Sunday, March 18, 2012

అరబిందో,Aravindo,అరవిందో



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అరబిందో- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

అరబిందో(Aravindo,అరవిందో) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు. ఆధ్యాత్మిక సాధనవల్ల అత్యుత్తమ స్థాయికి ఎదిగిన మహనీయుల్లో శ్రీ అరవిందో ఒకరు .
  • జనము : ఆగస్టు 15, 1872,
  • మరణము : డిసెంబరు 5, 1950,
  • భార్య : మృణాళిని ,
  • తోబుట్టువులు : మూడో కుమారుడు , (ఒక సోదరి +4 సోదరులు )
  • చదువు : అద్భుతమైన మేధాశక్తి తో గీకు , లాటిన్‌ లాంటి విదేశీ భాషలలో ప్రావీణ్యము , ఐ.సి.యస్ . మొదటి స్థానము లో పాసయ్యారు . ఇంగ్లిష్ లో మంచి పావీణ్యము ఉంది .
బాల్యము : అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. తండ్రి వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు.

  • రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు : అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారం లో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.

తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు : పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.


  • సత్యన్వేషణకు రహదారి అరబిందో ఆశ్రమం : ప్రపంచాన్ని సత్యమార్గంలో నడిపించేందుకు యోగ సాధనలో చరిత్ర సృష్టించిన భగవాన్ శ్రీ అరవింద శ్రీ అన్నై పవిత్ర సమాధి తమిళనాడులోని పుదుచ్చేరిలో వెలసి ఉండటం ఎంతో భాగ్యమని ఆధ్యాత్మిక పెద్దలంటూ ఉంటున్నారు.

ఆధ్యాత్మికమార్గంలో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే త్రాటిపై నడిపించే తరహాలో ఎన్నో శుభకార్యాలు శ్రీ అరవిందర్, అన్నై ఆశీస్సులతో జరిగాయనడంలో ఎలాంటి సంశయం లేదు. పుదుచ్చేరికి వెళ్లి వస్తే.. మలుపులు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అంటుంటారు.

  • అలాగే శ్రీ అన్నై మాతను స్మరించుకుని ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించేవారికి ఆటంకాలుండవని భక్తుల విశ్వాసం. అలాగే జీవిత సుఖసంతోషాలు కలుగజేసే ఆ దేవదేవుని లీలలెన్నో ఉన్నాయని పుదుచ్చేరి అన్నై అరబిందో ఆశ్రమ స్థల పురాణాలు చెబుతున్నాయి.

భగవానుని లక్ష్యాన్ని మానవరూపం ధరించి (అరబిందోగా) పరమాత్ముని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జన్మించి, పుదుచ్చేరి ఆశ్రమంలో జీవించారని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు.

ప్రపంచ అభివృద్ధి కోసం అరబిందో స్వామి సేవలందించిన సంస్థల్లో పుదుచ్చేరి అరబిందో ఆశ్రమం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా అరవింద భగవానుడు

  • రాసిన లైఫ్‌డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి అన్నై రాసిన మధర్ అజెండాలతో పాటు పలు ఆధ్మాత్మిక రచనలు మానవమాత్రుని జీవితానికి ఎంతగానో సహకరిస్తున్నాయి. అలాగే మానవాభివృద్ధికి అవసరమైన దైవ, ఆధ్యాత్మిక సూచనలు అందిస్తున్నాయి. అటువంటి మహనీయుని ఆధ్యాత్మిక మార్గములో మానవుడు పయనించేందుకు వీలుగా అరబిందో మహాత్ముని ఉపదేశాలు, ఆధ్యాత్మిక సూచనలు దేశంలోనే గాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు మార్గదర్శకం చేసిన శ్రీ అన్నై అరవిందో అన్నై ఆశీస్సులను పొందేందుకు వీలుగా చెన్నై నగరంలోని శ్రీ అరబిందో మదర్స్ సొసైటి తరపున చెన్నై వెస్ట్ మాంబళం, నంగనల్లూరు, అంబత్తూరు అనే మూడు ప్రాంతాల్లో భక్తులకు ఆధ్యాత్మిక సూచనలు అందిస్తోంది.

పుదుచ్చేరిలోని ఆశ్రమ వాతావరణం తరహాలో చెన్నై నగరంలో వందలాది మంది భక్తులు వచ్చి వెళ్లేందుకు వీలుగా, దీంతో పాటు ప్రపంచంలోని ఆధ్యాత్మిక ప్రియుల రాకపోకలకు సత్యజీవియ కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రంలో భగవాన్, అన్నై పవిత్ర శక్తితో కూడిన వస్తువులతో సమాధిని ఏర్పాటు చేయడం, భగవాన్ అన్నై అరబిందో అన్నైల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ధ్యానమందిరాలను ఏర్పాటు చేయనున్నారు
  • ===================================
Visit my website - > Dr.seshagirirao.com/

Friday, January 13, 2012

Mokshagundam Visvesvaraya,మోక్షగుండం విశ్వేశ్వరయ్య


  • image : courtesy with surya news paper.

