనన్నా ఆలకించు ... అని తనలోతాను సణుగుతున్నారు. మనము ఎవరికీ ఏ అపకారము  చెయ్యలేదు . భగవంతుడు మన మొర తప్పక ఆలకిస్తాడు . రాణీ ,, నువ్వు నాపక్కనే ఉండు . ఎక్కడికీ వెళ్ళకు . నువ్వు ఉంటే నాకు ధైర్యము గా ఉంటుంది . నీకు చెప్పాలకున్న విషయాలు పూర్తిగా చెప్పగలుగుతాను.  ఇది జరిగిన రెండవరోజూ అంటే ... అక్టోబర్ -08 -1936 న విరోచనమైంది. రాణి శుభ్రం చేద్దామనుకుంటుండగానే ఆయన శరీరము చల్లబడింది. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 56 సంవత్సరాలకే ఆ మహా రచయిత జీవితం అంతమైంది.

మూలము : చివరి రోజుల్లో@స్వాతి వారపత్రిక .... 11-1-2013



===========================
Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, January 20, 2013

Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ

  •  

  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Cyrus Pallonji Mistry,సైరస్ పల్లోంజీ మిస్త్రీ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా నిష్క్రమించనున్నారు. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో టాటా గ్రూపును స్థాపించారు. యాభై ఏళ్లు సంస్థకు సేవలందించిన మాజీ ఛైర్మన్ రతన్ టాటా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది.

ఇదిలావుండగా, షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ.. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి చివరికి మిస్త్రీని ఎంపిక చేసిన విషయం తెల్సిందే. టాటా గ్రూప్ 6వ చైర్మన్‌ గా 28 డిసెంబర్ 2012 నుండి బాధ్యతలు చేపట్టారు .

పుట్టిన తేదీ : 04 జూలై 1968,
తల్లిదండ్రులు : పల్లోంజీ మిస్త్రీ : patsy perin Dubash ,
చదువు : B.E civil engineer with MBA from London Business School.
నేషనాలిటీ : ఐరిష్ ,
మతము : జోరాస్ట్ర్రియానిజం ,
భార్య : రోహిక మిస్త్రీ(Rohiqa chagla Mistry),
పిల్లలు : ఇద్దరు .
తోబుట్టువులు : ఒక అన్నయ్య : షపూర్ మిస్త్రీ , ఇద్దరు సిస్టర్స్ =లైలా మరియు అలూ ,

టాటా సంస్థలు : భారతదేశపు తొలి బహుళజాతి సంస్థ " టాటా" సంస్థలు . 20 వ శతాబ్దపు తొలి సంవత్సరాలలోనే వ్యాపార కార్యాలయం  కలిగిన సంస్థ టాటా సన్స్ . భారతదేశము బానిసపాలనలో  ఉన్న కాలములో జాతీయ భావాలు కలిగిన ఒక పార్శీ - జంషెడ్జీ టాటా ఈ సంస్థ ను నెలకొలిపారు. ప్రపంచములొ పలుదేశాలలో పరిశ్రమలు , పెట్టుబడులు కలిగిన టాటా లు ప్రవేశించని పరిశ్రమలేదు. ఉప్పునుండి సాప్ట్ వేర్ వరకు ప్రతి రంగములో వారి ఉత్పత్తులు ఉన్నాయి. టాటా స్టీల్ , టాటా లారీలు ,టాటా కార్లు , టాటా టీ , టాటా కెమికల్స్ , టాటా టెలికమ్యూనిమేషన్‌ ... ఇలా వారి ఉత్పత్తులు భారతీయలందరి జీవితాలను తాకేవే . నాన్యత విషయములో రాజీ పడని కంపెనీగా , నిజాయితీ విషయ్ము లో చాలా పారిశ్రామిక సంస్థలకన్నా మెరుగైనదిగా  టాటా లకు గుర్తింపు ఉంది. ఈ సంస్థల ఆధాయము సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా . 80 దేశాలకు పైగా వీరి పెట్టుబడులు , పరిశ్రమలు కలిగి ఉన్నాయి.

52 ఏళ్ళపాటు చైర్మన్‌ గా వ్యవహరించిన జె.ఆర్.డి.టాటా నుండి వారసత్వముగా చైర్మన్‌ పదవిని 1991 లో రతన్‌ టాటా అందుకున్నారు. సుమారు 20 ఏళ్ళ పైబడి ఆయన ఆ పదవిలో ఉన్నారు. రతన్‌ టాటా అవివాహితుడైనందున తన 75 వ ఏట తన వారసుడుగా ఎంఫిక 5 గురు సభ్యులున్న కమిటీకి అప్పగించి ... అలా ఎన్నికైన వారే ఈ సైరస్ మిస్త్రీ.

టాటా గ్రూప్ చైర్మన్ జాబితా-List of Tata Group Chairmen

  1.    జమ్సేట్జి టాటా- Jamsetji Tata (1887–1904)
  2.    దొరబ్జి టాటా-Dorabji Tata (1904–1932)
  3.   నౌరోజీ శక్లత్వల- Nowroji Saklatwala (1932–1938)
  4.   జె.ఆర్ డి టాటా J. R. D. Tata (1938–1991)
  5.   రతన్ టాటా- Ratan Tata (1991–2012)  
  6. సైరస్ మిస్త్రీ -Cyrus Mistry (2012–present)

  •  ============================ 
Visit my website - > Dr.seshagirirao.com/