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Mokshagundam Visvesvaraya,మోక్షగుండం విశ్వేశ్వరయ్య- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



నేడు మన దేశం సుభిక్షంగా పంట, పొలాలతో... వరద ముంపులేని ప్రాంతాలతో తులతూగడానికి కారణం ఓ మహామనిషి. ఊళ్లకు ఊళ్లనే తన గర్భంలో కలిపేసుకునే ఉగ్ర గంగను ఆపిన మహా శక్తివంతుడాయన. ఏడుకొండలవాడా... ఎక్కడున్నావయ్యా.. అంటూ అలసిసొలసిన భక్తునికి వేంకటేశుని పాదాల చెంతకు వెళ్లే అతితేలికైన దారిని చూపించిన మహామేథావి. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక రంగానికి పుట్టిల్లయినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్లిలో సెప్టెంబరు 15, 1861న జన్మించారు విశ్వేశ్వరయ్య.

పూరి వివరాలకోసం -- తెలుగు వికిపెడియాలో చదవండి ->మోక్షగుండం విశ్వేశ్వరయ్య
  • ===============================


Visit my website - > Dr.seshagirirao.com/

Sunday, January 8, 2012

రామకృష్ణ పరమహంస , Sri Ramakrishna Paramahamsa

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -రామకృష్ణ పరమహంస- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ...



image : courtesy with ->http://www.ramakrishna.org/


శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గధాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు మరియు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించెను.


for full details see Telugu Wikipedia - > Ramakrishna paramahamsa

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, January 7, 2012

మొరార్జీ దేశాయి , Morarji Desai



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -మొరార్జీ దేశాయి , Morarji Desai- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


మొరార్జీజీ దేశాయి - భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్ననూ, నిషానే పాకిస్తాన్ నూ పొందిన ఏకైక భారతీయుడు. నాకన్నా ముందే చనిపోడని చరణ్ సింగ్ కు అంతనమ్మకమేమిటి? ఏడాదిలో ఇద్దరు లోక్ సభ సభ్యులు చనిపోతారు అని చెప్పాడట. మురార్జీ 99 ఏళ్ళు బ్రతికారు. మొరార్జీ దేశాయి బక్క పలచగా ఉంటాడు


  • వ్యక్తిగత వివరాలు
Morarji Ranchhodji దేశాయ్ (గుజరాతీ) - మొరార్జీ దేశాయి బాంబే ప్రెసిడెన్సీ లోని Bhadeli (Valsad)లో ఒక Anavil బ్రాహ్మణ కుటుంబం, (ఇప్పుడు గుజరాత్) లో ఫిబ్రవరి 29, 1896 న జన్మించారు. ప్రాథమిక పాఠశాల జీవితం సౌరాష్ట్ర Kundla స్కూల్, Savarkundla లలో జరిగినది .ముంబాయ్ విల్షన్‌ కాలేజీ లో డిగ్రీ పూర్తిచేసి గుజరాత్ సివిల్ సర్వీస్ లో చేరారు . 1924 లో బ్రిటిష్ సివిల్ సర్వీస్ ను వదిలి 1930 లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉధ్యమములో చేరారు . స్వాతంత్ర సమరయోధుడుగా చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు . గుజరాత్ లో ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడు గా చలామని అయ్యేవారు . 1934 మరియు 1937 లో బొంబే ప్రసిడెన్సీ లో రెవిన్యూ , మరియు హోం మినిష్టర్ గా సేవలందించారు . 1952 లో బోంబే స్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు . maraaThii భాషా రాస్టం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు .

  • రాజకీయ జీవితమము :

కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైనా ప్రధానమంత్రి జవర్లాల్ నెహౄ తోను అతని సహచరులతోను విభేదాలుండేవి. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా ... తనను కాదని నెహ్రూ అనుచరుడు లాల్ బహదూర్ శాస్త్రి నే ప్రధానమంత్రిని చేసారు . శాస్త్రి మరణాంతరము 1966 లో ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇందిరా గాంధీ తో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది .

1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి 1977 ఫిబ్రవరి - మార్చ్ నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభూత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు జనతాపార్టీ పేరుతో ఒకటయ్యాయి.మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16_మార్చ్ 10వ తేదీ మధ్య జరిగిన న్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. ఇందిరాగాంధీ- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చ్ 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకో బడింది. మార్చ్ 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. .


మరణము – ఏప్రిల్ 10, 1995
  • ==============================
Visit my website - > Dr.seshagirirao.com/

జమ్నాలాల్‌ బజాజ్‌ , Jamnalal Bajaj



  • image : courtesy with -> http://www.jamnalalbajajfoundation.org/


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జమ్నాలాల్‌ బజాజ్‌ , Jamnalal Bajaj- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము


ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయో ధుడు జమ్నాలాల్‌ బజాజ్‌... నేటి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నవంబర్‌ 4, 1888వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్‌ కోశాధికారిగా పని చేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి ''జమ్నాలాల్‌ బజాజ్‌'' అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.

For more details - >123Jamnalal Bajaj
  • =======================================
Visit my website - > Dr.seshagirirao.com/

Friday, January 6, 2012

సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ , sardar vallabhbhai patel



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ , sardar vallabhbhai patel - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



సర్ధార్‌ పటేల్‌ జయంతి: లాడ్‌బాయి, ఝవేవిభాయ్‌ దంపతులకు తేది 31-10- 1875వ సంవత్సరంలో జన్మించారు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌. ఇంగ్లండ్‌లో బారిస్టర్‌ పట్టాపుచ్చుకున్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గుజరాతీ విద్యా పీఠాన్ని స్థాపించాడు. 1931లో కాంగ్రెస్‌ మహా సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 547 దేశీయ సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసిన కార్యశూరుడు.స్వాతంత్య్రానంతరం ఉపప్రధానిగా పని చేశాడు.

1928లో బర్దోలీ సత్యాగ్రహ సందర్భంలో బ్రిటీష్‌ ప్రభుత్వమే రాజీకి వచ్చే విధంగా చేసిన పటేల్‌ సాహసాన్ని ప్రశంసి స్తూ... గాంధీజీ ఆయనను సర్దార్‌ అని సంబోధించారు. నాటి నుండి వల్ల భాయ్‌ పటేల్‌ పేరు సర్దార్‌ పటేల్‌గా స్థిరపడిపో యింది. పటేల్‌ హోం మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌ నిజాం సంస్థానంపై పోలీస్‌ చర్య జరిగింది. ఉక్కుమనిషి (ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా), ఇండియన్‌ బిస్మార్క్‌ అనే బిరు దులు ఉన్న సర్ధార్‌ పటేల్‌ డిసెంబర్‌ 15, 1950వ సంవత్సరంలో మరణించారు. 1991లో పటేల్‌ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ... భారత అత్యున్నత పౌరపురస్కారం ''భారతరత్న'' ను ప్రకటించింది (మరణానంతరం).


  • ====================================

Visit my website - > Dr.seshagirirao.com/

Thursday, January 5, 2012

దాదాసాహెబ్‌ ఫాల్కే ,Dhundiraj Govind Phalke, Dada Saheb Falkhe



  • image : courtesy with http://wikipedia.org/

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --దాదాసాహెబ్‌ ఫాల్కే ,Dhundiraj Govind Phalke, Dada Saheb Falkhe- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


జయంతి: 30-4-1870 .దాదాసాహెబ్‌ దుండిరాజ్‌ గోవింద ఫాల్కే మహారాష్టల్రోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. పురావస్తు శాఖలో డ్రాఫ్ట్‌‌సమన్‌గా, ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. 3-5-1913న ఫాల్కే మొదటి చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ విడుదలైంది. అదే మొట్టమొదటి భారతీయ కథా (మూకీ) చలన చిత్రం. అందువల్లనే ఫాల్కే భారతీయ చలన చిత్ర పితామహుడుగా పేరుపొందారు. 1914లో ఆయన రెండవ చిత్రం ‘మోహినీ భస్మాసుర’ విడుదలయింది. ఆయన నిర్మించిన చివరి చిత్రాలు ‘సేతుబంధన్‌’, ‘గంగావతరణ్‌’, ఫాల్కే పేరిట కేంద్ర ప్రభుత్వం చలన చిత్ర రంగానికి విశిష్టసేవలు చేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తోంది.

దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ ) - ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు. మరణము - ఫిబ్రవరి 16, 1944. .1966లో ఇతని పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడినది. రాజా హరిశ్చంద్ర 1913, దాదాసాహెబ్ ఫాల్కేచే దర్శకత్వం వహింపబడినది.

సినీ ప్రస్థానం

* రాజా హరిశ్చంద్ర (1913)
* శ్రీ కృష్ణ జన్మ (1918)
* కలియా మర్దాన్ (1919)
* సేతు బంధన్ (1923)
* గంగావతరన్ (1937)

  • ========================================


Visit my website - > Dr.seshagirirao.com/